Actor Manoj Bajpayee Buys 4.45 Acre Land: బాలీవుడ్ వెర్సటైల్ నటుడు మనోజ్ బాజ్పాయి రియల్ ఎస్టేట్ రంగంలో తన పెట్టుబడులు పెడుతున్నారు. మహారాష్ట్రలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం లోనావాలా సమీపంలో ఆయన భారీగా వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు.
4.45 ఎకరాల స్థలం

పుణే జిల్లా ముల్షీ తాలూకా పరిధిలోని తైల్బైల్ గ్రామంలో 1.80 హెక్టార్లు (సుమారు 4.45 ఎకరాలు) ఉన్న ఈ స్థలాన్ని తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ది ఫ్యామిలీ మ్యాన్ ఓటీటీ సిరీస్ హీరో మనోజ్ బాజ్పాయి. చిత్ర పరిశ్రమలో ఆర్జించిన ఆదాయాన్ని ఇలా సురక్షితమైన ఆస్తుల్లో మళ్లించడం సెలబ్రిటీలకు అలవాటే.
హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వికారాబాద్, చేవెళ్ల ప్రాంతాల్లో టాలీవుడ్ ప్రముఖులు ఫామ్హౌస్ ల్యాండ్స్ కొనుగోలు చేసినట్లే, ముంబై-పుణే సినీ తారలు లోనావాలా, ముల్షీ ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నారు. ప్రాపర్టీ డేటా రీసెర్చ్ సంస్థ 'సిఆర్ఈ మ్యాట్రిక్స్' (CRE Matrix) వెల్లడించిన పత్రాల ఆధారంగా ఈ ల్యాండ్ డీల్ వివరాలు బయటకు వచ్చాయి.
రూ.1.37 కోట్ల డీల్.. రిజిస్ట్రేషన్ వివరాలు ఇవే!
ఈ వ్యవసాయ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2026 ఆగస్టు 25న పూర్తయింది. విమల్చంద్ ఖిమ్రాజ్ జైన్ అనే వ్యక్తి నుంచి మనోజ్ బాజ్పాయి ఈ ఆస్తిని రూ.1,37,31,000 వెచ్చించి కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో స్టాంప్ డ్యూటీ రూపంలో రూ.6.86 లక్షలు, రిజిస్ట్రేషన్ రుసుము కింద రూ.30 వేలు చెల్లించినట్లు అధికారిక పత్రాలు చెబుతున్నాయి.
మనోజ్ బాజ్పాయికి రియల్ ఎస్టేట్ కొత్త కాదు!
పుణే నగరం నుంచి కేవలం రెండు గంటల ప్రయాణ దూరంలో ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి నిలయంగా ఆకట్టుకుంటోంది. మూడు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న మనోజ్ బాజ్పాయి.. 'సత్య', 'గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్', 'అలీగఢ్' వంటి వైవిధ్యమైన సినిమాలతో అద్భుత నటుడిగా గుర్తింపు పొందారు.
{{/usCountry}}పుణే నగరం నుంచి కేవలం రెండు గంటల ప్రయాణ దూరంలో ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి నిలయంగా ఆకట్టుకుంటోంది. మూడు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న మనోజ్ బాజ్పాయి.. 'సత్య', 'గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్', 'అలీగఢ్' వంటి వైవిధ్యమైన సినిమాలతో అద్భుత నటుడిగా గుర్తింపు పొందారు.
{{/usCountry}}ఓటీటీ వేదికలపై 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ ద్వారా అపారమైన ప్రజాదరణ సంపాదించుకున్నారు మనోజ్ బాజ్పాయి. నటనలోనే కాకుండా, ఆస్తుల నిర్వహణలోనూ మనోజ్ బాజ్పాయి సరైన ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు.
4 కమర్షియల్ ఆఫీస్ యూనిట్లు
గతంలో 2023 అక్టోబర్లో ముంబైలోని ఓషివారా ప్రాంతంలో వీరా దేశాయ్ రోడ్డులో ఉన్న 'సిగ్నేచర్ బిల్డింగ్'లో నాలుగు కమర్షియల్ ఆఫీస్ యూనిట్లను మనోజ్ బాజ్పాయి కొనుగోలు చేశారు. ఆ సమయంలో రూ.32 కోట్ల విలువైన ఆస్తుల కోసం రూ.1.86 కోట్లు స్టాంప్ డ్యూటీగా చెల్లించారు.
సెకండ్ హోమ్లకు నిలయంగా ముల్షీ!
అమితాబ్ బచ్చన్, కాజోల్, అజయ్ దేవగన్ వంటి దిగ్గజ తారల బాటలోనే మనోజ్ బాజ్పాయి కూడా కమర్షియల్, అగ్రికల్చరల్ ప్రాపర్టీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. లోనావాలా పరిధిలోని ముల్షీ రీజియన్ ప్రశాంతమైన వాతావరణానికి పేరుగాంచింది.
ధరలు మరింత పెరిగే అవకాశం
ముల్షీ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో వీకెండ్ హోమ్స్, ఫామ్హౌస్లు నిర్మించుకోవడానికి సెలబ్రిటీలు అమితమైన ఆసక్తి చూపుతుంటారు. నగర రద్దీ నుంచి ఉపశమనం పొందేందుకు 'సెకండ్ హోమ్' ఎంచుకోవాలనుకునే ముంబై, పుణే సంపన్నులకు ఈ ప్రాంతం ప్రధాన గమ్యస్థానంగా మారింది. మనోజ్ బాజ్పాయి చేసిన ఈ కొనుగోలుతో అక్కడ స్థలాల ధరలకు మరింత రెక్కలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.