ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్గా నటించిన సినిమా సుయోధన. డైలాగ్ కింగ్ సాయి కుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మించారు.
సుయోధన సక్సెస్ ఈవెంట్

సుయోధన సినిమా శుక్రవారం (ఈ నెల 27న) ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. సుయోధన సక్సెస్ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ బోసుబాబు నిడుమోలు, డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు, డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఇంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని
నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ.. "సుయోధన చిత్రంతో మొదటి ప్రయత్నంలోనే మా చిత్రానికి మంచి విజయాన్ని అందించారు. మా నెక్ట్స్ మూవీకి ఇంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం అన్ని ఏరియాల నుంచి రెస్పాన్స్ బాగుంది. ఈ సినిమా చేసిన అనుభవంతో నెక్ట్స్ మరో మంచి చిత్రంతో మీ ముందుకు వస్తాం" అని అన్నారు.
రాబోయే సినిమా పక్కా ప్లానింగ్తో
"అయితే ఈ సారి ఏదైనా పేరున్న సంస్థతో భాగస్వామ్యం అయి సినిమా నిర్మించాలని అనుకుంటున్నాం. ఎంతో కొంత అనుభవం, అవగాహన తెచ్చుకున్న తర్వాత చిత్ర పరిశ్రమలోకి రావాలని కొత్త నిర్మాతలకు నా సలహా. త్వరలోనే మంచి సబ్జెక్ట్ చూసుకుని కొత్త మూవీ అనౌన్స్ చేస్తాం. ఈ సారి మా సంస్థలో రాబోయే సినిమా పక్కా ప్లానింగ్తో ఉంటుంది" అని నిర్మాత బోసుబాబు నిడుమోలు తెలిపారు.
అనుభవం ఉన్న దర్శకుడిలా
డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ.. "చిన్న సినిమాలను ప్రేక్షకులకు చేర్చడంలో మా మీడియా మిత్రులు ముందుంటారు. సుయోధన చిత్రాన్ని కూడా వారే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ సినిమాలో ప్రియదర్శి, సాయి కుమార్ పోటాపోటీగా నటించారు. మా డైరెక్టర్ మాధవ్ సినిమా చేసిన విధానం చూస్తుంటే అనుభవం ఉన్న దర్శకుడిలా రూపొందించారు. ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది" అని పేర్కొన్నారు.
ఓవర్సీస్లోనూ మంచి రెస్పాన్స్
{{/usCountry}}డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ.. "చిన్న సినిమాలను ప్రేక్షకులకు చేర్చడంలో మా మీడియా మిత్రులు ముందుంటారు. సుయోధన చిత్రాన్ని కూడా వారే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ సినిమాలో ప్రియదర్శి, సాయి కుమార్ పోటాపోటీగా నటించారు. మా డైరెక్టర్ మాధవ్ సినిమా చేసిన విధానం చూస్తుంటే అనుభవం ఉన్న దర్శకుడిలా రూపొందించారు. ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది" అని పేర్కొన్నారు.
ఓవర్సీస్లోనూ మంచి రెస్పాన్స్
{{/usCountry}}డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ.. "సుయోధన మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రతి షో కు స్క్రీన్స్ పెరుగుతున్నాయి. ఓవర్సీస్లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. అక్కడి నుంచి మిత్రులు మూవీ చాలా బాగుందంటూ ఫోన్స్ చేస్తున్నారు" అని డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డి తెలిపారు.
హైలైట్గా వారి నటన
"ప్రియదర్శి, సాయి కుమార్ గారి నటన సుయోధన చిత్రానికి హైలైట్గా నిలుస్తోంది. మా సినిమాను మరింతగా ప్రేక్షకుల దగ్గరకు మీరు రీచ్ చేయాలని కోరుకుంటున్నా" అని దర్శకుడు వైఎస్ మాధవ్ రెడ్డి కోరారు.
సుయోధన నటీనటులు
ఇదిలా ఉంటే, సుయోధన సినిమాలో హీరో ప్రియదర్శి, హీరోయిన్ ద్రిషిక చందర్, కీలక పాత్రల్లో సాయి కుమార్, ప్రేమతోపాటు విష్ణు (లడ్డు), దేవి ప్రసాద్, రాజశ్రీ నాయర్ తదితరులు నటించారు.