రామేశ్వరంలో రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన నలుగురు అయ్యప్ప భక్తులు మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీకి చెందిన నలుగురు అయ్యప్ప భక్తులు కారును రోడ్డు పక్కన ఆపి నిద్రిస్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
తమిళనాడులో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రామేశ్వరంలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన నలుగురు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. రోడ్డు పక్కన కారు ఆపి నిద్రిస్తుండగా లారీ వచ్చి ఢీ కొట్టింది.

రోడ్డు పక్కన కారు ఆగి ఉందని, లారీ ఢీకొన్న సమయంలో అందులో ఉన్న వారందరూ నిద్రలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా, మరొకరికి గాయాలయ్యాయి. చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
బాధితులు శబరిమల యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్నారు. మృతుల్లో ముగ్గురు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కొరాపు కొత్తవలస గ్రామానికి చెందినవారు కాగా, నాలుగో వ్యక్తి గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాద ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. మృతి పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలు వెంటనే కుటుంబ సభ్యులకు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తెలుగు భక్తుడిపై దాడి
శబరిమల యాత్రలో భాగంగా తమిళనాడులోని పళని సుబ్రమణ్య స్వామి దర్శనానికి వెళ్లిన తెలుగు భక్తుడిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. నీటి సీసా ధర అధికంగా ఉందని అడిగినందుకు స్థానిక వ్యాపారి తెలుగు భక్తుడిపై దాడి చేశాడు. పెంచిన ధరను ప్రశ్నించడంతో దుకాణ యజమాని గాజు సీసాతో భక్తుడి తలను పగులగొట్టాడు.
ఘర్షణ చెలరేగినప్పుడు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు స్థానిక దుకాణం వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడారు. కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడి తర్వాత శబరిమలలో యాత్రికులకు జవాబుదారీతనం, సురక్షితమైన పరిస్థితులను కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలుగు భక్తులు దుకాణం ముందు గట్టిగా నిరసన తెలిపారు. యాత్రికుల పట్ల గౌరవం ఉండేలా, స్థానిక వ్యాపారాల నుండి ఇటువంటి దూకుడు ప్రవర్తనను నిరోధించడానికి అధికారులు జోక్యం చేసుకోవాలన్నారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకున్నారు. అయితే తెలుగు భక్తులను అడ్డుకుని.. స్థానిక వ్యాపారులకే మద్దతు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


