SCR Charlapalli Tiruchanur Weekly Express : తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు…. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్లోని చర్లపల్లి నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుచానూరు మధ్య కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు సర్వీసును రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని…. ఇప్పటివరకు ప్రత్యేక రైలుగా సేవలందించిన ఈ సర్వీసును ఇకపై రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
- చర్లపల్లి – తిరుచానూరు – చర్లపల్లి వీక్లీ స్పెషల్(రైలు నంబరు 07017/07018) రైలు… ఇకపై రెగ్యులర్ సర్వీసుగా ఉంటాయి. దీంతో రైలు నంబరు 17059/17060 (చర్లపల్లి – తిరుచానూరు – చర్లపల్లి) వీక్లీ ఎక్స్ప్రెస్గా పట్టాలెక్కనుంది.
- రైల్వే అధికారులు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం…. ఈ కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ సర్వీసులు 2026 మే నెల నుంచే అందుబాటులోకి రానున్నాయి.
- చర్లపల్లి - తిరుచానూరు వీక్లీ ఎక్స్ప్రెస్(రైలు నంబర్ 17059) సర్వీసు… 17.05.2026 (ఆదివారం) నుంచి ప్రారంభం కానుంది. తిరుగు ప్రయాణంలో తిరుచానూరు - చర్లపల్లి వీక్లీ ఎక్స్ప్రెస్(రైలు నంబర్ 17060) సర్వీస్…. 18.05.2026 (సోమవారం) నుంచి తన సేవలను ప్రారంభించనుంది.
చర్లపల్లి నుంచి తిరుచానూరు - ఆగే స్టేషన్లు:

ఆదివారం రాత్రి 21:30 గంటలకు చర్లపల్లి స్టేషన్ నుండి బయలుదేరి మల్కాజ్గిరి (22.15), కాచిగూడ (22.40), షాద్నగర్ (23.29) మీదుగా ప్రయాణిస్తుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత మహబూబ్నగర్ (00.15), వనపర్తి రోడ్ (01.19), గద్వాల్ (01.45) స్టేషన్లకు చేరుకుంటుంది. అనంతరం కర్నూలు సిటీ (03.35), డోన్ (04.45), గుత్తి (05.43), తాడిపత్రి (06.33), ఎర్రగుంట్ల (07.28), కడప (07.58), రాజంపేట (08.48), రేణిగుంట (10.30) మీదుగా ప్రయాణించి సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది.
తిరుచానూరు నుంచి చర్లపల్లి….
తిరుగు ప్రయాణంలో ఈ రైలు సోమవారం సాయంత్రం 16:00 గంటలకు తిరుచానూరులో బయలుదేరుతుంది. రేణిగుంట (16.13), రాజంపేట (17.08), కడప (17.58), ఎర్రగుంట్ల (18.23), తాడిపత్రి (19.23), గుత్తి (20.58), డోన్ (23.55) స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. మంగళవారం తెల్లవారుజామున కర్నూలు సిటీ (00.50), గద్వాల్ (02.05), వనపర్తి రోడ్ (02.29), మహబూబ్నగర్ (03.40), షాద్నగర్ (04.29), కాచిగూడ (05.50), మల్కాజ్గిరి (06.25) స్టేషన్లకు చేరుకుని, చివరగా మంగళవారం ఉదయం 08.00 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
ఈ ఎక్స్ప్రెస్ రైలులో అన్ని వర్గాల ప్రయాణికులకు అనుకూలంగా ఉండేలా కోచ్లను కేటాయించారు. ఈ రైలులో మొత్తం 2-సెకండ్ ఏసీ (2AC) కోచ్లు, 7-థర్డ్ ఏసీ (3AC) కోచ్లు, 7-స్లీపర్ క్లాస్ కోచ్లు, 4-జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.