Bigg Boss Telugu 10: బిగ్ బాస్‌లో బ్లాక్ కీ ట్విస్ట్- డైరెక్ట్ నామినేషన్ పవర్ కోల్పోయిన సృష్టి- యాంకర్ సుధీర్ వెన్నుపోటు

Bigg Boss Telugu 10 September 13 Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 10 సీజన్‌లో ప్రతివారం సరికొత్త ట్విస్టులు ఉంటాయని హోస్ట్ నాగార్జున చెప్పారు. అందులో భాగంగానే బిగ్ బాస్ తెలుగు 10 సెప్టెంబర్ 13వ తేది ఎపిసోడ్‌లో బ్లాక్ కీతో ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున. దానివల్ల సృష్టి తనకున్న పవర్ కోల్పోయింది.

Published on: Sep 14, 2026, 09:18:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bigg Boss 10 Telugu September 13 Episode Highlights: బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్ సరికొత్త సీజన్ 10 తెగ అలరిస్తోంది. నాగార్జున హోస్ట్ ఎప్పటిలాగే ఉన్న బిగ్ బాస్ తెలుగు 10 సీజన్‌లో వచ్చే ట్విస్టులు, గొడవలు ఆకట్టుకునేలా ఉన్నాయి.

బిగ్ బాస్‌లో బ్లాక్ కీ ట్విస్ట్- డైరెక్ట్ నామినేషన్ పవర్ కోల్పోయిన సృష్టి- యాంకర్ సుధీర్ వెన్నుపోటు
బిగ్ బాస్‌లో బ్లాక్ కీ ట్విస్ట్- డైరెక్ట్ నామినేషన్ పవర్ కోల్పోయిన సృష్టి- యాంకర్ సుధీర్ వెన్నుపోటు

ఈ వారం పవర్ ఆఫ్ పీపుల్

బిగ్ బాస్ 10 తెలుగు సెప్టెంబర్ 13వ తేది ఎపిసోడ్‌లో ప్రతి వారం సరికొత్త అవతారం ఉంటుందని నాగార్జున చెప్పాడు. గత వారం దశావతారం ఉంటే ఈ వారం పవర్ ఆఫ్ పీపుల్ అని వెల్లడించారు. ఆడియెన్స్ ఓట్ల ద్వారానే కెప్టెన్సీ కంటెండర్స్‌ను ఎంపిక చేయనున్నారు.

ఇదిలా ఉంటే, నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్‌లో నాగార్జున ఒక బ్లాక్ కీతో ఎంట్రీ ఇచ్చి ట్విస్ట్ ఇచ్చాడు. బిగ్ బాస్ తెలుగు 10లో పదిమంది కంటెస్టెంట్స్‌కు 10 మ్యాజికల్ పవర్స్ వచ్చిన విషయం తెలిసిందే. దాంట్లో శాలిని పటేల్ తన పవర్ ఇదివరకే ఉపయోగించుకుంది.

పవర్‌ను పోగొట్టే బ్లాక్ కీ

ఇప్పుడు తొమ్మిది మందికి మ్యాజికల్ పవర్ ఉంది. ఇక నాగార్జున తీసుకొచ్చిన బ్లాక్ కీని హౌజ్‌లోకి పంపారు. దాన్ని రోహిత్ నాయిడుని తీసుకురమ్మని చెప్పిన నాగార్జున అది ఎందుకో గెస్ చేయమన్నాడు. దానివల్ల ఇప్పుడున్న కంటెస్టెంట్లలో ఒకరి పవర్‌ను డిసేబుల్ చేయడానికి అనుకుంటున్నా అని రోహిత్ చెప్పగానే కరెక్ట్ అని నాగార్జున చెప్పాడు.

9 మంది కంటెస్టెంట్స్‌ను గార్డెన్ ఏరియాలో నిల్చొబెట్టి ఆ బ్లాక్ కీని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో చెప్పమని నాగార్జున అన్నాడు. అలా అందరూ చెప్పగా ఎక్కువగా సృష్టి వ్యాకరణం పేరును ఎక్కువగా ఐదుగురు కంటెస్టెంట్స్ చెప్పారు. దాంతో కామనర్ అయిన సృష్టి తనకున్న మ్యాజికల్ పవర్ కోల్పోవాల్సి వచ్చింది.

డైరెక్ట్ నామినేషన్ చేసే పవర్

సృష్టికి హౌజ్‌లో ఎవరినైనా డైరెక్ట్ నామినేషన్ చేసే పవర్ మ్యాజికల్ కీ ద్వారా వచ్చింది. ఇప్పుడు బ్లాక్ కీతో ఆ పవర్ పోయింది. ఇక సృష్టి పవర్‌ను దక్కించుకునేందుకు ఇప్పటికి ఎలాంటి పవర్ రాని కంటెస్టెంట్స్ మధ్య పోటీ పెట్టాడు నాగార్జున. రోహిత్, జబర్దస్త్ నరేష్, దేబ్జానీ మోదక్, సుధీర్ రెడ్డి నలుగురి మధ్య ఆ పోటీ నడిచింది.

నలుగురికి డిఫరెంట్ కలర్స్ ఉన్న సాండ్ బ్యాగ్స్ ఇచ్చి ఎదురుగా ఉన్న హోల్‌లో పడేయాలని నాగార్జున చెప్పాడు. అలా మొదట ఐదు బ్యాగ్స్ పడిన వారు పోటీలో గెలిచినట్లు, వారికి సృష్టి కోల్పోయిన మ్యాజికల్ పవర్ కీ దక్కుతుందన్నారు. చాలా ఫాస్ట్‌గా మొదట 5 బ్యాగ్స్ హోల్స్‌లో వేసి యాంకర్ సుధీర్ రెడ్డి ఆ టాస్క్ గెలిచాడు.

సుధీర్ వెన్నుపోటు

దాంతో సుధీర్‌కు సృష్టి పవర్ వచ్చేసింది. తన దగ్గరున్న మ్యాజికల్ పవర్ కీని సుధీర్‌కు సృష్టి అందజేసింది. నా పవర్ పోయేందుకు నువ్వు కూడా ఓట్ చేయడం నాకు బాధగా అనిపించిందని సృష్టి చెప్పింది. సృష్టికి ఫ్రెండ్‌లా ఉన్న సుధీరే తన పవర్ పోయేందుకు ఓట్ వేసి నిజంగానే వెన్నుపోటు పొడిచినట్లు అయింది.

మ్యాజిక్ పవర్ కీ బాక్స్‌పై ఉన్న సృష్టి ఫొటో తీసి తన ఫొటో పెట్టుకోమ్మని సుధీర్‌కు నాగార్జున చెప్పాడు. ఆ సీక్రెట్ పవర్ ఏంటో సుధీర్‌కు బిగ్ బాస్ చెబుతారని, ఇదివరకు తెలిసిన సృష్టి మాత్రం ఇంట్లో ఎవరికి చెప్పకూడదని, చెబితే డైరెక్ట్ ఇంటి నుంచి అవుట్ (ఎలిమినేట్) అవుతుందని వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. ఇలా ఓవరాల్‌గా చేస్తే ఫ్రెండ్‌గా ఉన్న సృష్టికే వెన్నుపోటు పొడిచి చివరికి తనే ఆ మ్యాజిక్ పవర్‌ను సుధీర్ రెడ్డి సొంతం చేసుకున్నట్లు అయింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More