ఉత్తర తెలంగాణ ప్రజలు సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న వరంగల్ విమానాశ్రయ కల నెరవేరే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కావలసిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి…. ఆ స్థలాన్ని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కి అధికారికంగా అందజేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. శనివారం సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఈ విషయాన్ని పంచుకున్న ఆయన….. నిర్మించబోయే కొత్త విమానాశ్రయానికి ఏ పేరు పెడితే బాగుంటుందో సూచించాలని ప్రజలను కోరారు.

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ ప్రజల చిరకాల స్వప్నమైన ఎయిర్పోర్ట్ను సాకారం చేయడంలో తీవ్రంగా విఫలమైందని ఆరోపించారు. ఆ పార్టీ నాయకులు కేవలం తమ కుటుంబ ప్రయోజనాలు, విలాసవంతమైన ఫామ్హౌస్లపైనే శ్రద్ధ చూపారని విమర్శించారు. "ప్రజా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ కల ఎట్టకేలకు నిజరూపం దాలుస్తోంది," అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
వరంగల్ సమీపంలోని మామునూరు వద్ద విమానాశ్రయ నిర్మాణానికి కావలసిన భూసేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 295 కోట్లను కేటాయించిందని ముఖ్యమంత్రి తెలిపారు. కావలసిన స్థలాన్ని సేకరించి ఏఏఐకి అప్పగించడంతో ఇప్పుడు క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులు ఊపందుకుంటున్నాయని పేర్కొన్నారు.
ఏ పేరు పెట్టాలి..? సూచనలివ్వండి - సీఎం రేవంత్
వరంగల్లో రాబోయే ఈ విమానాశ్రయం కేవలం విమానాల రాకపోకలకు మాత్రమే పరిమితం కాదని…. ఇది ఈ ప్రాంతంలో పరిశ్రమలు, పర్యాటకం, విద్య, ఉద్యోగాలు మరియు భారీ పెట్టుబడులకు ఒక కొత్త ద్వారంగా మారుతుందని స్పష్టం చేశారు. "వేగంగా అభివృద్ధి చెందుతున్న, అనుసంధానమవుతున్న తెలంగాణకు సరికొత్త ప్రతీకగా నిలిచే మామునూర్ ఎయిర్పోర్ట్ నుంచి విమానం ఎక్కేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. వరంగల్ కొత్త ఎయిర్పోర్ట్కు మనం ఏ పేరు పెట్టాలి? మీ సూచనలను తెలియజేయండి," అని రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు.
మరోవైపు…. వరంగల్ ఎయిర్పోర్ట్ ప్రతిపాదిత డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధమవుతోందని, ఎయిర్పోర్ట్ భవనాల లేఅవుట్ రూపకల్పన తుది దశకు చేరుకుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి 'భూమి పూజ' నిర్వహించే అవకాశం ఉందని కిషన్ రెడ్డి వివరించారు.
{{/usCountry}}మరోవైపు…. వరంగల్ ఎయిర్పోర్ట్ ప్రతిపాదిత డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధమవుతోందని, ఎయిర్పోర్ట్ భవనాల లేఅవుట్ రూపకల్పన తుది దశకు చేరుకుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి 'భూమి పూజ' నిర్వహించే అవకాశం ఉందని కిషన్ రెడ్డి వివరించారు.
{{/usCountry}}ఇక సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ కు చాలా మంది ప్రముఖులతో పాటు నెటిజన్లు స్పందిస్తున్నారు. కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, సమ్మక్క సారక్క ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఇలా అనేక పేర్లను సూచిస్తూ… పోస్టులు చేస్తున్నారు.