తిరుమల కల్తీ లడ్డూ వివాదంపై సీబీఐ ఇచ్చిన నివేదిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వానికి వైసీపీ సూటిగా ప్రశ్నలు సంధిస్తోంది. శ్రీవారి లడ్డూ కేంద్రంగా తప్పుడు చేశారని… కానీ సీబీఐ నివేదిక ద్వారా అసలు విషయాలు బయటికొచ్చాయని చెబుతోంది. ఇదే విషయాన్ని ఆ పార్టీ నేతలు ప్రస్తావిస్తూ… కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తున్నారు.
పరిహార హోమం…

ఇదే విషయంపై వైసీపీ ముఖ్య నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం చేపట్టారు. తిరుపతిలోని ఆయన నివాసం వద్దే హోమం కార్యక్రమం జరుగుతోంది. 'సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ పవన్ కళ్యాణ్ శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తీవ్రమైన అపనింద మోపారని…. హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామిపై రాజకీయ ఆరోపణలు చేశారని భూమన ఆరోపించారు.
ఆవు కొవ్వుతో లడ్డు ప్రసాదం తయారు చేశారు అని విష ప్రచారం చేశారని భూమని ఫైర్ అయ్యారు." పంది కొవ్వు, చేప కొవ్వు కలిసింది అని తప్పుడు కూతలు కూశారు. కానీ అలాంటివేమి లేవని సీబీఐ… సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది. జంతువుల కొవ్వు ఎక్కడా కలవలేదని, రాజకీయ ప్రమేయం లేదని చాలా స్పష్టంగా చెప్పింది. వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై వేసిన నిందల కారణంగా శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం చేస్తున్నాం. ఈ హోమం ద్వారా వాళ్ళు వేసిన నింద పోతుందని భావిస్తున్నాం' అని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.
సీబీఐ విచారణ జరిపించాలి - భూమన సవాల్
కూటమి నేతలతప్పుడు ప్రచారం, రాజకీయ నాటకాలను సీబీఐ నివేదిక బహిర్గతం చేసిందని భూమన అభిప్రాయపడ్డారు. దమ్ముంటే… 2014 నుంచి 2019 వరకు జరిగిన నెయ్యి సరఫరాపై సీబీఐ విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరారు. నివేదిక బయటికి వచ్చిన తర్వాత కూడా… దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేయటం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు.
{{/usCountry}}కూటమి నేతలతప్పుడు ప్రచారం, రాజకీయ నాటకాలను సీబీఐ నివేదిక బహిర్గతం చేసిందని భూమన అభిప్రాయపడ్డారు. దమ్ముంటే… 2014 నుంచి 2019 వరకు జరిగిన నెయ్యి సరఫరాపై సీబీఐ విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరారు. నివేదిక బయటికి వచ్చిన తర్వాత కూడా… దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేయటం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు.
{{/usCountry}}