సంక్రాంతి పండగ పూర్తి కావొస్తొంది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి హైదరాబాద్ వైపునకు భారీగా వాహనాలు తరలిరానున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ నివారణపై నల్గొండ జిల్లా పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇందుకోసం ముందస్తు రోడ్ మ్యాప్ ను ప్రకటించారు. ఫలితంగా వాహనదారులు ఇబ్బందులు లేకుండా సాఫీగా వెళ్లిపోవచ్చని సూచించారు.

విజయవాడ - హైదరాబాద్ (నేషనల్ హైవే- 65) మార్గ మధ్యంలోని చిట్యాల, పెద్ద కాపర్తి వద్ద ప్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ నిత్యం ట్రాఫిక్ సమస్య నెలకొంటోంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నట్లు నల్గొండ జిల్లా పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ రూట్స్ తెలుసుకోండి :
1) గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు : గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చే వాహనదారులు మిర్యాలగూడ, హాలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ చేరుకోవచ్చు.
2) మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు : మాచర్ల, నాగార్జునసాగర్, పెద్దవూర, కొండమల్లెపల్లి , చింతపల్లి, మాల్ మీదుగా వెళ్లొచ్చు.
3) నల్లగొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు : నల్లగొండ, మార్రిగూడ బై పాస్, మునుగోడు, నారాయణపూర్, చౌటుప్పల్ (ఎన్.హెచ్ 65)మీదుగా హైదరాబాద్ చేరుకోవచ్చు.
4.) విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారి వాహనాలు… కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, హాలియా,చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ వెళ్లొచ్చు.
5). ఎన్. హెచ్ 65 (విజయవాడ -హైదరాబాద్ )రహదారి పై చిట్యాల,పెద్దకాపర్తిలో ప్లై ఓవర్ నిర్మాణాలు జరుగుతున్నందున ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలుంటున్నాయి. ఈ సమస్య లేకుండా వెళ్లాలనుకునేవారు… చిట్యాల నుంచి భువనగిరి వైపునకు వెళ్లాలి. అక్కడ్నుంచి ఘట్ కీసర్, ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా హైదరాబాద్ చేరుకోవచ్చు.
నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ… సంక్రాంతి పండగ పూర్తి చేసుకున్న ప్రజలంతా తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలన్నదే పోలీస్ శాఖ లక్ష్యమన్నారు.
{{/usCountry}}నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ… సంక్రాంతి పండగ పూర్తి చేసుకున్న ప్రజలంతా తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలన్నదే పోలీస్ శాఖ లక్ష్యమన్నారు.
{{/usCountry}}"ట్రాఫిక్ రద్దీ కారణంగా ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో దారి మళ్లింపు చర్యలు అమలు చేస్తున్నాం. ప్రయాణికులు పోలీస్ శాఖ సూచించిన మార్గాలను అనుసరించండి. ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, ఓర్పుతో ప్రయాణించాలి. రోడ్డు భద్రతలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం” అని సూచించారు.
పండగ రోజుల్లో ట్రాఫిక్ పోలీసులు కీలక కూడళ్ల వద్ద విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు. డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ నిఘాతో ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని వివరించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా డయల్ 100ని సంప్రదించవచ్చని విజ్ఞప్తి చేశారు.