బాలీవుడ్ నటి, మంచు విష్ణు మూవీ సూర్యం హీరోయిన్ సెలీనా జైట్లీ తన సోదరుడి కోసం చేస్తున్న న్యాయపోరాటానికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో గత కొంతకాలంగా నిర్బంధంలో ఉన్న తన సోదరుడు విక్రాంత్ జైట్లీని కలిసేందుకు, అతనికి న్యాయ సహాయం అందించేందుకు అనుమతించాలని కోరుతూ సెలీనా జైట్లీ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది.
పిటిషన్ను కొట్టివేయడానికి కారణం ఏంటి?

మార్చి 16న ఈ కేసును విచారించిన జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ ధర్మాసనం సంచలన విషయాలను వెల్లడించింది. విక్రాంత్ జైట్లీకి ఇప్పటికే కాన్సులర్ యాక్సెస్ (దౌత్యపరమైన అనుమతి) లభించిందని, అయితే అతను తన సోదరి సెలీనాతో మాట్లాడటానికి సిద్ధంగా లేనని స్పష్టం చేసినట్లు కోర్టు పేర్కొంది.
సహాయం తీసుకోడానికి నిరాకరణ
"తన సోదరి పంపే ఏ రకమైన న్యాయ సహాయాన్ని తీసుకోవడానికి విక్రాంత్ ఇష్టపడటం లేదు. తన భార్య చారుల్ జైట్లీతో సంప్రదించిన తర్వాతే తదుపరి చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటానని ఆయన స్పష్టంగా చెప్పారు" అని కోర్టు వివరించింది.
ఖలీద్ అల్మారీ లాంటి ప్రముఖ లా ఫర్మ్లు ఉచితంగా వాదించడానికి ముందుకు వచ్చినా విక్రాంత్ తిరస్కరించడం గమనార్హం. సోదరితో నేరుగా మాట్లాడాలన్న సెలీనా అభ్యర్థనను కూడా విక్రాంత్ తోసిపుచ్చినట్లు అధికారులు కోర్టుకు తెలిపారు.
గోప్యత పాటించాలని భార్య విన్నపం
మరోవైపు, విక్రాంత్ భార్య చారుల్ ఈ కేసు వివరాలను బహిరంగపరచవద్దని కోర్టును కోరారు. విక్రాంత్ ఇష్టాయిష్టాలను, ప్రస్తుత పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు.. ఈ పిటిషన్ను ఇంకా పెండింగ్లో ఉంచాల్సిన అవసరం లేదని భావిస్తూ కేసును ముగించింది. అయితే, చట్టపరంగా అతనికి అందాల్సిన సహాయాన్ని కొనసాగించాలని అధికారులను ఆదేశించింది.
అసలు విక్రాంత్ ఎందుకు అదుపులో ఉన్నారు?
రిటైర్డ్ మేజర్ విక్రాంత్ జైట్లీ భారత సైన్యంలో పనిచేశారు. ఆయన 2016 నుంచి యూఏఈలో ఉంటూ ఒక కన్సల్టెన్సీ సంస్థలో పనిచేస్తున్నారు. అయితే, సెప్టెంబర్ 6, 2024 నుంచి ఆయనను యూఏఈ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
{{/usCountry}}రిటైర్డ్ మేజర్ విక్రాంత్ జైట్లీ భారత సైన్యంలో పనిచేశారు. ఆయన 2016 నుంచి యూఏఈలో ఉంటూ ఒక కన్సల్టెన్సీ సంస్థలో పనిచేస్తున్నారు. అయితే, సెప్టెంబర్ 6, 2024 నుంచి ఆయనను యూఏఈ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
{{/usCountry}}జాతీయ భద్రతకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలోనే విక్రాంత్ జైట్లీని నిర్బంధించినట్లు భారత మీడియా కథనాలు చెబుతున్నప్పటికీ, అధికారికంగా ఎలాంటి అభియోగాలు బయటకు రాలేదు.
సోదరుడే వద్దనడం
తన సోదరుడికి సరైన న్యాయ సహాయం అందడం లేదని, కనీసం అతనితో మాట్లాడే అవకాశం కూడా లేదని సెలీనా జైట్లీ గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు స్వయంగా సోదరుడే ఆమె సహాయాన్ని వద్దనడం పెద్ద ట్విస్ట్గా మారింది.
మంచు విష్ణు సూర్యం సినిమా
ఇకపోతే మంచు విష్ణు తన సినీ కెరీర్ తొలినాళ్లలో చేసిన సినిమా సూర్యం. ఈ మూవీతోనే టాలీవుడ్లోకి హీరోయిన్గా అడుగుపెట్టింది సెలీనా జైట్లీ. వి సముద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా తర్వాత మళ్లీ సెలీనా మరో తెలుగు చిత్రంలో కనిపించలేదు. సూర్యం సినిమా 2004 డిసెంబర్ 2న థియేటర్లలో విడుదల అయింది.