మల్టీ-మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (MMTS) విస్తరణ, హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ (RRR) కారిడార్ల వెంబడి రైల్వే టెర్మినళ్ల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కీలక ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్ రైల్వే కనెక్టివిటీకి అవసరమైన భూసేకరణ, బుల్లెట్ రైలు కారిడార్లతో సహా, వంటి అంశాలపై సమగ్ర వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికలను (DPRలు) సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు.

సచివాలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో కలిసి ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు సంజయ్ జాజు. తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీకి సంబంధించిన 21 కీలక అంశాలను సమీక్షించారు. వీటిలో రైల్వే అండర్పాస్లు, ఓవర్బ్రిడ్జ్ల నిర్మాణం, అప్రోచ్ రోడ్ల అభివృద్ధి, రోడ్ల విస్తరణ పనులు, రైల్వే లైన్ల డబ్లింగ్, చర్లపల్లి రైల్వే స్టేషన్కు ప్రజా రవాణా కనెక్టివిటీని మెరుగుపరిచే చర్యలు ఉన్నాయి.
తెలంగాణ ఆర్థిక, పారిశ్రామిక, ప్రాంతీయ అభివృద్ధికి రైలు కనెక్టివిటీ ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలన్నారు సీఎస్. ప్రాజెక్టులను నిర్దేశిత కాలపరిమితిలోగా పూర్తి చేయాలని ప్రధాన కార్యదర్శి శాఖా అధికారులకు, జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు.
రూ.50,870 కోట్ల అంచనా పెట్టుబడితో 2,023 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 17 రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్లను పరిశీలన కోసం రైల్వే బోర్డుకు ఇప్పటికే సమర్పించినట్లు ఎస్సీఆర్ అధికారులు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇస్తూ, ప్రాజెక్టుల అమలును ప్రభావితం చేస్తున్న అపరిష్కృత సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలను గుర్తించేందుకు రైల్వే, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సంయుక్త తనిఖీలు నిర్వహించాలని సీఎస్ తెలిపారు.
ఈ సమావేశంలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల పురోగతి, భూసేకరణకు సంబంధించిన సవాళ్లు, వివిధ శాఖల నుండి అవసరమైన పరిపాలనా అనుమతులపై కూడా సమీక్ష జరిగింది. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో పాల్గొన్నవారు చర్చించారు. పీఎం గతిశక్తి కార్యక్రమం కింద నిధులు సమీకరించేందుకు డీపీఆర్లను సిద్ధం చేయాలని నిర్ణయించారు.
{{/usCountry}}ఈ సమావేశంలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల పురోగతి, భూసేకరణకు సంబంధించిన సవాళ్లు, వివిధ శాఖల నుండి అవసరమైన పరిపాలనా అనుమతులపై కూడా సమీక్ష జరిగింది. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో పాల్గొన్నవారు చర్చించారు. పీఎం గతిశక్తి కార్యక్రమం కింద నిధులు సమీకరించేందుకు డీపీఆర్లను సిద్ధం చేయాలని నిర్ణయించారు.
{{/usCountry}}రాష్ట్రవ్యాప్తంగా రైల్వే ప్రాజెక్టుల అమలును సులభతరం చేసేందుకు పురపాలక పరిపాలన, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి), రెవెన్యూ, ఇంధన, రోడ్లు అండ్ భవనాల శాఖల అధికారులు ఎస్సీఆర్తో కలిసి పనిచేయాలని సంజయ్ జూజు అన్నారు. ఈ సమావేశానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, నవీన్ మిట్టల్తో పాటు ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.