హైదరాబాద్‌లో కత్తులతో పొడిచి, తుపాకీతో కాల్చి రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య

హైదరాబాద్‌లో దారుణ హత్య జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారిని కత్తులతో పొడిచి, తుపాకీతో కాల్చి చంపారు. పాత పగలే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Published on: Dec 08, 2025 12:38 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నంను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. నిందితులు పక్కా ప్రణాళికతో చంపేశారు. హత్య జరిగిన తీరు భయంకరంగా ఉంది. మెుదట కత్తులతో పొడిచి.. ఆ తర్వాత తుపాకీతో కాల్చి చంపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ జవహర్ నగర్‌లో సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నంను వెంబడించారు. 54 ఏళ్ల రియల్టర్ వెంటరత్నం తన స్కూటీ మీద ప్రయాణిస్తుండగా దుండగులు అతన్ని వెంటపడ్డారు. మెుదట కత్తితో అతడిపై దాడి చేశారు. తర్వాత తమ వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో తుపాకీ శబ్ధానికి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రక్తపు మడుగులో పడిపోయిన వెంకటరత్నం అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెంటనే చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తులో ఈ సంఘటన వెనుక మునుపటి శత్రుత్వం కారణమై ఉండవచ్చని తేలింది. ఈ సంఘటన వెనుక ఉన్న కచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు వెంటరత్నం కుటుంబ సభ్యుల నుండి మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. మృతుడు వెంకటరత్నంపై కూడా రౌడీ షీట్ ఉన్నట్టుగా తెలిసింది.

విద్యార్థిని మృతి

రోడ్డు ప్రమాదంలో బీటెక్ చదివే విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణం శివానగర్‌కు చెందిన దాసరి హాసిని(18) ఘటకేసర్ మండలం పరిధిలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ హాస్టల్‌లో ఉంటుంది. శనివారం తన స్నేహితుడు అక్షయ్‌తో కలిసి బుల్లెట్ బైక్ మీద ఉప్పల్‌కు వెళ్లారు.

రాత్రి 2 గంటల సమయంలో ఘట్‌కేసర్ వైపు తిరిగి వస్తుండగా నారపల్లి జైన్ అపార్ట్‌మెంట్ సమీపంలో బైక్ అదుపు తప్లి కింద పడింది. వెనకాల కూర్చున్న హాసిని తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. అక్షయ్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.