Anurag Kashyap About Bollywood Bends Easily To Power: భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముక్కుసూటితనంతో వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మరోసారి బాలీవుడ్ వర్గాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హిందీ చలనచిత్ర పరిశ్రమ అధికారం, రాజకీయాల ఒత్తిళ్లకు చాలా త్వరగా లొంగిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బాలీవుడ్ వర్సెస్ సౌత్ సినిమా నడుమ ఉన్న వ్యత్యాసాన్ని విశ్లేషిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్.
ఒక్కసారి తలొంచితే.. ఇక అంతే!

ఒక్కసారి ఒత్తిళ్లకు తలొగ్గి రాజీపడటం మొదలుపెడితే, దాని నుంచి బయటకు రావడం సాధ్యం కాదని అనురాగ్ కశ్యప్ తెలిపారు. మొదటి రాజీ తర్వాత వచ్చే ప్రయోజనాలు, లాభాలకు అలవాటు పడిపోవడం వల్లే ఎవరూ ఆ తలుపులను మూసివేయలేకపోతున్నారని ఆయన చెప్పారు.
ఏమి చేయలేని స్థితిలో ఉండిపోతారు
"సినీ ఇండస్ట్రీలో ఉన్నవారికి తాము చేస్తున్న రాజీలు ఏంటో బాగా తెలుసు. చాలా సందర్భాల్లో వారు సిగ్గుపడతారు, అసౌకర్యంగా భావిస్తారు. కానీ, ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోతారు. వ్యక్తిగతంగా తమను అడిగే వరకు ఎవరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏమీ చేయరు" అని అనురాగ్ కశ్యప్ వ్యాఖ్యానించారు.
ఉత్తరాది మార్కెట్ను ఆక్రమించాలనుకునే
దక్షిణాది చిత్ర పరిశ్రమలు ప్రాదేశికంగా, సాంస్కృతికంగా ఎంతో బలంగా ఉన్నాయని అనురాగ్ కశ్యప్ కొనియాడారు. ఉత్తరాది మార్కెట్ను ఆక్రమించాలనుకునే కేంద్ర శక్తులు హిందీ ప్రేక్షకులపైనే ఎక్కువ దృష్టి పెడతాయని తెలిపారు.
సౌత్ సినిమా ఎందుకు తగ్గేదేలే అంటోంది?
"దక్షిణాది చిత్ర పరిశ్రమలకు ఉన్న సాంస్కృతిక మూలాలు చాలా బలంగా ఉంటాయి. పైగా సౌత్ ఇండస్ట్రీ హిందీ మార్కెట్పైనే పూర్తిగా ఆధారపడదు. అందుకే వాళ్లు ఎవరికీ లొంగిపోరు. కేవలం హిందీ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకోవాలని చూసే కొందరు మాత్రమే రాజీపడతారు" అని అనురాగ్ కశ్యప్ స్పష్టం చేశారు.
వందల కోట్లతో సౌత్ సినిమాలు
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల వసూళ్లు సాధిస్తూ పాన్ ఇండియా స్థాయిలో జయభేరి మోగిస్తుంటే, బాలీవుడ్ మాత్రం సృజనాత్మకతను పక్కనపెట్టి కేవలం బాక్సాఫీస్ నంబర్ల వెంటే పరుగెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
రూ.500 కోట్ల పిచ్చి.. ముంబై వదిలి బెంగళూరుకు!
{{/usCountry}}తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల వసూళ్లు సాధిస్తూ పాన్ ఇండియా స్థాయిలో జయభేరి మోగిస్తుంటే, బాలీవుడ్ మాత్రం సృజనాత్మకతను పక్కనపెట్టి కేవలం బాక్సాఫీస్ నంబర్ల వెంటే పరుగెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
రూ.500 కోట్ల పిచ్చి.. ముంబై వదిలి బెంగళూరుకు!
{{/usCountry}}బాలీవుడ్లో సృజనాత్మక వాతావరణం నశించిందని, ఎప్పుడూ రూ. 500 కోట్లు, రూ. 800 కోట్ల కలెక్షన్ల వెంటే పరుగెత్తే 'విష సంస్కృతి' (Toxic Culture) పెరిగిపోయిందని అనురాగ్ గతంలోనూ ఆరోపించారు. ఈ వాతావరణం నచ్చకనే తాను ముంబై నగరాన్ని వదిలి బెంగళూరుకు వెళ్లిపోతున్నట్లు ప్రకటించడం గమనార్హం.
అనురాగ్ కశ్యప్ బందర్ సినిమా
ఇదిలా ఉంటే, అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో బాబీ డియోల్, సాన్యా మల్హోత్రా ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం 'బందర్'. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుని, అనురాగ్ మార్క్ ఉత్తమ చిత్రంగా నిలిచినప్పటికీ, ఇది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. ఈ సినిమా కేవలం రూ. 4.97 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది.