SCR Tirupati Charlapalli Special Trains : తిరుపతి, హైదరాబాద్ మార్గంలో ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీని తగ్గించడంతో పాటు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు తిరుపతి - చర్లపల్లి (హైదరాబాద్) స్టేషన్ల మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతోంది.
రైళ్ల షెడ్యూల్ వివరాలు…
- రైలు నంబర్ 07417 (తిరుపతి - చర్లపల్లి) : ఈ ప్రత్యేక రైలు 2026 జులై 26వ తేదీ ఆదివారం రోజున రాత్రి 20:00 గంటలకు (రాత్రి 8:00) తిరుపతిలో బయలుదేరుతుంది. మరుసటి రోజు (సోమవారం) ఉదయం 09:15 గంటలకు చార్లపల్లికి చేరుకుంటుంది. ఈ మార్గంలో ఒక సర్వీస్ అందుబాటులో ఉంటుంది.
- రైలు నంబర్ 07418 (చర్లపల్లి - తిరుపతి) : తిరుగు ప్రయాణంలో ఈ ప్రత్యేక రైలు 2026 జులై 27వ తేదీ సోమవారం రోజున సాయంత్రం 16:30 గంటలకు (సాయంత్రం 4:30) చార్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు (మంగళవారం) ఉదయం 08:00 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ మార్గంలో కూడా ఒక సర్వీస్ నడుస్తుంది.

ప్రయాణికులందరికీ అనువుగా ఉండేలా ఈ ప్రత్యేక రైళ్లలో వివిధ రకాల తరగతులను అందుబాటులోకి తెచ్చారు. ఈ రైళ్లలో 2-టైర్ ఏసీ , 3-టైర్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లను ఏర్పాటు చేశారు.
రెండు వైపులా ప్రయాణించే ఈ ప్రత్యేక రైళ్లు మార్గమధ్యంలో అనేక ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ , కాజీపేట స్టేషన్లలో ఈ రైలుకు స్టాపేజీలు కల్పించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాన్లను అనుసంధానించే ఈ ప్రధాన స్టేషన్లలో రైలు ఆగడం వల్ల ఇరు రాష్ట్రాల ప్రయాణికులకు ఊరట లభించనుంది. టికెట్ల బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైనందున ప్రయాణికులు ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.