...
...
Next Story

Ameer Log: మలయాళంలో తీసినట్లు రావట్లేదంటారుగా, రేపు అన్ని వుడ్‌లకు అమీర్ లోగ్ సౌండ్ రీచ్ అవుతుంది: దర్శకుడు రమణా రెడ్డి

Ameer Log Press Meet Director Ramana Reddy On Malayalam Movies: రేపు గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానున్న లేటెస్ట్ తెలుగు మూవీ అమీర్ లోగ్. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటించిన అమీర్ లోగ్ మూవీ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రమణా రెడ్డి సోమ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Aug 20, 2026, 21:53:56 IST
Advertisement

Ameer Log Press Meet Director Ramana Reddy On Malayalam Movies: టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ హైదరాబాదీ చిత్రం అమీర్ లోగ్. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ముగ్గురు యంగ్ హీరోలు నటించిన ఈ సినిమాలో వేధా జలంధర్ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాకు రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు.

రానా దగ్గుబాటి సంస్థ నుంచి విడుదల

మలయాళంలో తీసినట్లు రావట్లేదంటారుగా, రేపు అన్ని వుడ్‌లకు అమీర్ లోగ్ సౌండ్ రీచ్ అవుతుంది: దర్శకుడు రమణా రెడ్డి
మలయాళంలో తీసినట్లు రావట్లేదంటారుగా, రేపు అన్ని వుడ్‌లకు అమీర్ లోగ్ సౌండ్ రీచ్ అవుతుంది: దర్శకుడు రమణా రెడ్డి

'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ తొలి చిత్రంగా అమీర్ లోగ్‌ని నిర్మించారు. అలాగే, ఈ మూవీకి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను రానా దగ్గుబాటి సంస్థ 'స్పిరిట్ మీడియా' విడుదల చేస్తోంది.

అమీర్ లోగ్ ప్రెస్ మీట్

అమీర్ లోగ్ సినిమాను తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా అంటే రేపు థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో బుధవారం (ఆగస్ట్ 19) అమీర్ లోగ్ మూవీ యూనిట్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రమణా రెడ్డి, నిర్మాత మాధవి రెడ్డి, హీరో హరి, నటుడు యోగి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

కచ్చితంగా హిట్ బొమ్మ

దర్శకుడు రమణా రెడ్డి సోమ మాట్లాడుతూ .. "‘అమీర్ లోగ్’ సినిమాని ఇప్పటికి చాలా సార్లు చూశాం. కచ్చితంగా హిట్టు బొమ్మ. ఇప్పటి వరకు ఇలాంటి చిత్రం రాలేదు. అలాంటి ఓ గొప్ప అటెంప్ట్ నేను చేశాను. ప్రీమియర్లకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే మేం హిట్ కొట్టేశాం, మేం అనుకున్నది సాధించేశాం అని అర్థమైంది" అని అన్నారు.

మలయాళంలో తీసినట్లుగా రావడం లేదంటారు

"నన్ను ముందు నిలబెట్టి నడిపిస్తున్న నా భర్త రమణ గారికి థాంక్స్. ఆయనే రైటర్, డైరెక్టర్‌, నిర్మాతగా అన్నీ పనులు చూసుకున్నారు. ఆయన ఈ ‘అమీర్ లోగ్’ సినిమాని అందమైన పెయింటింగ్‌గా తీర్చి దిద్దారు. ఈ సినిమా చూసి బయటకు వెళ్లేటప్పుడు ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక ఎమోషన్‌ను ఇంటికి తీసుకు వెళ్తారు" అని ప్రొడ్యూసర్ మాధవి రెడ్డి చెప్పారు.

ఏదో ఒకటి కొత్తగా నేర్చుకునేవాళ్లం

హీరో ఎంసీ హరి మాట్లాడుతూ .. "‘అమీర్ లోగ్’ సినిమా నాకు మంచి అవకాశాన్ని, కుటుంబాన్ని, అనుభవాన్ని ఇచ్చింది. రోహిత్ అన్న ఎడిటింగ్ అదిరిపోతుంది. స్మరణ్ అన్న అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారు. మనోజ్, శశి, నేను కలిసి సెట్‌లో ఎంతో సరదాగా ఉండేవాళ్లం. సెట్‌లో రోజూ ఏదో ఒకటి కొత్తగా నేర్చుకునేవాళ్లం" అని అన్నాడు.

థియేటర్లు బ్లాస్ట్ అయ్యాయి

"ఈ జర్నీలో సపోర్ట్ చేసిన సందీప్ అన్న, ఎస్వీకే అన్నకి, మాధవి గారికి, రమణ అన్నకి థాంక్స్. ప్రీమియర్లు వేసిన ప్రతీ చోటా థియేటర్లు బ్లాస్ట్ అయ్యాయి. ఆగస్ట్ 21న కూడా మాకు అదే రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం" అని హీరో ఎంసీ హరి ఆకాంక్షించారు.

ఏపీలో మంచి రెస్పాన్స్ వచ్చింది

నటుడు యోగి మాట్లాడుతూ .. "హైదరాబాద్ మీద రమణన్న తనకున్న ప్రేమను ఈ ‘అమీర్ లోగ్’ సినిమాతో చూపించబోతోన్నారు. ఏపీలో వేసిన ప్రీమియర్లకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కరీంనగర్, వరంగల్‌లో వేసిన ప్రీమియర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది" అని చెప్పుకొచ్చారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe