ఓటీటీలోకి అఖండ 2.. సంక్రాంతి స్పెషల్ గా స్ట్రీమింగ్.. రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్ ఇదే!
నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ 2' సినిమా ఓటీటీ రిలీజ్ పై లేటెస్ట్ బజ్ ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ డిజిటల్ డెబ్యూ చేసే అవకాశముంది.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ తెలుగు సినిమా ‘అఖండ 2’. ఈ చిత్రానికి మిక్స్ డ్ టాక్ వచ్చింది. దురంధర్ సినిమా, అవతార్ 3 ఎఫెక్ట్ అఖండ 2 కలెక్షన్లపై పడింది. అఖండగా బాలకృష్ణ విశ్వరూపం చూపించిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడా? అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. దీనిపై లేటెస్ట్ బజ్ ఏంటో ఇక్కడ చూసేయండి.

అఖండ 2 ఓటీటీ
నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ 2' చిత్రం బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో రాణించలేకపోయినా ఓ మోస్తారుగా సాగిపోతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 12న థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రం 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు సినిమాలలో ఒకటిగా నిలవడంతో, దాని ఓటీటీ అరంగేట్రంపై ఆసక్తి పెరిగింది. నందమూరి నటించిన ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో ఆన్లైన్లో ప్రసారం కానుంది.
సంక్రాంతి స్పెషల్
అఖండ 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం థియేటర్లో రిలీజైన నాలుగు వారాలకు అఖండ 2 ఓటీటీలోకి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి స్పెషల్ గా ఈ మూవీ జనవరి 9న డిజిటల్ డెబ్యూ చేస్తుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అయితే సినిమా నిర్మాతలు లేదా ఓటీటీ ప్లాట్ఫామ్ దీనిపై ఇంకా అధికారిక సమాచారం ఇవ్వలేదు.
అఖండ 2 ఓపెనింగ్
ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం అఖండ 2కు అదిరే ఓపెనింగ్ కలెక్షన్లు దక్కాయి. గురువారం ప్రీవ్యూల ద్వారా రూ.8 కోట్లు, డిసెంబర్ 12న ఫస్ట్ డే రూ.22.5 కోట్లు దక్కాయి. అయితే రెండో రోజు శనివారం వసూళ్లు 31.11% తగ్గి రూ.15.5 కోట్లకు చేరాయి. ఆదివారం సినిమా రూ.15.1 కోట్లు ఖాతాలో వేసుకుంది. కానీ ఆ తర్వాత క్రమంగా వసూళ్లు తగ్గుతూ వస్తున్నాయి.
మూవీ స్టోరీ
అఖండ 2లో నందమూరి బాలకృష్ణ 'అఖండ'గా తిరిగి వచ్చారు. ఈయన ఒక భయంకరమైన రక్షకుడు. దైవిక శక్తిని ఉపయోగించి చెడుతో పోరాడుతుంటారు. ఆది పినిశెట్టి పోషించిన అతీంద్రియ శక్తులున్న కొత్త విలన్ ప్రవేశంతో సీక్వెల్ కథనం మారుతుంది. ఇది ఫాంటసీ, సంప్రదాయం, హై-వోల్టేజ్ యాక్షన్ను మిళితం చేస్తుంది. విడుదల తర్వాత సినిమాకు మిశ్రమ స్పందనలు వచ్చాయి. సినిమాలో బాలకృష్ణ, సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్ర తదితరులు నటించారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


