indiramma housing scheme : జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం
జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పేదల సొంతింటి కలలను నిజం చేసే ప్రతిష్టాత్మక ‘ఇందిరమ్మ ఇండ్ల’ రెండో విడత మంజూరు కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఇందిరమ్మ గృహ నిర్మాణ ఉత్సవం ప్రారంభమవుతుందని, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కోలం-కొఠారి గ్రామంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం రెండో దశను ప్రారంభిస్తారన్నారు.

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు, శాసనమండలి సభ్యులు దండే విఠల్, ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సభాస్థలి కోసం పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కొఠారి గ్రామంలో గిరిజన కుటుంబాల ఇందిరమ్మ ఇండ్లలను పరిశీలించారు.
పేదలకు గౌరవప్రదమైన జీవితం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన వస్తుందని పొంగులేటి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణం ఆర్భాటాలకు మాత్రమే పరిమితమైందన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 4 లక్షల ఇండ్ల నిర్మాణానికి రూ. 22,500 కోట్లతో శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఇంటి నిర్మాణ పురోగతికి అనుగుణంగా దశలవారీగా రూ. 5 లక్షలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టుగా పొంగులేటి గుర్తుచేశారు. ఏప్రిల్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1 లక్ష 20 వేల ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, జూన్ నాటికి 2 లక్షల 35 వేల ఇండ్లు పూర్తవుతాయని వెల్లడించారు.
మొదటి, రెండో విడతలకే పరిమితం కాకుండా అర్హత గల ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అనేది నిరంతరం కొనసాగుతుందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
మహాలక్ష్మి, గృహజ్యోతి, రేషన్ కార్డులు, ఇందిరా మహిళా శక్తి, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలలో ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. కోలం-కోఠారి గ్రామంలో నిర్మించిన గృహాలు ఆదివాసీ కుటుంబాల గృహ అవసరాలను తీర్చాయని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులైన మహిళలతో ముచ్చటించారు. అలాగే సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో 2026-28 సంవత్సరాలకు గాను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అర్హులైన పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులు పంపిణీ చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


