Allu Arjun Fans Chase His Car In Vizag: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాకతో విశాఖపట్నం సముద్ర తీరం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. నగరంలోని ఇనార్బిట్ మాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన 'ఏఏఏ సినిమాస్' (AAA Cinemas) మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన బన్నీకి అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు.
కారు చేజింగ్, హ్యాంగ్ అవుట్.. రచ్చ లేపిన ఫ్యాన్స్!

అభిమానుల రద్దీతో బీచ్ రోడ్డు ప్రాంతంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. విశాఖ విమానాశ్రయం నుంచి బీచ్ రోడ్డు మీదుగా ఇనార్బిట్ మాల్కు వెళ్లే దారిపొడవునా అభిమానులు పండగ వాతావరణం సృష్టించారు. అల్లు అర్జున్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ను వందలాది మంది అభిమానులు బైక్లపై ఛేజ్ చేస్తూ అనుసరించారు.
అభిమానుల ఉత్సాహాన్ని చూసిన అల్లు అర్జున్ కారు సన్రూఫ్ నుంచి బయటకు వచ్చి చేతులు ఊపుతూ అభివాదం చేశారు. వైజాగ్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తొలుత భారీ ర్యాలీ నిర్వహిద్దామని భావించినప్పటికీ, భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించారు.
సహకరించాలని అభిమానుల సంఘం సోషల్ మీడియా ద్వారా కోరినప్పటికీ, బన్నీని స్వయంగా చూడాలనే ఆత్రుతతో వేలాది మంది రోడ్లపైకి చేరుకోవడంతో కాసేపు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భద్రతా సిబ్బంది, పోలీసులు కష్టపడి జనాలను అదుపు చేయాల్సి వచ్చింది.
'గంగోత్రి' జ్ఞాపకాలు..
మల్టీప్లెక్స్ ప్రారంభించిన అనంతరం స్టేజ్పై అభిమానులతో అల్లు అర్జున్ ముచ్చటించారు. "నాకు విశాఖతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. గంగోత్రి సినిమా షూటింగ్ కోసం ఇక్కడ రోడ్లపై తిరిగిన రోజులు నాకింకా గుర్తున్నాయి. ఏదో ఒక రోజు ఇక్కడ మాల్ వస్తుందని, అందులో నా మల్టీప్లెక్స్ ఓపెన్ చేస్తానని అప్పట్లో కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు కనీసం బయట కాలు పెట్టలేని పరిస్థితి వచ్చింది" అని అల్లు అర్జున్ చెప్పారు.
అభిమానుల కోసం స్టేజ్ పైనే సెల్ఫీలు!.. 'రాకా' మూవీ అప్డేట్!
ప్రసంగం మధ్యలో అభిమానులు ఫొటోల కోసం నినాదాలు చేయడంతో, తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపి వారిని స్టేజ్పైకి పిలిపించుకుని ఓపిగ్గా సెల్ఫీలు ఇచ్చారు అల్లు అర్జున్. ఆ తర్వాత అభిమానులు నిరంతరం 'రాకా' (Raaka) అని అరుస్తుండటంతో సినిమా వివరాలను బయటపెట్టారు. డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రానున్న ఈ క్రేజీ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా జరుగుతోంది.
{{/usCountry}}ప్రసంగం మధ్యలో అభిమానులు ఫొటోల కోసం నినాదాలు చేయడంతో, తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపి వారిని స్టేజ్పైకి పిలిపించుకుని ఓపిగ్గా సెల్ఫీలు ఇచ్చారు అల్లు అర్జున్. ఆ తర్వాత అభిమానులు నిరంతరం 'రాకా' (Raaka) అని అరుస్తుండటంతో సినిమా వివరాలను బయటపెట్టారు. డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రానున్న ఈ క్రేజీ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా జరుగుతోంది.
{{/usCountry}}"నేను నేరుగా 'రాకా' షూటింగ్ స్పాట్ నుంచే ఇక్కడికి వచ్చాను. నా ఫ్యాన్స్ను కలవడానికి వైజాగ్ వెళ్లాలని చెప్పి స్పెషల్గా బ్రేక్ తీసుకున్నాను. మిమ్మల్ని చూశాక మళ్లీ ముంబై వెళ్లిపోతాను" అని బన్నీ ప్రకటించడంతో హాల్ అంతా ఈలలతో నిండిపోయింది.
అత్యంత భారీ బడ్జెట్తో
కాగా ఈ క్రేజీ సైన్స్ ఫిక్షన్ చిత్రం రాకాను సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తుండగా, సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.
భారీ అంచనాలతో
ఇక భారీ అంచనాలతో తెరకెక్కుతున్న అల్లు అర్జున్, అట్లీ, దీపికా పదుకొణె కాంబో మూవీ రాకా 2027 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.