SCR Holi Special Trains : ప్రయాణికులకు అలర్ట్ - ఏపీ, తెలంగాణ మీదుగా ‘హోలీ’ ప్రత్యేక రైళ్లు, తేదీలివిగో

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ ఇచ్చింది. హోళీ పండగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి - షాలిమార్ మధ్య వీటిని నడపనున్నట్లు పేర్కొంది.

Published on: Feb 14, 2026 5:08 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. హోళీ పండగ సమీపిస్తున్న వేళ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి - షాలిమార్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. మొత్తం 6 సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్ల మీదుగా వెళ్లనన్నాయి.

ప్రత్యేక రైలు
ప్రత్యేక రైలు

చర్లపల్లి - షాలిమార్ ప్రత్యేక రైళ్లు…

దక్షిణ మధ్య రైల్వే వివరాల ప్రకారం... చర్లపల్లి - షాలిమార్ (ట్రైన్ నెంబర్ 07512) మధ్య ఫిబ్రవరి 26, మార్చి 1, మార్చి 5వ తేదీలో ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఈ ట్రైన్ ఉదయం 05. 40 గంటలకు చర్లప్లలి నుంచి ప్రారంభమై... మరునాడు ఉదయం 11.20 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది.

ఇక షాలిమార్ - చర్లపల్లి (ట్రైన్ నెంబర్ 07513) మధ్య కూడా ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఫిబ్రవరి 27, మార్చి 2, మార్చి 6 తేదీల్లో అందుబాటులో ఉంటాయి. ఈ ట్రైన్ షాలిమార్ నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు బయల్దేరి... మరునాడు రాత్రి 09.50 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

ఆగే స్టేషన్లు…

ఈ 6 ప్రత్యేక రైళ్లు... నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు,అకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామల్ కోట, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలసం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, బరంపూర్ తో పాటు సంత్రగాచి స్టేషన్లలో ఆగుతాయి.

ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీప్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు.