...
...
Next Story

Special Trains : దసరా, దీపావళి వేళ తెలుగు ప్రయాణికులకు శుభవార్త - 98 ప్రత్యేక రైళ్లు పొడిగింపు!

South Central Railway Special Trains : దసరా, దీపావళి, ఛట్ పండుగల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 98 వారపు ప్రత్యేక రైళ్లను పొడిగించింది. నవంబర్ నెలాఖరు వరకు ఇవి అందుబాటులో ఉంటాయి.

Published on: Sep 10, 2026, 19:50:21 IST
Advertisement

South Central Railway Special Trains : వచ్చే దసరా, దీపావళి మరియు ఛట్ పూజ పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ అందించింది. వివిధ ప్రాంతాలకు నడిచే పలు వారపు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మొత్తం 98 సర్వీసులను నవంబర్ 2026 చివరి వరకు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ప్రత్యేక రైళ్ల పొడిగింపు
ప్రత్యేక రైళ్ల పొడిగింపు

ఈ నిర్ణయంతో పండుగల వేళ స్వగ్రామాలకు వెళ్లేవారికి… ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకునే వారికి సీట్ల కొరత నుంచి ఉపశమనం లభించనుంది. పొడిగించిన రైళ్లు, నడిచే రోజులు, సర్వీసుల పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

పొడిగించిన ప్రత్యేక రైళ్ల వివరాలు:

  • సికింద్రాబాద్ - నహర్లాగన్ (ట్రైన్ నం. 07046) : ప్రతి శుక్రవారం నడిచే ఈ రైలును అక్టోబర్ 2, 2026 నుంచి అక్టోబర్ 30, 2026 వరకు (5 సర్వీసులు) పొడిగించారు.
  • నహర్లాగన్ - సికింద్రాబాద్ (ట్రైన్ నం. 07047 ): ప్రతి సోమవారం నడిచే ఈ సర్వీసు అక్టోబర్ 5, 2026 నుంచి నవంబర్ 2, 2026 వరకు (5 సర్వీసులు) అందుబాటులో ఉంటుంది.
  • హైదరాబాద్ - కొల్లాం (ట్రైన్ నం. 07193) : ప్రతి శనివారం నడిచే ఈ రైలును అక్టోబర్ 3, 2026 నుంచి నవంబర్ 28, 2026 వరకు (9 సర్వీసులు) అందుబాటులో ఉంచారు.
  • కొల్లాం - హైదరాబాద్ (ట్రైన్ నం. 07194) : ప్రతి సోమవారం నడిచే ఈ రైలు అక్టోబర్ 5, 2026 నుంచి నవంబర్ 30, 2026 వరకు (9 సర్వీసులు) నడుస్తుంది.
  • సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ (ట్రైన్ నం. 07425) : ప్రతి ఆదివారం నడిచే ఈ సర్వీసును అక్టోబర్ 4, 2026 నుంచి నవంబర్ 29, 2026 వరకు (9 సర్వీసులు) పొడిగించారు.
  • శ్రీకాకుళం రోడ్ - సికింద్రాబాద్ (ట్రైన్ నం. 07426) : ప్రతి సోమవారం నడిచే ఈ రైలు అక్టోబర్ 5, 2026 నుంచి నవంబర్ 30, 2026 వరకు (9 సర్వీసులు) నడుస్తుంది.
  • చర్లపల్లి - తిరువణ్ణామలై(అరుణాచలం) (ట్రైన్ నం. 07001) : ప్రతి గురువారం నడిచే ఈ రైలు అక్టోబర్ 1, 2026 నుంచి నవంబర్ 26, 2026 వరకు (9 సర్వీసులు) అందుబాటులో ఉంటుంది.
  • తిరువణ్ణామలై - చర్లపల్లి (ట్రైన్ నం. 07002) : ప్రతి శుక్రవారం నడిచే ఈ సర్వీసు అక్టోబర్ 2, 2026 నుంచి నవంబర్ 27, 2026 వరకు (9 సర్వీసులు) నడుస్తుంది.
  • జాల్నా - తిరుపతి (ట్రైన్ నం. 07814) : ప్రతి గురువారం నడిచే ఈ రైలు అక్టోబర్ 1, 2026 నుండి నవంబర్ 26, 2026 వరకు (9 సర్వీసులు) అందుబాటులో ఉంటుంది.
  • తిరుపతి - జాల్నా (ట్రైన్ నం. 07815) : ప్రతి శుక్రవారం నడిచే ఈ రైలు అక్టోబర్ 2, 2026 నుంచి నవంబర్ 27, 2026 వరకు (9 సర్వీసులు) నడుస్తుంది.
  • హెచ్.ఎస్. నాందేడ్ - తిరుచానూరు (ట్రైన్ నం. 07603): ప్రతి మంగళవారం నడిచే ఈ సర్వీసు అక్టోబర్ 6, 2026 నుంచి నవంబర్ 24, 2026 వరకు (8 సర్వీసులు) పొడిగించారు.
  • తిరుచానూరు - హెచ్.ఎస్. నాందేడ్ (ట్రైన్ నం. 07604) : ప్రతి బుధవారం నడిచే ఈ రైలు అక్టోబర్ 7, 2026 నుంచి నవంబర్ 25, 2026 వరకు (8 సర్వీసులు) అందుబాటులో ఉంటుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks