ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోందంటూ గత కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారానికి రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచనే లేదని రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ సీఎస్) కృష్ణబాబు స్పష్టం చేశారు. కేవలం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామే తప్ప, సంస్థను ప్రైవేట్ పరడం చేయడం లేదని ఆయన వివరించారు.
ప్రైవేటీకరణ లేదు…..

"ఆర్టీసీ ప్రైవేటీకరణ కావడం లేదు. సంస్థ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం లేదు. ఆర్టీసీ సిబ్బంది ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బందీ లేదు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాన్నే మనం కూడా ఏపీలో అనుసరిస్తున్నాం," అని కృష్ణబాబు వివరించారు.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన 'పీఎం ఈ-బస్ సేవా' పథకం కింద ఏపీఎస్ఆర్టీసీకి 750 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. రాష్ట్రంలోని 11 ప్రధాన నగరాల్లో ఈ పర్యావరణ హిత బస్సులను నడపనున్నారు. ఈ పథకం కింద వచ్చే బస్సుల నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వమే 'సిఇఎస్ఎల్' (CESL) ద్వారా కామన్ టెండర్ నిర్వహించి ఖరారు చేసింది.
గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) కింద వెట్ లీజు పద్ధతిలో ఈ టెండర్లు జరిగాయి. దీని ప్రకారం బస్సుల నిర్వహణతో పాటు డ్రైవర్లను కూడా సదరు ప్రైవేట్ సంస్థే సమకూరుస్తుంది. ఈ విధానం కేవలం కేంద్ర పథకం ద్వారా వచ్చే బస్సులకు మాత్రమే వర్తిస్తుందని…. మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పద్ధతి అమల్లో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కేంద్ర స్కీం ద్వారా నడిచే ఎలక్ట్రిక్ బస్సులకు కేంద్ర ప్రభుత్వం కిలోమీటరుకు రూ. 24 చొప్పున గ్రాంట్ ఇస్తుందని, దీనివల్ల ఆర్టీసీకి మొత్తంగా రూ. 1,774 కోట్ల మేర ప్రోత్సాహక నిధులు లభిస్తాయని కృష్ణబాబు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వ పథకంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా తీసుకువచ్చే కొత్త ఎలక్ట్రిక్ బస్సుల్లో ఆర్టీసీ సొంత ఉద్యోగులే డ్రైవర్లుగా ఉంటారని స్పెషల్ సీఎస్ స్పష్టం చేశారు.
{{/usCountry}}కేంద్ర ప్రభుత్వ పథకంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా తీసుకువచ్చే కొత్త ఎలక్ట్రిక్ బస్సుల్లో ఆర్టీసీ సొంత ఉద్యోగులే డ్రైవర్లుగా ఉంటారని స్పెషల్ సీఎస్ స్పష్టం చేశారు.
{{/usCountry}}"రాష్ట్ర ప్రభుత్వం తెచ్చే ఎలక్ట్రిక్ బస్సుల కోసం వెట్ పద్ధతిలో కాకుండా, 'డ్రై లీజ్' పద్ధతిలో టెండర్లు పిలిచే అంశంపై ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నాం. డ్రై విధానంలో టెండర్లు పిలిస్తే ఎలక్ట్రిక్ బస్సులను ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్లే నడుపుతారు. జనరల్ మెయింటెనెన్స్ కూడా మన సిబ్బందే చూసుకుంటారు" అని ఆయన వివరించారు. ఆర్టీసీకి చెందిన ఏ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించే ప్రసక్తే లేదని, సిబ్బంది అందరికీ పూర్తి ఉద్యోగ భద్రత ఉంటుందని కూటమి ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు.
ఆ వార్తల్లో నిజం లేదు - కృష్ణబాబు, స్పెషల్ సీఎస్
ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ సంస్థలకు రాసిస్తున్నారనే వార్తల్లో అస్సలు నిజం లేదని కృష్ణబాబు కొట్టిపారేశారు. ఈ-బస్సుల నిర్వహణ కోసం ఏపీఎస్ఆర్టీసీ డిపోలను ఈ-డిపోలుగా ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర టెండర్లు దక్కించుకున్న సంస్థలు ఒప్పంద కాలంలో కేవలం గ్యారేజ్ స్థల నిర్వహణ, ఛార్జింగ్ సదుపాయాల కోసం మాత్రమే ఆర్టీసీ స్థలాలను వాడుకుంటాయని, అంతేకాని ఆస్తులను ఎవరికీ విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం చేయడం లేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం విద్యాధరపురం, గుంటూరు -2, నెల్లూరు-2 వంటి డిపోలలో ఎలక్ట్రిక్, సివిల్ పనులు జరుగుతున్నందున….. అక్కడి కొందరు ఉద్యోగులను తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు పంపించామని, ఈ విషయంలో ఉద్యోగులు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆర్టీసీ సిబ్బంది జీతాలు, స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి వంటి ఉచిత ప్రయాణ పథకాల ఆర్థిక భారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని ఆయన వివరించారు. ఆర్టీసీపై వచ్చే ఎలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను, కార్మికులను ఆయన కోరారు.