Dia Mirza On Climate Change Cause Men: ప్రకృతిని కాపాడుకోవాలంటూ సుద్దులు చెప్పే సెలబ్రిటీల మాటలు కొన్నిసార్లు ఎంతటి వివాదాలకు దారితీస్తాయో మరోసారి రుజువైంది. పర్యావరణ పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి తరఫున ప్రచారం చేసే గుడ్విల్ అంబాసిడర్గా, బాలీవుడ్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న దియా మీర్జా తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.
పురుషుల అహంకారమే కారణం

ప్రపంచాన్ని పీడిస్తున్న వాతావరణ మార్పులకు (Climate Change) పురుషుల అహంకారం, పురుషాధిక్య వ్యవస్థే (Patriarchy) కారణమంటూ దియా మీర్జా సంచలన ఆరోపణలు చేశారు.
నటి సోహా అలీ ఖాన్ నిర్వహిస్తున్న 'ఆల్ అబౌట్ హర్' అనే పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పర్యావరణ జర్నలిస్ట్ ఆరతి కుమార్-రావుతో కలిసి దియా మీర్జా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాతావరణ మార్పులపై చర్చ సాగుతుండగా దియా మీర్జా సంచలన వ్యాఖ్యలు చేశారు.
నూటికి నూరు శాతం వారే బాధ్యులు
"ఈ ప్రపంచంలో వాతావరణ మార్పులకు పురుషాధిక్యతే ప్రధాన కారణం. పురుషుల వల్లే పర్యావరణం ఇంతలా దెబ్బతింది" అని దియా మీర్జా పేర్కొన్నారు. పక్కనే ఉన్న సోహా అలీ ఖాన్ జోక్యం చేసుకుంటూ.. "పురుషుల అహంకారం (Male Ego) అంటావా?" అని ప్రశ్నించగా, దియా మీర్జా అవునంటూ మద్దతు పలికారు.
"అవును, మగాళ్లే వాతావరణంలో ఇంతటి అల్లకల్లోలానికి కారణం. నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అనుభవిస్తున్న నరకానికి, బాధలకు వారే నూటికి నూరు శాతం బాధ్యులు. కేవలం వెనుకబడిన దేశాల్లోనే కాదు, ధనిక దేశాల్లోనూ ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది" అని దియా మీర్జా గట్టిగా చెప్పుకొచ్చారు.
ఎకోఫెమినిజం వాదన.. జర్నలిస్ట్ వివరణ
ప్రకృతిని దోపిడీ చేయడం వెనుక సమాజంలో ఉన్న ఆధిపత్య ధోరణి ఉందంటూ ఈ పాడ్కాస్ట్లో 'ఎకోఫెమినిజం' (పర్యావరణం-మహిళా హక్కుల అనుసంధానం) అంశాన్ని వారు ప్రస్తావించారు. అయితే ఈ చర్చలో పాల్గొన్న జర్నలిస్ట్ ఆరతి కుమార్-రావు కొంత సమన్వయ ధోరణిని ప్రదర్శించారు.
{{/usCountry}}ప్రకృతిని దోపిడీ చేయడం వెనుక సమాజంలో ఉన్న ఆధిపత్య ధోరణి ఉందంటూ ఈ పాడ్కాస్ట్లో 'ఎకోఫెమినిజం' (పర్యావరణం-మహిళా హక్కుల అనుసంధానం) అంశాన్ని వారు ప్రస్తావించారు. అయితే ఈ చర్చలో పాల్గొన్న జర్నలిస్ట్ ఆరతి కుమార్-రావు కొంత సమన్వయ ధోరణిని ప్రదర్శించారు.
{{/usCountry}}"పురుషాధిక్యత అంటే కేవలం మగవారు మాత్రమే కాదు, స్త్రీవాదం అంటే కేవలం ఆడవారు మాత్రమే కాదు. మహిళలు కూడా పురుషాధిక్య ఆలోచనలను సమర్థించవచ్చు, అలాగే పురుషులు కూడా స్త్రీవాదానికి అండగా నిలబడవచ్చు" అని ఆమె వివరించారు.
సెలబ్రిటీల కపటత్వంపై నెటిజన్ల ఆగ్రహం
దియా మీర్జా వ్యాఖ్యల వీడియో ఎక్స్ (ట్విట్టర్), రెడ్డిట్ వంటి ప్లాట్ఫామ్లలో వైరల్గా మారడంతో నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కోట్లాది రూపాయల సంపాదనతో, ప్రైవేట్ జెట్ విమానాలు వాడుతూ, లగ్జరీ కార్లలో తిరుగుతూ సామాన్యుల కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ కార్బన్ ఉద్గారాలను (Carbon Footprint) విడుదల చేసే సెలబ్రిటీలు.. ఇలాంటి నీతులు చెప్పడం కపటత్వమేనని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
సమస్యను చాలా చిన్నదిగా చేసేశారు!
సామాన్య ప్రజలకు పర్యావరణం గురించి హితబోధ చేసే అర్హత ఏసీ రూముల్లో బతికే ఇలాంటి నటీమణులకు లేదని మండిపడుతున్నారు. పర్యావరణ కాలుష్యం, భూతాపం అనేవి పారిశ్రామికీకరణ, శిలాజ ఇంధనాల (Fossil Fuels) వాడకం, ప్రభుత్వాల విధాన లోపాలు, కార్పొరేట్ కంపెనీల స్వార్థం వల్ల వస్తున్న జాతీయ, అంతర్జాతీయ సమస్యలని నిపుణులు గుర్తుచేస్తున్నారు.
ఇంతటి సంక్లిష్టమైన గ్లోబల్ సమస్యకు కేవలం 'జెండర్ పాలిటిక్స్' (లింగ వివక్ష) రంగు పులిమి పురుషులదే తప్పు అనడం దియా మీర్జా అపరిపక్వతకు నిదర్శనమని విమర్శిస్తున్నారు. గత రెండు శతాబ్దాలుగా పెరిగిన ఫ్యాక్టరీలు, సాంకేతిక పరిజ్ఞానం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లిందే తప్ప.. ఇందులో కేవలం మగవారి అహమే కారణం అనడం హాస్యాస్పదమని నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు.
నెగెటివ్ ట్రెండింగ్లో దియా మీర్జా
దియా మీర్జా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 25 ఏళ్లు అవుతోంది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) తరఫున ఆమె గత కొన్నేళ్లుగా భారతదేశంలో గాలి కాలుష్యం, సుస్థిర అభివృద్ధిపై అవగాహన కల్పిస్తున్నారు. అయితే, దియా మీర్జా తాజా వ్యాఖ్యలతో మరోసారి నెగెటివ్ ట్రెండింగ్లోకి రావడమే కాకుండా.. తెలుగు ఆడియెన్స్ మీమ్స్ స్టైల్లో హీరో, విలన్ కొట్టుకుని కమెడియన్ను చంపేసినట్లుగా ఉన్నాయి.