తెలంగాణలో కొలువుల జాతర మళ్లీ ఊపందుకోనుంది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) రేపు (మంగళవారం) ఒకేసారి మూడు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయబోతోంది. ఈ మేరకు కమిషన్ చైర్మన్ వెంకటేశం పలు వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేశామని, అందులో భాగంగానే రేపు ఈ నోటిఫికేషన్లు వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ నెలలోనే మరిన్ని నోటిఫికేషన్లు - ఛైర్మన్ వెంకటేశం

ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇక్కడితో ఆగదని…. ఈ నెలలోనే అత్యధిక సంఖ్యలో నోటిఫికేషన్లను వరుసగా విడుదల చేయడానికి కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోందని TGPSC చైర్మన్ వెంకటేశం పేర్కొన్నారు. రేపు విడుదల చేయబోయే 3 నోటిఫికేషన్లలో భాగంగా వివిధ శాఖల్లో ఉన్న 25 సింగిల్ పోస్ట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హతలు, వయోపరిమితి మరియు దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాల సమాచారాన్ని టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
3,800 పోస్టులకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలో కొత్త నియామకాలకు సంబంధించి దాదాపు 3,800 ఉద్యోగ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఇప్పటికే పూర్తి స్థాయిలో అనుమతులు మంజూరు చేసిందని కమిషన్ చైర్మన్ వివరించారు. ఆర్థిక శాఖ అనుమతి లభించిన పోస్టులన్నింటికీ త్వరలోనే వరుసగా నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. ముఖ్యంగా అటవీ శాఖలోఖాళీగా ఉన్న 3,093 పోస్టులను పెద్ద ఎత్తున భర్తీ చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు.
భవిష్యత్తులో కమిషన్ నిర్వహించబోయే రిక్రూట్మెంట్ పరీక్షలన్నీ పారదర్శకంగా, లీకేజీలకు తావులేకుండా ఉండేందుకు కంప్యూటర్ (ఆన్లైన్) విధానంలోనే నిర్వహిస్తామని చైర్మన్ వెంకటేశం స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ రిక్రూట్మెంట్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామన్నారు.
ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకువస్తున్నట్లు కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. కమిషన్ పరిధిలోని అన్ని రకాల ఉద్యోగ పరీక్షలను రాబోయే రోజుల్లో పూర్తిగా ఆన్లైన్ (సీబీటీ) విధానంలోనే నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఆన్లైన్ విధానం వల్ల పేపర్ లీకేజీలకు అస్సలు అవకాశం ఉండదన్నారు. వీలైతే అభ్యర్థులు కంప్యూటర్ ముందు పరీక్ష పూర్తి చేసి సబ్మిట్ చేసిన వెంటనే.. తాము ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాశారో (స్కోర్) కూడా అక్కడికక్కడే తెలిసిపోయేలా సరికొత్త టెక్నాలజీని తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.
{{/usCountry}}ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకువస్తున్నట్లు కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. కమిషన్ పరిధిలోని అన్ని రకాల ఉద్యోగ పరీక్షలను రాబోయే రోజుల్లో పూర్తిగా ఆన్లైన్ (సీబీటీ) విధానంలోనే నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఆన్లైన్ విధానం వల్ల పేపర్ లీకేజీలకు అస్సలు అవకాశం ఉండదన్నారు. వీలైతే అభ్యర్థులు కంప్యూటర్ ముందు పరీక్ష పూర్తి చేసి సబ్మిట్ చేసిన వెంటనే.. తాము ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాశారో (స్కోర్) కూడా అక్కడికక్కడే తెలిసిపోయేలా సరికొత్త టెక్నాలజీని తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.
{{/usCountry}}