టీజీఎస్ఆర్టీసీలో జాబ్స్.. నేటి నుంచి అప్లికేషన్.. ఇలా అప్లై చేయండి!

నిరుద్యోగులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తోంది. నేటి నుంచే అప్లికేషన్ మెుదలైంది.

Published on: Dec 30, 2025, 13:44:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ 198 పోస్టులకు రిక్రూట్‌మెంట్ చేస్తోంది. ఏదైనా గ్రాడ్యుయేట్, డిప్లొమా ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 30-12-2025న ప్రారంభమైంది. 20-01-2026న ముగుస్తుంది. అభ్యర్థులు www.tgprb.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగాలు
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగాలు

198 పోస్టుల్లో ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ(టీఎస్టీ): 84, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ(ఎంఎస్టీ): 114 పోస్టులు ఉన్నాయి. జీతం నెలకు రూ.27,080 నుంచి రూ.81,400 మధ్య ఉంటుంది. టీఎస్టీకి డిగ్రీ, ఎంఎస్టీకి ఆటోమొబైల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా అర్హత ఉండాలి. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.

తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ రిక్రూట్‌మెంట్ చేస్తోంది. రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మెడికల్ పరీక్షలు కూజా ఉంటాయి. దరఖాస్తు ఫీజు -ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 400, ఇతరులు రూ. 800 చెల్లించాలి. మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులకు అప్లయ్ చేసుకునే ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు రూ. 400, ఇతరులు రూ. 800 చెల్లించాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తులను TSLPRB వెబ్‌సైట్ (www.tgprb.in) లో ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే సమర్పించాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు వారి అర్హతను జాగ్రత్తగా తనిఖీ చేసుకోవాలి. పుట్టిన తేదీకి సంబంధించిన SSC/మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ ఉండాలి. 1 నుండి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ లేదా ఎంఆర్ఓ జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రం, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన తాజా కమ్యూనిటీ సర్టిఫికేట్ కావాలి. 2025 ఏప్రిల్ 1న లేదా ఆ తర్వాత జారీ చేసిన నాన్-క్రీమీ లేయర్ సర్టిఫికేట్ (BC అభ్యర్థులకు), 1 ఏప్రిల్ 2025న లేదా ఆ తర్వాత జారీ చేసిన EWS సర్టిఫికెట్ (వర్తిస్తే) ఉండాలి.

ఎలా దరఖాస్తు చేయాలి

మొబైల్ నంబర్‌ను యూజర్ ఐడీగా ఉపయోగించి TSLPRB వెబ్‌సైట్ www.tgprb.in లో నమోదు చేసుకోండి.

అర్హత ప్రకారం మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న పోస్ట్ ఎంచుకోండి.

ఎంచుకున్న పోస్ట్, కేటగిరీని బట్టి ఫీజు మొత్తాన్ని గమనించండి.

క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా అందుబాటులో ఉన్న ఇతర పద్ధతులను ఉపయోగించి రుసుము చెల్లించండి.

చెల్లింపు తర్వాత వినియోగదారు ఐడీతో TSLPRB వెబ్‌సైట్‌లో కొనసాగండి, దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.

పాస్‌పోర్ట్ ఫోటోగ్రాఫ్, సంతకం చిత్రాన్ని jpg ఫార్మాట్‌లో ఒకే ఫైల్‌గా సిద్ధం చేయండి. (30kb నుండి 100kb వరకు)

ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌తో ఫోటో ప్లస్ సంతకం ఫైల్‌ను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.

ఏ కాలమ్‌ను ఖాళీగా ఉంచకుండా అన్ని సంబంధిత వరుసలను జాగ్రత్తగా పూరించండి.

డిక్లరేషన్‌ను ఆమోదించండి, రిజిస్టర్డ్ మొబైల్‌కు పంపిన ఓటీపీతో కన్ఫామ్ చేయండి.

సమర్పించే ముందు అన్ని వివరాలను జాగ్రత్తగా ధృవీకరించండి.

దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయండి.

భవిష్యత్ ఉపయోగం కోసం సమర్పించిన దరఖాస్తు ఫారమ్ కాపీని PDFలో డౌన్‌లోడ్ చేసుకోండి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More