...
...
Next Story

Telangana : గ్రామ పంచాయతీలకు మరో శుభవార్త - కేంద్రం నుంచి రూ. 387 కోట్లు విడుదల

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది. ఆర్థిక సంఘం నిధుల కింద రూ. రూ.387 కోట్లను విడుదల చేసింది. మొదటి విడత, రెండో విడత కలిపి ఇప్పటివరకు రూ. 647 కోట్ల నిధులను రిలీజ్ చేసింది.

Published on: Feb 22, 2026, 11:04:30 IST
Advertisement

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకమండళ్లు కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఇటీవలనే ఎన్నికలు పూర్తి కాగా… సర్పంచ్ లు, ఉపసర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టారు. తాజాగా వారికి శిక్షణ తరగతులను కూడా నిర్వహిస్తున్నారు.

రెండో విడత నిధులు విడుదల…

గ్రామ పంచాయతీ
గ్రామ పంచాయతీ

ఇక రాష్ట్రంలో కొత్త పాలకమండళ్లు కొలువుదీరటంతో పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయిపోయింది. ఇటీవలనే తొలి విడతగా కేంద్ర ప్రభుత్వం రూ. 259.36 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మరోసారి కేంద్రం తీపి కబురు చెప్పింది. రెండో విడత కింద నిధులను విడుదల చేసింది.

కేంద్రం ప్రభుత్వం రెండో విడతగా దాదాపు రూ. 387 కోట్లను విడుదల చేసింది. తొలి విడతగా ఇప్పటికే దాదాపు రూ. 260 కోట్లు విడుదల చేయగా.. మొత్తంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు తెలంగాణ గ్రామ పంచాయతీల కోసం రూ. 647 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇదే విషయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం… తెలంగాణకు దాదాపు రూ. 3,000 కోట్లు వచ్చే అవకాశం ఉంది. మొదటి విడత కింద రూ. 259.36 కోట్లును కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా మరో 387 కోట్లను విడుదల చేయగా… ఈ నిధులన్నీ నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి వెళ్తాయి. మిగిలిన నిధులను కూడా దశలవారీగా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోతే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం… ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపింది. బీసీ రిజర్వేషన్లతో పాటు పలు అంశాలను పక్కనపెట్టి… ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ చేసింది.

గత ఏడాది డిసెంబర్ లో 3 విడతల్లో ఎన్నికలను పూర్తి చేసింది. ఆ తర్వాత వెంటనే సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణస్వీకారాలను కూడా పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్నిచోట్ల తప్పితే …. అన్ని గ్రామాల్లోనూ పాలకవర్గాలు కొలువుదీరాయి. దీంతో ఆర్థిక సంఘం నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయినట్లు అయిపోయింది. నిధులు జమవుతున్న నేపథ్యంలో… గ్రామాల్లో అభివృద్ధి పనులకు అడ్డంగులు తొలగిపోనున్నాయి. కొత్త సర్పంచులు కూడా గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఫోకస్ పెట్టే పనిలో పడ్డారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe