ప్రజ్వల లైన్ క్రియేషన్స్ బ్యానర్పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్గా నటించిన సినిమా సుయోధన. ఈ మూవీలో డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించారు. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మించారు.
సుయోధన రిలీజ్ డేట్

అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సుయోధన సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. పలు హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన శ్రీ లక్ష్మి పిక్చర్స్ సంస్థ "సుయోధన" సినిమాను విడుదల చేస్తోంది.
సుయోధన టీజర్ లాంచ్ ఈవెంట్
తాజాగా ఇవాళ (మార్చి 15) సుయోధన టీజర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సుయోధన రిలీజ్ లాంచ్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యంగ్ హీరో, సీనియర్ హీరోయిన్పై నటుడు సాయి కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
నెక్ట్స్ ఏంటీ అనే క్యూరియాసిటీ
యాక్టర్ సాయికుమార్ మాట్లాడుతూ.. "ఇందాక దేవి ప్రసాద్ చెప్పినట్లు ఈ సినిమాలో నటిస్తున్న మాకే కొత్తగా అనిపించింది. నెక్ట్స్ ఏంటి అనే క్యూరియాసిటీ కలిగింది. మీలాగే మేము కూడా థియేటర్లో ఈ సినిమా చూసేందుకు వెయిట్ చేస్తున్నాం" అని అన్నారు.
గద్దర్ అవార్డ్ కూడా వచ్చింది
"మా టీమ్లో మూవీ చూసి వచ్చిన వాళ్లను అడుగుతున్నాం ఎలా అనిపించింది అని. ఈ మూవీని డైరెక్టర్, ప్రొడ్యూసర్ చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశారు. నేను ప్రియదర్శితో కలిసి కోర్ట్ సినిమా చేశాను. అది సూపర్ హిట్ అయింది, గద్దర్ అవార్డ్ కూడా పొందింది. ప్రియదర్శి నాకు బిడ్డ లాంటివాడు. ఈ జనరేషన్లో దర్శి లాంటి మంచి నటులతో కలిసి నేను వర్క్ చేయడం సంతోషంగా ఉంది" అని సాయి కుమార్ తెలిపారు.
సూపర్ హిట్ సినిమాల్లో జంటగా
"నేను ప్రేమ కన్నడలో చాలా సూపర్ హిట్ సినిమాల్లో జంటగా నటించాం. ఈ సినిమాలో ఆమె ఒక కీ రోల్ చేస్తోంది. సుయోధన సినిమా మంచి విజయం సాధించాలి. ఈ టీమ్ అందరికీ పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా" అని తన స్పీచ్ ముగించారు యాక్టర్ సాయి కుమార్.
కొత్త తరహా కంటెంట్ ఉంది
{{/usCountry}}"నేను ప్రేమ కన్నడలో చాలా సూపర్ హిట్ సినిమాల్లో జంటగా నటించాం. ఈ సినిమాలో ఆమె ఒక కీ రోల్ చేస్తోంది. సుయోధన సినిమా మంచి విజయం సాధించాలి. ఈ టీమ్ అందరికీ పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా" అని తన స్పీచ్ ముగించారు యాక్టర్ సాయి కుమార్.
కొత్త తరహా కంటెంట్ ఉంది
{{/usCountry}}యాక్టర్ దేవి ప్రసాద్ మాట్లాడుతూ.. "సుయోధన సినిమాను స్క్రీన్ మీద చూడాలని మేమూ వెయిట్ చేస్తున్నాం. ఇందులో ఒక కొత్త తరహా కంటెంట్ ఉంది. మంచి కాన్సెప్ట్తో వస్తున్న చిత్రమిది" అని అన్నారు.
అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచీ
"నేను ప్రియదర్శితో ఫస్ట్ టైమ్ కలిసి వర్క్ చేస్తున్నా. సాయి కుమార్ గారితో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచీ మంచి పరిచయం ఉంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేలా ఈ సినిమా ఉంటుంది" అని పేర్కొన్నారు నటుడు దేవి ప్రసాద్.