...
...
Next Story

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: నానమ్మ చివరి కోరిక తీర్చిన బాలు- బాలుకే సుశీల బహుమతి- ప్రభావతి, మనోజ్‌కు నిరాశ

గుండె నిండా గుడి గంటలు నవంబర్ 14 ఎపిసోడ్‌లో బాలు గురించి సుశీల అడిగితే.. మనోజ్ అవమానంగా మాట్లాడుతాడు. దాంతో ఇచ్చి పడేస్తుంది మీనా. దానికి శ్రుతి సపోర్ట్ చేస్తుంది. ఇంతలో బాలు వస్తాడు. సుశీల చిన్ననాటి స్నేహితులను గిఫ్ట్‌గా తీసుకొచ్చి చివరి కోరిక తీరుస్తాడు. బాలుకే సుశీల ప్రకటించిన బహుమతి ఇస్తుంది.

Published on: Nov 14, 2025, 07:48:11 IST
Advertisement

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు బయట మందు తాగుతున్నాడని మనోజ్ అంటే.. ఆయన ఎందుకు బయటకు వెళ్లాలో తెలుసుకోవాలంటే ఇప్పుడే ఇక్కడే నేనే అని ఆగిపోతుంది మీనా. ఎక్కడికి వెళ్లాడని సుశీల అంటే వస్తారని మీనా అంటుంది. అన్నయ్య కూడా గిఫ్ట్ కొనడానికి వెళ్లినట్లున్నాడు అని రవి అంటాడు.

200కి బేరాలు

గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 14 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 14 ఎపిసోడ్‌

పుట్‌పాత్ మీద దొరికే 500న గిఫ్ట్‌ను 200లకు బేరాలు ఆడి తీసుకొస్తాడు అని అవమానిస్తాడు మనోజ్. అత్తింటి సొమ్ముతో షాప్ పెట్టుకున్న మీరు కూడా మాట్లాడుతున్నారే. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి చూస్తానాను నీ భార్యకు ఏనాడైనా మూరెడు మల్లెపూలు కొన్నారా అని మీనా అంటుంది. అది మా పర్సనల్ అని రోహిణి అంటే.. మరి నా మొగుడు గురించి అనడం ఎందుకని మీనా అంటుంది.

కరెక్టే కదా. భర్తను అంటే ఎవరైనా అంటారు. అందరూ అత్తయ్యలా మావయ్యను ఏమన్నా చూస్తు ఉన్నట్లు ఉండలేరుగా అని శ్రుతి అంటుంది. అబ్బా ఎంత బాగా అర్థం చేసుకున్నావ్ అని కామాక్షి మెచ్చుకుంటుంది. వాడు ఏదో తెస్తాడని కాదు నా ప్రతి పుట్టిన రోజుకు వాడు ఉండేవాడు. ఇప్పుడు లేకపోయేసరికి ఏమైందో అని భయంగా ఉందని సుశీల అంటే అలాంటిదేం జరగదు అని మీనా అంటుంది.

బాలు వచ్చే గ్యాప్‌లో గిఫ్ట్స్ చూడమని సత్యం చెబుతాడు. దాంతో మనోజ్ తెచ్చిన నెక్లెస్ ఇస్తాడు. రవి షుగర్‌లెస్ కేక్ చేసినట్లు రవి చెబుతాడు. అలాంటిది తొలిసారిగా చేసినట్లు చెబుతాడు రవి. అంతా చప్పట్లు కొడతారు. శ్రుతి ఫోన్ గిఫ్ట్‌గా ఇస్తుంది. సుమతితో చీర ఇప్పిస్తుంది పార్వతి. 200, 300లు పెట్టి కొన్నారా అని అమానిస్తుంది ప్రభావతి.

ప్రభావతి టీవీ గిఫ్ట్

ఇక వీడియో మొదలుపెట్టనా అని మీనా అంటే.. అందరు ఆగేలా లేరు మొదలెట్టు అంటాడు బాలు. సుశీల కళ్లు మూస్తాడు బాలు. ఇంతలో సుశీల చిన్ననాటి ఫ్రెండ్ సుబ్బులు వస్తుంది. సుబ్బులును చూసి సుశీల తెగ సంబరపడిపోయి కౌగిలించుకుంటుంది. నీ బాల్యాన్ని నీకు గుర్తు చేయడానికే నాకోసం వెతుక్కుంటూ వచ్చాడు. నీ మనవడు నీకిచ్చే బర్త్ డే గిఫ్ట్ ఇదేనే అని సుబ్బులు అంటుంది.

తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది సుశీల. తర్వాత సుశీల మరో ఇద్దరు ఫ్రెండ్స్ రాజీ, సత్యవతి ఒక్కొక్కరిగా వస్తారు. వాళ్లందరిని చూసి సుశీల సంబరపడిపోతుంది. అదంతా మీనా వీడియో తీస్తుంది. అలా సుశీల ఆఖరి కోరికను బాలు నెరవేర్చుతాడు. నీ మనవడు మహా తెలివైనవాడే. నీకు మనసుకు నచ్చిన గిఫ్ట్ ఇచ్చాడే అని సత్యవతి అంటుంది.

బాలు సర్‌ప్రైజ్

వీళ్లు నీకెలా తెలుసురా అని సుశీల అడిగితే.. మీనా చెప్పిందని బాలు అంటాడు. ఉదయం సుశీల చెప్పిన వీడియో ఆయనకు పంపించానని మీనా చెబుతుంది. అంటే నా సంతోషానికి కారణం మీరిద్దరు అన్నమాట అని సుశీల అంటుంది. తన కుటుంబాన్ని ఫ్రెండ్స్‌కు సుశీల పరిచయం ఇస్తుంది. గ్రేట్ సర్‌ప్రైజ్ అని బాలును పొగుడుతుంది శ్రుతి.

సత్యవతి భర్త గోపాలం కూడా వచ్చాడని చెబుతుంది. దానికి సిగ్గేస్తుందని సుశీల అంటుంది. సుశీలను మా ఆయన ప్రేమించి చచ్చాడులే అని సత్యవతి చెబుతుంది. అంతా సుశీల లవ్ స్టోరీ గురించి అడుగుతారు. అది వన్ సైడ్ లవ్ స్టోరీ అని, సుశీల వెంట పడుతుంటే నా వెంట పడుతున్నాడని మురిసిపోయేదాన్ని అని సత్యవతి చిన్నప్పుడు జరిగింది చెబుతుంది.

తర్వాత సుశీల కేక్ కట్ చేస్తుంది. తన మనసులోని కోరికను తీర్చిన బాలుకే తన గిఫ్ట్ ఇస్తానని చెబుతుంది సుశీల. అలాగే ఇస్తుంది. దాంతో ప్రభావతి, మనోజ్, రోహిణి అంతా నిరాశపడతారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe