Avinash Tiwary Slams Bollywood Six Pack Obsession: హిందీ చిత్ర పరిశ్రమలో నటన కంటే బాహ్య సౌందర్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నటుడు అవినాష్ తివారీ ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ కన్నన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవినాష్ తివారీ, బాలీవుడ్ హీరోల తీరును ఇతర ఇండస్ట్రీలతో పోల్చారు.
వాళ్లు వెంపర్లాడటం చూశారా?

"ప్రపంచంలో ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా 60 ఏళ్ల వయసున్న వారు సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ బాడీల కోసం వెంపర్లాడటం చూశారా? హాలీవుడ్లో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ గానీ, సిల్వెస్టర్ స్టాలోన్ గానీ ఇప్పుడు అలాంటి పనులు చేయడం లేదు. వారికి తమ శరీరాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. సౌత్ సినిమాల్లో కూడా నటనకే పెద్దపీట వేస్తారు. కానీ, హిందీలో మాత్రం కేవలం గ్లామర్, బాడీ బిల్డింగ్ను అమ్ముకుంటున్నారు" అని అవినాష్ తివారీ షాకింగ్ కామెంట్స్ చేశారు.
బాక్స్ ఆఫీస్ లెక్కల గోల ఏంటి?
ప్రేక్షకులు కూడా సినిమాల్లోని కళను చూడటం మానేసి, కేవలం కలెక్షన్ల లెక్కలనే గమనిస్తున్నారని అవినాష్ తివారీ విమర్శించారు. మన దగ్గర మనోజ్ బాజ్పాయ్, విక్రాంత్ మాస్సే, ప్రతీక్ గాంధీ వంటి అద్భుతమైన నటులు ఉన్నారని, వారందరినీ 'అండర్ రేటెడ్' అని పిలుస్తూనే, వారి సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్లకు మాత్రం వెళ్లడం లేదని ప్రేక్షకుల తీరును అవినాష్ తివారీ ఎత్తి చూపారు.
"నైపుణ్యానికి ఇక్కడ విలువ లేదు. ఎవరైనా చొక్కా విప్పేసి ఒక ఫోటో దిగితే చాలు, అది సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది. కేవలం అందం మాత్రమే ప్రాధాన్యత అయితే, సినిమాల్లో మోడల్స్ సరిపోతారు, నటులు ఎందుకు?" అని అవినాష్ తివారీ ప్రశ్నించారు. ఈ ధోరణి వల్ల సినిమా అసలు ఉద్దేశ్యం దెబ్బతింటోందని ఆయన అభిప్రాయపడ్డారు.
సూపర్ స్టార్ల అభిమానుల ఆగ్రహం
అవినాష్ తివారీ తన వ్యాఖ్యల్లో ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించలేదు. అయితే, 58 ఏళ్ల వయసులో 'పఠాన్', 'జవాన్' చిత్రాల కోసం సిక్స్ ప్యాక్ చూపించిన షారుఖ్ ఖాన్, ఎప్పుడూ ఫిట్నెస్కు ప్రాధాన్యత ఇచ్చే సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్లను ఉద్దేశించే అవినాష్ ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు భావిస్తున్నారు.
{{/usCountry}}అవినాష్ తివారీ తన వ్యాఖ్యల్లో ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించలేదు. అయితే, 58 ఏళ్ల వయసులో 'పఠాన్', 'జవాన్' చిత్రాల కోసం సిక్స్ ప్యాక్ చూపించిన షారుఖ్ ఖాన్, ఎప్పుడూ ఫిట్నెస్కు ప్రాధాన్యత ఇచ్చే సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్లను ఉద్దేశించే అవినాష్ ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు భావిస్తున్నారు.
{{/usCountry}}ముఖ్యంగా రెడిట్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ఈ స్టార్ హీరోల అభిమానులు అవినాష్ తివారీ ఎండగట్టిన తీరును టార్గెట్ చేస్తున్నారు. అనవసరంగా సీనియర్ హీరోలపై విమర్శలు చేయడం సరికాదని వారు కామెంట్ చేస్తున్నారు.
అవినాష్ తివారీ ప్రస్తుత పరిస్థితి
అవినాష్ తివారీ నటించిన తాజా చిత్రం 'గిన్నీ వెడ్స్ సన్నీ 2' ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదలైంది. మేధా శంకర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. మొదటి రోజు కేవలం 30 లక్షల రూపాయల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.
ప్రస్తుతం అవినాష్ తివారీ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ తెరకెక్కిస్తున్న నెట్ఫ్లిక్స్ ఓటీటీ సిరీస్ 'ఓ సాథీ రే'లో నటిస్తున్నారు. ఈ ఓటీటీ సిరీస్లో అదితి రావు హైదరీ, అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.