South Central Railway Trains : రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి - దానాపూర్ స్టేషన్ల మధ్య నడిచే ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇరువైపులా కలిపి మొత్తం 18 సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చారు.
టైమింగ్స్ వివరాలు :
- రైలు నెంబర్ 07091 (చర్లపల్లి - దానాపూర్): ఈ రైలు ప్రతి శనివారం మధ్యాహ్నం 13.00 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, సోమవారం అర్ధరాత్రి 00.30 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది. ఈ సర్వీసులు 01.08.2026 నుండి 26.09.2026 వరకు అందుబాటులో ఉంటాయి (మొత్తం 09 సర్వీసులు).
- రైలు నెంబర్ 07092 (దానాపూర్ - చర్లపల్లి): ఈ తిరుగు ప్రయాణ రైలు ప్రతి సోమవారం తెల్లవారుజామున 03.00 గంటలకు దానాపూర్ లో బయలుదేరి, మంగళవారం ఉదయం 10.00 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ సర్వీసులు 03.08.2026 నుండి 28.09.2026 వరకు అందుబాటులో ఉంటాయి (మొత్తం 09 సర్వీసులు).
ప్రధాన స్టాపింగ్లు (రైలు ఆగే స్టేషన్లు):

ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట, రామగుండం, సిర్పూర్ కాగజ్నగర్, బల్హర్షా, చందా ఫోర్ట్, గోండియా, బాలాఘాట్, నైన్పూర్, జబల్పూర్, కట్ని, సత్నా, మాణిక్పూర్, ప్రయాగ్రాజ్ ఛేవ్కీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్, బక్సర్, అరా స్టేషన్లలో ఆగుతాయి.
ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికులకు అన్ని రకాల వసతులు కల్పించారు. ఇందులో 2AC, 3AC, స్లీపర్ క్లాస్ (Sleeper Class), జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ప్రయాణాలను సురక్షితంగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ www.scr.indianrailways.gov.in ను చూడొచ్చు.