...
...
Next Story

Illu Illalu Pillalu July 16 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు..మర్డర్ చేసి పారిపోయారు- ప్రేమ, ధీరజ్ కు ఎస్ఐ షాక్- ట్విస్ట్

Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 16 ఎపిసోడ్ లో అదిరే ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ప్రేమ, ధీరజ్ మర్డర్ చేసి పారిపోయారని మోపిదేవి ఎస్ఐ షాక్ ఇస్తాడు. అయితే దీని వెనుక ఉన్నది ఎవరో ఈ రోజు ఫుల్ ఎపిసోడ్ లో ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jul 16, 2026, 07:53:20 IST
Advertisement

Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 16 ఎపిసోడ్ లో వేదవతి తెగ టెన్షన్ పడుతుంటుంది. మోపిదేవికి వెళ్లిన ధీరజ్, ప్రేమ మర్డర్ చేశారని ఎస్ఐ అంటాడు. అయితే దీని వెనుకాల ఉన్నది భాగ్యం, వల్లి అనే ట్విస్ట్ థ్రిల్ కలిగిస్తుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.

వేదవతి టెన్షన్

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

ఎస్ఐ కాల్ చేయడంతో ధీరజ్, ప్రేమ కలిసి మోపిదేవి పోలీస్ స్టేషన్ కు బయల్దేరుతారు. మరోవైపు నర్మద, వేదవతి కంగారు పడతారు. కళ్యాణ్ తో ప్రేమ వెళ్లిన విషయం, ప్రేమను ఆ కళ్యాణ్ అమ్మబోయిన విషయం, పోలీసులు అరెస్ట్ చేయబోయిన విషయం అన్నీ బయటపడతాయేమోనని వేదవతి తెగ టెన్షన్ పడుతుంది.

వల్లి రివేంజ్

ప్రేమ, ధీరజ్ లది ప్రేమ వివాహం కాదు, నేను బలవంతంగా చేయించిన పెళ్లి అని తెలుస్తుందేమోనని వేదవతి ఇంకా కంగారు పడుతుంది. ఏదైతే అయితే చూసుకోవడానికి ధీరజ్ ఉన్నాడు కదా అని నర్మద ధైర్యం చెప్తుంది. ఇదంతా చాటుగా చూస్తున్న శ్రీవల్లి ఏమో.. వీళ్లను ఎందుకు ప్రశాంతంగా ఉండనిస్తానని అనుకుంటుంది. వెంటనే తన వాళ్లకు కాల్ చేసి ప్రేమ, నర్మద వెళ్తున్నారు. మీరు రంగంలోకి దిగండని చెప్తుంది.

శారదాంబ పుట్టిన రోజు

మరోవైపు అమ్మ 71వ పుట్టిన రోజును గ్రాండ్ గా చేద్దామని భద్రావతి, సేనాపతి అనుకుంటారు. అప్పుడే కాఫీ ఇస్తున్న రేవతిపై శారదాంబ ఫైర్ అవుతుంది. కాఫీ తాగకపోతే ఏం చచ్చిపోనులే. దేవుడు నన్ను ఎందుకు తీసుకుపోవడం లేదా అని శారదాంబ అంటుంది. అమ్మ నీకు ఎందుకంత బాధ వచ్చిందని సేనాపతి, భద్రావతి అడుగుతారు.

చిన్న కూతురు కోసం

కానీ భద్రావతి మాత్రం కరగదు. అవసరమైతే నీ పుట్టిన రోజు చేయడమైనా మానేస్తాం. అంతే కానీ దాన్ని (వేదవతి) మాత్రం పిలవం. అది ఎప్పుడో చచ్చిపోయిందని భద్రావతి కోపంతో ఊగిపోతుంది.

డమ్మీ ఎస్ఐ

ఇక కార్లో మోపిదేవికి ధీరజ్, ప్రేమ వెళ్తుంటారు. ప్రేమను టెన్షన్ పడొద్దని ధీరజ్ చెప్తాడు. మోపిదేవి అనేది నా జీవితంలో చెడు గతం. ఇప్పుడు మళ్లీ ఎస్ఐ ఫోన్ చేశాడని ప్రేమ ఫీల్ అవుతుంది. ఆ కారు వెనుకాలే స్కూటీపై ఇడ్లీ బాబాయ్, భాగ్యం వెళ్తారు. అక్కడికి వెళ్లిన భాగ్యం, ఇడ్లీ బాబాయ్ ఏమో ఆల్రెడీ మన డమ్మీ ఎస్ఐ వెయిటింగ్ అని అనుకుంటారు. అంటే ఇదంతా వీళ్లు చేస్తున్న కుట్ర అని అర్థమవుతుంది.

మర్డర్ చేశారని

లాడ్జీ లోపలికి వెళ్లిన ధీరజ్, ప్రేమ అక్కడ రిసెప్షన్ లో ఎస్ఐ గురించి అడుగుతారు. సార్ ఇక్కడికి రాలేదని చెప్పిన అక్కడున్న అమ్మాయి.. ధీరజ్, ప్రేమ పెళ్లి గురించి చెప్తుంది. హోటల్ బయట ఉన్న ఎస్ఐని ప్రేమ, ధీరజ్ వెళ్లి కలుస్తారు. మర్డర్ కేసు గురించి మాట్లాడాలి. మర్డర్ చేసి ఇద్దరు పారిపోయారు కదా అని ఎస్ఐ అనగానే ప్రేమ, ధీరజ్ మైండ్ బ్లాక్ అవుతుంది.

మొత్తం డ్రామానే

ఆ రోజు ఇక్కడ మర్డర్ జరిగింది. అది చేసి మీరు పారిపోయారని ఎస్ఐ అంటాడు. ఆ రోజు మా వదిన, అమ్మ కూడా ఉన్నారు కావాలంటే మాట్లాడండి అని ధీరజ్ చెప్తాడు. వెంటనే ఎస్ఐగా నాటకం ఆడుతున్న వ్యక్తి తన టోన్ మారుస్తాడు. పొరపాటున వేరే రూమ్ లో స్టే చేసిన వాళ్లకు కాల్ చేయబోయి మీకు కాల్ చేశాం. సారీ ఫర్ ది ట్రబుల్ అని చెప్తాడు. దీంతో ప్రేమ, ధీరజ్ కు కొండంత భారం దిగినట్లు అనిపిస్తుంది.

ప్రేమ, ధీరజ్ వెళ్లిపోతారు. డ్రామా ఆడిన ఆ ఎస్ఐకి భాగ్యం రూ.2 లక్షలు ఇస్తుంది. ఆ మేనేజర్ ను పట్టుకుని సాక్ష్యాలు సంపాదిస్తే ఆ ఇంట్లో మన అమ్మడు కుంపటి పెట్టేస్తుందని భర్తతో భాగ్యం చెప్తుంది.

వల్లిపై చందు కోపం

ఇక చందు కోసం శ్రీవల్లి క్యారేజీ తీసుకొని రైస్ మిల్ కు వెళ్తుంది. చందుపై తెగ ప్రేమను ఒలకబోస్తుంది. ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే చందు తీసుకుంటాడు. నేనంటే ప్రేమ అని నాకు తెలుసు బా అని వల్లి మురిసిపోతుంది. కానీ పనివాళ్లకు ఆ క్యారేజీ ఇచ్చి తినమంటాడు చందు. నీ డ్రామాలు ఏంటో నాకు తెలుసని చందు అనేసరికి వల్లి ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది.

ఇప్పుడు ప్రశాంతంగా ఉందని ధీరజ్ తో ప్రేమ చెప్తుంది. మన జీవితాలు ముడిపడింది ఇక్కడే. మళ్లీ ఇక్కడికి వస్తామో లేదో. పాత జ్ణాపకాలను ఒకసారి చూద్దామని ఉందని ప్రేమను తీసుకొని ధీరజ్ హోటల్ లోపలికి వెళ్తారు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe