Hema Malini Emotional Tribute To Dharmendra Asha Bhosle: భారతీయ చలనచిత్ర రంగానికి సంబంధించిన అరుదైన దృశ్యరూపకాలను ప్రదర్శించే 'లెన్స్ అండ్ లెగసీ: బాలీవుడ్ ఇన్ ఫోకస్' ఎగ్జిబిషన్ను కేంద్ర సాంస్కృతిక శాఖ సహకారంతో ముంబైలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శనను బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ హేమ మాలిని ప్రారంభించారు. ఈ సందర్భంగా దివంగత నటుడు ధర్మేంద్ర, గాన కోకిల ఆశా భోంస్లేలకు నివాళి అర్పిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన 'ట్రిబ్యూట్ వాల్స్' అందరినీ ఆకట్టుకున్నాయి.
ఆయన లేరంటే నమ్మలేకపోతున్నా..

వేదికపై భర్త ధర్మేంద్ర గురించి మాట్లాడుతూ హేమ మాలిని కన్నీరు పెట్టుకున్నారు. "ఆయనతో గడిపిన క్షణాలను నా అదృష్టంగా భావిస్తాను. ఇప్పుడు ఆయన లేరనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. మిగిలిన జీవితాన్ని ఆయన లేకుండా ఎలా గడపాలో నాకు అర్థం కావడం లేదు" అని హేమ మాలిని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రేక్షకుల పట్ల ఆయనకు ఉన్న ప్రేమ
కేవలం ఒక నటుడిగానే కాకుండా, కెమెరా వెనుక ఆయన నిబద్ధత, ప్రేక్షకుల పట్ల ఆయనకు ఉన్న ప్రేమ వెలకట్టలేనివని హేమ మాలిని కొనియాడారు. "సినిమా అనేది హృదయాలను కలిపే వారధి" అని ధర్మేంద్ర తరచూ చెప్పేవారని ఆమె గుర్తు చేసుకున్నారు.
ఆయన శైలి అద్వితీయం
బాలీవుడ్ 'హీ-మ్యాన్'గా గుర్తింపు పొందిన ధర్మేంద్ర, 2025 నవంబర్ 24న తన 90వ పుట్టినరోజుకు కొద్దిరోజుల ముందే కన్నుమూసిన సంగతి తెలిసిందే. యాక్షన్, కామెడీ, ఎమోషనల్ డ్రామా.. ఇలా ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే ఆయన శైలి అద్వితీయమని హేమ పేర్కొన్నారు.
ఆశా భోంస్లే మరణం తీరని లోటు
ఇదే ఏడాది ఏప్రిల్ 12న దిగ్గజ గాయని ఆశా భోంస్లే కూడా తుదిశ్వాస విడిచారు. ఈ ప్రదర్శనలో ఆమెను కూడా స్మరించుకున్నారు. 77 ఏళ్ల హేమమాలిని స్పందిస్తూ.. తన సినీ కెరీర్లో లతా మంగేష్కర్, ఆశా భోంస్లేల గాత్రం తన పాత్రలకు ప్రాణం పోశాయని చెప్పారు. "బంగారు కంఠం కలిగిన అద్భుతమైన గాయనిని మనం కోల్పోయాం. లతాజీ తరహాలోనే ఆశాజీ కూడా నా కోసం ఎన్నో చిరస్మరణీయమైన పాటలు పాడారు" అని హేమ మాలిని తన కృతజ్ఞతను చాటుకున్నారు.
ప్రముఖుల హాజరు
ఈ వేడుకలో ప్రదీప్ చంద్ర, శాంతను దాస్ వంటి ప్రముఖ ఫోటో జర్నలిస్టుల ఛాయాచిత్రాలను ప్రదర్శించారు. వెటరన్ యాక్టర్ రంజిత్, పూనమ్ సిన్హా, మధు, ప్రముఖ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఈ ప్రదర్శనకు హాజరై పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
{{/usCountry}}ఈ వేడుకలో ప్రదీప్ చంద్ర, శాంతను దాస్ వంటి ప్రముఖ ఫోటో జర్నలిస్టుల ఛాయాచిత్రాలను ప్రదర్శించారు. వెటరన్ యాక్టర్ రంజిత్, పూనమ్ సిన్హా, మధు, ప్రముఖ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఈ ప్రదర్శనకు హాజరై పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
{{/usCountry}}1. ధర్మేంద్ర ఎప్పుడు మరణించారు?
బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర 2025, నవంబర్ 24న మరణించారు. ఆయన తన 90వ పుట్టినరోజుకు (డిసెంబర్ 8) కేవలం రెండు వారాల ముందు తుదిశ్వాస విడిచారు.
2. హేమమాలిని ప్రారంభించిన ఎగ్జిబిషన్ పేరేంటి?
ముంబైలో 'లెన్స్ అండ్ లెగసీ: బాలీవుడ్ ఇన్ ఫోకస్' అనే పేరుతో భారతీయ సినిమా చరిత్రను ప్రతిబింబించే ఫోటో ఎగ్జిబిషన్ను ఆమె ప్రారంభించారు.
3. ఆశా భోస్లే ఎప్పుడు కన్నుమూశారు?
ప్రముఖ గాయని ఆశా భంస్లే 2026, ఏప్రిల్ 12న మరణించారు. ఆమె మరణం పట్ల హేమ మాలిని తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ తన నివాళి అర్పించారు.