...
...
Next Story

Epic Review: ఎపిక్ మూవీ రివ్యూ- లండన్‌లో తెలుగు జంట సహజీవనం- ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కెమిస్ట్రీ మెప్పించిందా?

Epic First Semester Review And Rating In Telugu: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో వచ్చిన ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూపై ఇక్కడ ఓ లుక్కేద్దాం. విదేశాల్లో చదువుకునే తెలుగు యూత్ జీవితాల్లోని అసలు సిసలు కోణాలను ఆవిష్కరించిన ఈ రొమాంటిక్ డ్రామా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

Published on: Sep 11, 2026, 11:52:23 IST
Advertisement

Epic First Semester Review And Rating In Telugu: ప్రతి ఏటా మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది విద్యార్థులు విదేశీ విద్య కోసం అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా విమానాలు ఎక్కుతుంటారు. తల్లులు, తండ్రులు తమ ఆస్తులు అమ్మి, అప్పులు చేసి మరీ పిల్లలను లండన్ పంపుతారు.

బేబి కాంబినేషన్ రిపీట్

ఎపిక్ మూవీ రివ్యూ- లండన్‌లో తెలుగు జంట సహజీవనం- ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కెమిస్ట్రీ మెప్పించిందా?
ఎపిక్ మూవీ రివ్యూ- లండన్‌లో తెలుగు జంట సహజీవనం- ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కెమిస్ట్రీ మెప్పించిందా?

అక్కడికి వెళ్లాక ఎదురయ్యే ఒంటరితనం, గది సర్దుకోవడం నుంచి వంట వండుకోవడం వరకు పడే యాతన, కొత్త సంస్కృతిలో నెట్టుకొచ్చే క్రమంలో మొదలయ్యే అనుబంధాల గురించి ఏ యూనివర్సిటీ బ్రోచర్ చెప్పదు. సరిగ్గా ఈ పాయింట్‌ను ఆధారం చేసుకుని 'బేబి' కాంబినేషన్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించిన చిత్రమే 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్'.

ఈ ఎపిక్ మూవీ ఇవాళ శుక్రవారం (సెప్టెంబర్ 11) థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, బేబీ కాంబినేషన్ హిట్ కొట్టిందా లేదా అనేది నేటి ఎపిక్ రివ్యూలో చూద్దాం.

కథ:

చిత్ర పరిశ్రమలో దర్శకుడు కావాలని కలలుకనే అమాయకపు యువకుడు ఆదిత్య (ఆనంద్ దేవరకొండ). కానీ, తండ్రి ఆశయాన్ని నెరవేర్చడానికి ఇష్టం లేకపోయినా లండన్ వెళ్లి మాస్టర్స్ డిగ్రీలో చేరుతాడు. అక్కడ అతనికి కడలి (వైష్ణవి చైతన్య) అనే స్వతంత్ర భావాలు కలిగిన ధైర్యవంతమైన అమ్మాయి పరిచయమవుతుంది.

ఆనంద్ దేవరకొండ తన సహజమైన నటనతో ఆదిత్య పాత్రలో ఒదిగిపోయారు. అమాయకత్వం, ఒకింత బెదురు, వైష్ణవి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయే హావభావాలను చాలా చక్కగా పండించారు. కడలి పాత్రలో వైష్ణవి చైతన్య పరిణతి చెందిన నటనను కనబరిచారు.

వీరిద్దరి మధ్య ఉన్న ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఈ సినిమాకు అతిపెద్ద బలంగా నిలిచింది. కామెడీ నటుడిగా కనిపించిన మ్యాడ్ డైరెక్టర్ కల్యాణ్ శంకర్ తన టైమింగ్‌తో నవ్వులు పూయించగా, బిగ్ బాస్ శివాజీ, వాసుకిల పాత్రలు కథకు తగినట్లుగా ఆకట్టుకున్నాయి.

సింపుల్ కాన్సెప్ట్.. కానీ నెమ్మదించిన కథనం!

తెలుగు తెరపై చాలా అరుదుగా చర్చించే యంగ్ కపుల్స్ శారీరక సాన్నిహిత్యం, మహిళల ఆరోగ్య సమస్యలు, విదేశాల్లో సహజీవనం చేసేటప్పుడు ఎదురయ్యే ఆచరణాత్మక ఇబ్బందులను దర్శకుడు చాలా పారదర్శకంగా చూపించారు. అయితే, సినిమా కథనంలో వేగం లోపించడం పెద్ద లోపంగా మారింది.

సన్నివేశాలు చాలా నెమ్మదిగా సాగుతూ, ఒకే రకమైన భావోద్వేగాలను మళ్లీ మళ్లీ చూపించడం ప్రేక్షకుడి ఓపికను పరీక్షిస్తుంది. క్లైమాక్స్ సన్నివేశాల్లో ఎమోషన్ పండినప్పటికీ, ఆలోపే ఆడియెన్స్‌కు ఓపిక నశిస్తుంది.

సాంకేతిక విభాగం.. పార్ట్ 2 కోసం ట్విస్ట్!

హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాను నిలబెట్టాయి. అజీమ్ మహమ్మద్ లండన్ వాతావరణాన్ని, వనపర్తి విజువల్స్‌ను కెమెరాలో ఆకట్టుకునేలా చూపించారు. నవీన్ నూలి ఎడిటింగ్‌పై ఇంకాస్త శ్రద్ధ పెట్టి, మధ్యలో ఓ 15-20 నిమిషాల నిడివి తగ్గించి ఉంటే సినిమా రేంజ్ వేరేలా ఉండేది.

కథను ముగించకుండా సెకెండ్ పార్ట్ 'ఎపిక్ ఫైనల్ సెమిస్టర్' కోసం ఎదురుచూడండి అంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఆనంద్-వైష్ణవిల కెమిస్ట్రీ కోసం, నేటి యూత్ విదేశాల్లో పడే ఇబ్బందులను చూడాలనుకునేవారు ఎపిక్ సినిమాను ఓసారి చూసేయొచ్చు.

రేటింగ్: 3/5

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks