Bigg Boss 10 Elimination On First Day: బుల్లితెరపై సంచలనం సృష్టించే రియాలిటీ షో బిగ్ బాస్. నాలుగు దక్షిణాది భాషల్లో ఒకేరోజున బిగ్ బాస్ షో ప్రారంభం కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇవాళ (సెప్టెంబర్ 6) బిగ్ బాస్ రియాలిటీ షో ఆరంభం కానుంది.
నాగార్జున-విజయ్ సేతుపతి

తెలుగులో కింగ్ నాగార్జున హోస్ట్గా చేయనుండగా.. తమిళంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. హీరో విజయ్ సేతుపతి హోస్ట్గా చేస్తున్న బిగ్ బాస్ 10 తమిళ సీజన్లో తొలి రోజే షాకింగ్ ఎలిమినేషన్ చోటుచేసుకుంది.
ఈ షో ఇవాళ సాంయంత్రం ప్రసారం కానుంది. ఈపాటికే మొదటి ఎలిమినేషన్ వివరాలు బయటకు వచ్చేశాయి. ఈసారి సరికొత్త ఫార్మాట్తో ముందుకొచ్చిన నిర్వాహకులు, కంటెస్టెంట్స్ను హౌస్లోకి అడుగుపెట్టక ముందే స్టేజ్పైనే ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టినట్లు వార్తలు లీకయ్యాయి.
స్టేజ్పైనే ఎలిమినేషన్.. సీన్ రివర్స్!
ప్రముఖ తమిళ యూట్యూబర్, మూవీ రివ్యూయర్ ప్రశాంత్ రంగస్వామి బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టక ముందే ఆడియెన్స్ ఓటింగ్లో ఎలిమినేట్ అయినట్లు తెలిసింది. షో ప్రారంభానికి రెండు రోజుల ముందు సెప్టెంబర్ 4న "మంచి జరుగుతుంది.. ఓం!" అని పోస్ట్ చేసిన ప్రశాంత్, ఆ తర్వాత సెప్టెంబర్ 5న "ధన్యవాదాలు మురుగా.. ఓం!" అని పెట్టిన పోస్ట్ పెట్టాడు.
దీంతో నిజంగానే ప్రశాంత్ రంగస్వామి ఎలిమినేట్ అయినట్లు కన్ఫర్మ్ అయింది. అయితే, బిగ్ బాస్ 10 తమిళ స్టేజిపై ప్రశాంత్ రంగస్వామితో పాటు మరో ఇద్దరు కంటెస్టెంట్స్ జవిత్, పృథ్వీనాథ్లను నిలబెట్టారు. వీరికి ఒక అంశం ఇచ్చి.. ఒక్కొక్కరిని రెండు నిమిషాలపాటు మాట్లాడమని చెప్పారు.
తొలి ఎపిసోడ్లోనే ట్విస్ట్
అనంతరం ఎవరి మాటలు నచ్చాయో వారికి ఓటు వేయాలని ఆడియన్స్కు తీర్పును కట్టబెట్టారు హోస్ట్. ఈ టాస్క్లో అనూహ్యంగా ప్రశాంత్ రంగస్వామి వెనుకబడిపోయారు. ప్రేక్షకుల ఓట్లలో విజయం సాధించలేకపోవడంతో ఆయన బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే అవకాశాన్ని చేజార్చుకున్నారు.
{{/usCountry}}అనంతరం ఎవరి మాటలు నచ్చాయో వారికి ఓటు వేయాలని ఆడియన్స్కు తీర్పును కట్టబెట్టారు హోస్ట్. ఈ టాస్క్లో అనూహ్యంగా ప్రశాంత్ రంగస్వామి వెనుకబడిపోయారు. ప్రేక్షకుల ఓట్లలో విజయం సాధించలేకపోవడంతో ఆయన బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే అవకాశాన్ని చేజార్చుకున్నారు.
{{/usCountry}}దీంతో క్రిటిక్ ప్రశాంత్ రంగస్వామి బిగ్ బాస్ స్టేజీ పైనుంచే ఎలిమినేట్ అయి వెనక్కి రావాల్సి వచ్చింది. బిగ్ బాస్ ప్రారంభ ఎపిసోడ్లోనే ఇలాంటి ట్విస్ట్ రావడంతో ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. కంటెస్టెంట్గా ఇంట్లోకి వెళ్లి గేమ్ ఆడకముందే ప్రశాంత్ రంగస్వామి ఎలిమినేట్ కావడం ఇప్పుడు బిగ్ బాస్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ద్వేషించిన వారికి ధన్యావాదాలు
ఎలిమినేట్ అయిన తర్వాత "ప్రేమ చూపించిన వారికి, ద్వేషించిన వారికి ధన్యవాదాలు. మళ్లీ నా పనిలోకి వెళ్తున్నా. ఎలాంటి బాధ, నిరాశ లేవు. ఏది ఎలా జరగాలో అలాగే జరిగింది" అని ప్రశాంత్ రంగస్వామి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించారు.
ఆయన ఎలిమినేషన్ వార్త వినగానే గత సీజన్ కంటెస్టెంట్, నటి సనమ్ శెట్టి కూడా స్పందిస్తూ.. ప్రశాంత్ మంచి కంటెస్టెంట్ అయ్యేవాడని, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్లీ వస్తారని ఆశిస్తున్నట్లు మద్దతుగా నిలిచారు.
'టాక్సిక్' సినిమా వివాదంతో వార్తల్లో..
ఇదిలా ఉంటే, ఇటీవలే హీరో యశ్- దర్శకురాలు గీతు మోహన్దాస్ కాంబినేషన్లో వచ్చిన 'టాక్సిక్' సినిమా రివ్యూ విషయంలో ప్రశాంత్ వివాదంలో నిలిచారు. ఆ సినిమా టీమ్ తన రివ్యూపై లీగల్ నోటీసులు పంపిందని ఆరోపిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.
వివాదం చల్లారకముందే
ఆ వివాదం చల్లారకముందే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారనే ప్రచారం జరగడం, అంతలోనే స్టేజ్పైనే ఎలిమినేట్ అవ్వడం చర్చనీయాంశమైంది. ఇకపోతే మరి బిగ్ బాస్ తెలుగు 10లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.