PM Modi Speech in Hyderabad : ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకున్న ఆయన… ముందుగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆ తర్వాత సాయంత్రం పరేడ్ గ్రౌండ్ వేదికగా బీజేపీ తలపెట్టిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు.
తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం - ప్రధాని మోదీ

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ…. ముందుగా తెలుగులో మట్లాడారు. 'ప్రియమైన తెలంగాణ ప్రజలారా…హృదయపూర్వక శుభాకాంక్షలు' అంటూ ప్రసంగం ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ లో తొలిసారిగా బీజేపీ గెలిచిందన్నారు. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మొన్నటి అసెంబ్లీలో ఎన్నికల్లో అస్సోంలోనూ విజయం సాధించామని…. పుదిచ్చేరిలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైందని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే ఎక్కడ అవినీతి రాజ్యమేలుతుందని ప్రధాని మోదీ విమర్శించారు. బెంగాల్ ప్రజలు టీఎంసీ, లెఫ్ పార్టీలను పక్కనపెట్టారని… మమతా బెనర్జీ నియంతృత్వాన్ని ఎదిరించారని చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీ విస్తరిస్తోందన్నారు.
“తెలంగాణలో అందరి నోట ఒకటే మాట వినిపిస్తోంది. తెలంగాణలో కూడా బీజేపీ సర్కార్ ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతి ఏటా దేశంలో ఏదో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో కొందరు గెలుస్తారు, కొందరు ఓడుతారు. కానీ ఈ సారి జరుగుతున్న చర్చ ఎప్పుడూ జరగలేదు. బెంగాల్ ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛావాయువు పీల్చుకుంటున్నారు. పదేళ్ల క్రితం బెంగాల్లో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉండేవారు. ఇప్పుడు 200 మందికి పైగా బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు. మొదట్లో బీజేపీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండేవారు… అందులో ఒకరు తెలంగాణ వ్యక్తి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా భారీ మెజార్టీతో గెలుస్తాం” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కుటుంబ పార్టీలే అని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. దేశంలో 14 ఇండస్ట్రియల్ కారిడార్ల పనులు జరుగుతున్నాయని… అందులో ఒకటి జహీరాబాద్లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉందని…. కాంగ్రెస్ ఎక్కడున్నా ఒకటే మోడల్ అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు అలవికాని హామీలు ఇస్తారని… ఆ తర్వాత సాకులు వెతుకుతారని చెప్పారు. తెలంగాణలో కూడా ఇదే జరుగుతోందని విమర్శనాస్త్రాలను సంధించారు.
{{/usCountry}}బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కుటుంబ పార్టీలే అని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. దేశంలో 14 ఇండస్ట్రియల్ కారిడార్ల పనులు జరుగుతున్నాయని… అందులో ఒకటి జహీరాబాద్లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉందని…. కాంగ్రెస్ ఎక్కడున్నా ఒకటే మోడల్ అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు అలవికాని హామీలు ఇస్తారని… ఆ తర్వాత సాకులు వెతుకుతారని చెప్పారు. తెలంగాణలో కూడా ఇదే జరుగుతోందని విమర్శనాస్త్రాలను సంధించారు.
{{/usCountry}}కాంగ్రెస్ విద్వేష రాజకీయాలను రెచ్చగొడుతోందని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ MMCగా మారిందని… MMC అంటే ముస్లిం లీగ్ మావోవాది అని దుయ్యబట్టారు. మావోయిస్టులతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని… తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపించినందుకు ప్రజలు బాధపడుతున్నారని చెప్పుకొచ్చారు.
మావోయిస్టులకు అండగా కాంగ్రెస్ - మోదీ విమర్శలు
“కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మావోయిస్టులకు అండగా ఉన్నాయి. మావోయిస్టులు తమ అంతిమ శ్వాసను లెక్కబెట్టుకుంటున్నారు. మావోయిస్టులపై చర్యలు తీసుకోడానికి కాంగ్రెస్ ముందుకు రాలేదు. కాంగ్రెస్ పార్టీ మావోయిస్ట్ పార్టీగా మారింది.తెలంగాణ పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఉంటే మావోయిస్టులను అణిచివేసేవారు. ఇప్పుడు తెలంగాణ మావోయిస్టు రహితంగా మారుతోంది” అంటూ ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
యుద్ధం కారణంగా ఇంధనం సంక్షోభం వచ్చిందిని ప్రధాని మోదీ వివరించారు. అయినా ఇంధనం రేట్లు పెంచడం లేదన్న ఆయన… పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని కోరారు. మెట్రో సేవలను వాడుకోవాలని… ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.