హ్యాపీడేస్ హీరో వరుణ్ సందేశ్, ఆయన భార్య వితికా షెరు కలిసి నటించిన లేటెస్ట్ తెలుగు మావీ ‘ధర్మస్థల నియోజకవర్గం’. భార్యాభర్త హీరో హీరోయిన్గా చేస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోలు సుమన్, సాయి కుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరుం భాస్కర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహించారు. టాలీవుడ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ధర్మస్థల నియోజకవర్గం సినిమా ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది.
ఈ చిత్ర మ్యూజికల్ ప్రమోషన్స్ను ఇటీవలే మేకర్స్ ప్రారంభించారు. ‘న్యాయం చేయరా దేవుడా..’ డ్యాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ డ్యాన్స్ నెంబర్తో ప్రేక్షకులను అలరించబోతున్నట్లుగా సాంగ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు తాజాగా న్యాయం చేయరా దేవుడా ఫుల్ లిరికల్ సాంగ్ను ఆస్కార్ విజేత చంద్రబోస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
చంద్రబోస్తో సాంగ్ రిలీజ్
ఈ కార్యక్రమానికి దర్శకనిర్మాతలతో పాటు చిత్రానికి సంబంధించిన పలువురు హాజరయ్యారు. న్యాయం చేయరా దేవుడా పాట ఆవిష్కరణ అనంతరం లిరిసిస్ట్ చంద్రబోస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
"‘ధర్మస్థల నియోజకవర్గం’ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలో ‘న్యాయం చేయరా దేవుడా..’ అనే లిరికల్ సాంగ్ని విడుదల చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ పాటకు నేనే సాహిత్యం అందించాను. సునీత గారు ఆలపించారు" అని చంద్రబోస్ తెలిపారు.
సాహిత్యంపై మంచి పట్టు
"ఈ సినిమా డైరెక్టర్ జై జ్ఞాన ప్రభ తోట గారు మంచి విజన్ ఉన్న డైరెక్టర్. ఆయనకు సాహిత్యంపై మంచి పట్టు ఉంది. ఆయనకు తగ్గట్టు మంచి టేస్ట్ ఫుల్ నిర్మాత భాస్కర్ గారు కలిసి నా నుంచి చక్కటి సాహిత్యాన్ని రాబట్టారు. మహావీర్ ఎల్లంధర్ స్వరాలు సమకూర్చారు. సినిమా చాలా బాగుంటుంది. ఇందులో మంచి మెసేజ్ ఉంది. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, యూనిట్కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను" అని చంద్రబోస్ ఆశించారు.
{{/usCountry}}"ఈ సినిమా డైరెక్టర్ జై జ్ఞాన ప్రభ తోట గారు మంచి విజన్ ఉన్న డైరెక్టర్. ఆయనకు సాహిత్యంపై మంచి పట్టు ఉంది. ఆయనకు తగ్గట్టు మంచి టేస్ట్ ఫుల్ నిర్మాత భాస్కర్ గారు కలిసి నా నుంచి చక్కటి సాహిత్యాన్ని రాబట్టారు. మహావీర్ ఎల్లంధర్ స్వరాలు సమకూర్చారు. సినిమా చాలా బాగుంటుంది. ఇందులో మంచి మెసేజ్ ఉంది. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, యూనిట్కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను" అని చంద్రబోస్ ఆశించారు.
{{/usCountry}}చిత్ర దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ.. "‘న్యాయం చేయరా దేవుడా..’ పాటకు లిరిక్స్ అందించడమే కాకుండా, మేము అడగగానే ఆవిష్కరించిన ఆస్కార్ విజేత చంద్రబోస్ గారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ సినిమాకు ఆయన ఎంతగానో ప్రోత్సాహం అందించారు" అని అన్నారు.
యంగ్ హీరోలు కూడా
"ఒక డిఫరెంట్ పొలిటికల్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ చిత్రంలో సీనియర్ నటులైన సాయి కుమార్, సుమన్లతో పాటు యంగ్ హీరోస్ కూడా నటిస్తున్నారు" అని జై జ్ఞానప్రభ తోట చెప్పారు.
"ఇండియన్ స్క్రీన్పై ఇప్పటి వరకు లేని విధంగా.. డ్యాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ ఈ చిత్రంలో ఓ ఐటెమ్ సాంగ్ తో ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నారు. ఈ సాంగ్తోనే మ్యూజిక్ ప్రమోషన్స్ని మొదలు పెట్టబోతున్నాం. ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చేలా ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది" అని పేర్కొన్నారు డైరెక్టర్.
స్పెషల్ అట్రాక్షన్
"చంద్రబోస్ గారి లిరిక్స్, స్టార్ సింగర్ సునీత ఆలపించిన పాటలు ఈ చిత్రానికి మరో స్పెషల్ అట్రాక్షన్గా నిలవనున్నాయి. అన్ని హంగులతో ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయనున్నాం. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు" అని దర్శకుడు జై జ్ఞానప్రభ తోట తెలిపారు.