...
...
Next Story

Gen Z అనుకున్నది సాధించేలా ప్రభుత్వం సహకరిస్తుంది : ప్రధాని మోదీ

జన్‌ జీ అనుకున్నది సాధించేలా ప్రభుత్వం సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అంతరిక్ష రంగంలో కేంద్రం ఇస్తున్న మద్దతు వల్లే స్టార్టప్స్ వస్తున్నాయన్నారు.

Published on: Nov 27, 2025, 12:31:17 IST
Advertisement

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లోని స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యం గల భారతదేశ మొట్టమొదటి ప్రైవేట్‌ కమర్శియల్ లాంచ్ వెహికల్ విక్రమ్-1ని ఆవిష్కరించారు. స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ. 200,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది నెలకు ఒక ఆర్బిటల్ రాకెట్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంటుంది. అనేక ప్రయోగ వాహనాల ఎండ్-టు-ఎండ్ అభివృద్ధి, ఏకీకరణ, పరీక్ష కోసం దీనిని రూపొందించారు.

స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన మోదీ
స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన మోదీ

క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న ప్రధాని మోదీ ప్రసంగించారు. దశాబ్దాలుగా భారతదేశ అంతరిక్ష ప్రయాణానికి శక్తినిచ్చినందుకు ఇస్రోను ప్రశంసించారు. దాని విశ్వసనీయత, సామర్థ్యం, ప్రత్యేకమైన ప్రయోగాలు ప్రపంచంలో గుర్తింపు తెచ్చాయని కొనియాడారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న అంతరిక్ష రంగంలో అపూర్వమైన అవకాశాలను ప్రస్తావించారు. యువత ఆవిష్కరణలు, రిస్క్ తీసుకోవడం, కొత్త శిఖరాలకు చేరుకుంటున్నారన్నారు.

'నేడు దేశం అంతరిక్ష రంగంలో అపూర్వమైన అవకాశాన్ని చూస్తోంది. నేడు భారతదేశ అంతరిక్ష వ్యవస్థలో ప్రైవేట్ రంగం ఒక పెద్ద ముందడుగు వేస్తోంది. స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ భారతదేశం కొత్త ఆలోచన. ముఖ్యంగా యువ శక్తికి ప్రతిబింబం. మన యువత ఆవిష్కరణ, రిస్క్ తీసుకునే సామర్థ్యం, నేడు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.' అని ప్రధాని మోదీ అన్నారు.

భారతదేశ పురోగతి సంపద ద్వారా కాదని, సంకల్ప శక్తి ద్వారా నడిచిందని గుర్తు చేశారు. సైకిల్ మీద రాకెట్ మోసుకెళ్లే పరిస్థితి నుంచి మన ప్రస్థానం మెుదలైందని మోదీ గుర్తు చేశారు. వ్యవసాయం, వాతావరణ అంచనాల్లో మరింత విజ్ఞానం సాధించాలన్నారు. స్పేస్ సెక్టార్‌లో కో ఆపరేటివ్, ఎకో సిస్టమ్ తీసుకువచ్చామన్నారు. జన్‌జీ అనుకున్నది సాధించేలా ప్రభుత్వం సహకరిస్తుందని ఈ సందర్భంగా మోదీ హామీ ఇచ్చారు. ప్రైవేట్ రంగంలో అంతరిక్ష సంస్థలు పుట్టుకొస్తున్నాయని జన్‌జీ ఇంజినీర్లు, డిజెనర్లు, కోడర్స్, సైంటిస్టులు అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe