...
...
Next Story

Karisma Kapoor: మరి అతిగా జూమ్ చేయకండి- ఫొటోగ్రాఫర్లకు స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ వార్నింగ్-ఇద్దరు పిల్లల తల్లి అంటూ!

Karisma Kapoor Warning To Photographers: షూటింగ్ సెట్స్‌లో ఫోటోగ్రాఫర్లు అత్యుత్సాహం ప్రదర్శించడంతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ అసహనం వ్యక్తం చేశారు. ఫోటోలు తీసేటప్పుడు పరిధులు దాటవద్దని, అతిగా జూమ్ చేయవద్దని ఆమె కోరిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Published on: Apr 30, 2026, 06:18:49 IST
Advertisement

Karisma Kapoor Warning To Photographers: ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్' సీజన్ 5 త్వరలో ప్రారంభం కానుంది. ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న 90వ దశకపు స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ షూటింగ్ ముగించుకుని బయటకు వస్తుండగా పాపరాజీ (ఫోటోగ్రాఫర్లు) ఆమెను చుట్టుముట్టారు. ఆ సమయంలో కొందరు ఫోటోగ్రాఫర్లు కెమెరాలను ఆమెకు అతి దగ్గరగా తీసుకెళ్లి జూమ్ చేయడాన్ని కరిష్మా గమనించారు.

నెటిజన్ల మద్దతు.. సెలబ్రిటీల ప్రైవసీపై చర్చ

మరి అతిగా జూమ్ చేయకండి.. ఫొటోగ్రాఫర్లకు స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ వార్నింగ్.. ఇద్దరు పిల్లల తల్లి అంటూ! (Instagram)
మరి అతిగా జూమ్ చేయకండి.. ఫొటోగ్రాఫర్లకు స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ వార్నింగ్.. ఇద్దరు పిల్లల తల్లి అంటూ! (Instagram)

వెంటనే కరిష్మా కపూర్ స్పందిస్తూ.. "జూమ్ మత్ కర్నా" (ఎక్కువగా జూమ్ చేయకండి) అంటూ చాలా స్పష్టంగా, సున్నితంగా హెచ్చరించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో బయటకు రాగానే నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

ఇద్దరు పిల్లల తల్లి అంటూ

సెలబ్రిటీలు కూడా మనుషులేనని, వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా ప్రవర్తించడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. "ఒక ఇద్దరు పిల్లల తల్లి, అనుభవం ఉన్న నటి.. ఇలా ఫోటోగ్రాఫర్లకు పద్ధతులు నేర్పించాల్సి రావడం విచారకరం" అని ఒక యూజర్ కామెంట్ చేయగా, మరికొందరు ఫోటోగ్రాఫర్ల ప్రవర్తనను తప్పుబడుతున్నారు.

శ్రుతి హాసన్, ఆయేషా వంటి తారలకు

గతంలోనూ శ్రుతి హాసన్, జయా బచ్చన్, సల్మాన్ ఖాన్, టాలీవుడ్ హీరోయిన్ ఆయేషా ఖాన్ వంటి తారలు ఫోటోగ్రాఫర్ల అత్యుత్సాహంపై బహిరంగంగానే మండిపడ్డారు. ఇటీవల శ్రుతి హాసన్‌ను ఎవరో 'మమ్మీ' అని పిలవడంతో ఆమె తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కరిష్మా కూడా అదే బాటలో, కాకపోతే కాస్త సున్నితంగా తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.

ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ సీజన్ 5

కరిష్మా కపూర్ చివరగా మర్డర్ ముబారక్ అనే ఓటీటీ మూవీలో మెరిశారు. నెట్‌ఫ్లిక్స్‌లో మర్డర్ ముబారక్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇప్పుడు కరిష్మా కపూర్ బ్రౌన్ ఓటీటీ సిరీస్‌లో నటిస్తున్నారు. కపూర్ల ఖాన్దాన్ నుంచి వచ్చిన మొదటి తరం నటిగా, జాతీయ అవార్డు గ్రహీతగా కరిష్మాకు ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ తాజా సంఘటన నిరూపిస్తోంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. కరిష్మా కపూర్ ఫోటోగ్రాఫర్లపై ఎందుకు అసహనం వ్యక్తం చేశారు?

ఫోటోగ్రాఫర్లు తనను ఫోటోలు తీసేటప్పుడు కెమెరా లెన్స్‌ను అతిగా జూమ్ చేయవద్దని, హుందాగా వ్యవహరించాలని ఆమె కోరారు.

2. ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ సీజన్ 5 ఎప్పుడు ప్రారంభమవుతుంది?

ఈ పాపులర్ డ్యాన్స్ షో మే 9, 2026 నుండి సోనీ టెలివిజన్‌లో ప్రసారం కానుంది.

3. ఈ షోలో కరిష్మాతో పాటు ఇతర జడ్జిలు ఎవరు?

కరిష్మా కపూర్‌తో పాటు గీతా కపూర్, టెరెన్స్ లూయిస్, జావేద్ జాఫేరి ఈ సీజన్‌లో జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.

4. కరిష్మా కపూర్ నటించిన తాజా చిత్రం ఏది?

ఆమె 2024లో విడుదలైన 'మర్డర్ ముబారక్' చిత్రంలో నటించారు. ప్రస్తుతం 'బ్రౌన్' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe