సికింద్రాబాద్, సిర్పూర్ కాగజ్నగర్ మార్గంలో ప్రయాణించే రైలు ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం రెండు జనసాధారణ్ అన్రిజర్వ్డ్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు 2026 సెప్టెంబర్ 4న అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
రైళ్ల సమయాలు, మార్గాల వివరాలు:
- రైలు నంబర్ 07235 (సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్నగర్): ఈ రైలు సెప్టెంబర్ 4 మధ్యాహ్నం 12:10 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి, అదే రోజు సాయంత్రం 17:30 (5:30) గంటలకు సిర్పూర్ కాగజ్నగర్ చేరుకుంటుంది.
- రైలు నంబర్ 07236 (సిర్పూర్ కాగజ్నగర్ - హైదరాబాద్) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు సెప్టెంబర్ 4 సాయంత్రం 18:00 (6:00) గంటలకు సిర్పూర్ కాగజ్నగర్ నుంచి బయలుదేరి, రాత్రి 23:15 (11:15) గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
స్టాపేజీల వివరాలు:

{{^htLoading}} {{/htLoading}}
ఈ రెండు జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
ఈ రైళ్లలోని అన్ని భోగీలు అన్రిజర్వ్డ్ (సాధారణ) కోచ్లేనని, ప్రయాణికులు జనరల్ టికెట్లతో నేరుగా ప్రయాణించవచ్చని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏ. శ్రీధర్ తెలిపారు.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}