...
...
Next Story

IPL 2026 RCB: ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ- రెండోసారి కప్ కొట్టిన బెంగళూరు- ఒంటి నొప్పులతోనే కోహ్లీ ఊరమాస్ బ్యాటింగ్!

IPL 2026 Winner RCB: ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. తీవ్రమైన ఒంటినొప్పులు వేధిస్తున్నప్పటికీ విరాట్ కోహ్లీ ఊరమాస్ బ్యాటింగ్ చేశాడు. మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ సాధించి జట్టును గెలిపించాడు.

Published on: May 31, 2026, 23:44:42 IST
Advertisement

IPL 2026 Winner RCB: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సరికొత్త ఇతిహాసాన్ని లిఖించింది. ఆదివారం (మే 31) రాత్రి జరిగిన ఐపీఎల్ 2026 రసవత్తర ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి బెంగళూరు రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ- రెండోసారి కప్ కొట్టిన బెంగళూరు- ఒంటి నొప్పులతోనే కోహ్లీ ఊరమాస్ బ్యాటింగ్!
ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ- రెండోసారి కప్ కొట్టిన బెంగళూరు- ఒంటి నొప్పులతోనే కోహ్లీ ఊరమాస్ బ్యాటింగ్!

కోట్లాది మంది అభిమానుల కలలను నిజం చేస్తూ 'కింగ్' విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆర్‌సీబీని విజేతగా నిలిపాడు. తీవ్రమైన ఒంటి నొప్పులు (క్రాంప్స్) వేధిస్తున్నా లెక్కచేయకుండా కోహ్లీ ఆడిన ఈ ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది.

గుజరాత్ బ్యాటింగ్ అతలాకుతలం.. సుందర్ ఒక్కడే పోరాటం

ఈ తుది పోరులో ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బెంగళూరు యువ బౌలర్ రసిఖ్ దార్ సంచలన బౌలింగ్‌తో గుజరాత్ టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. రసిఖ్ మూడు వికెట్లు పడగొట్టడంతో గుజరాత్ స్టార్ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ ఘోరంగా విఫలమయ్యారు.

ఇలాంటి కష్టసమయంలో వాషింగ్టన్ సుందర్ బాధ్యతాయుత హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. సుందర్ ఒంటరి పోరాటం చేయడంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగలిగింది.

ఆర్‌సీబీ రన్ ఛేజ్.. మ్యాచ్‌లో తీవ్ర ఉత్కంఠ

156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఓపెనర్లు వెంకటేష్ అయ్యర్, దేవదూత్ పడిక్కల్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. అయితే గుజరాత్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, కాగిసో రబడాలు వీరిద్దరినీ అవుట్ చేసి మ్యాచ్‌లోకి తిరిగి వచ్చారు. ఆ తర్వాత ప్రమాదకరంగా మారుతున్న రజత్ పటిదార్, కృనాల్ పాండ్యాలను రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో వెనక్కి పంపి ఆర్‌సీబీని ఒత్తిడిలోకి నెట్టాడు.

క్రాంప్స్‌తోనే కోహ్లీ ఊరమాస్ ఇన్నింగ్స్.. బెంగళూరు సంబరాలు

కోహ్లీ అద్భుతమైన షాట్లతో గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లాడు. చివరకు ఆర్‌సీబీ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి ఛాంపియన్‌గా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన బెంగళూరు ఈ సీజన్ అంతటా తిరుగులేని ప్రదర్శన చేసి, ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించి ట్రోఫీని ముద్దాడింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ఐపీఎల్ 2026 ఫైనల్ విజేత ఎవరు?

గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2026 విజేతగా నిలిచింది. బెంగళూరుకు ఇది రెండో ఐపీఎల్ టైటిల్.

2. ఐపీఎల్ 2026 ఫైనల్‌లో విరాట్ కోహ్లీ ప్రదర్శన ఎలా ఉంది?

విరాట్ కోహ్లీ తీవ్రమైన ఒంటినొప్పులు (క్రాంప్స్) ఉన్నప్పటికీ అద్భుతంగా ఆడి, తన ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీతో ఆర్‌సీబీని గెలిపించాడు.

3. ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఎంత స్కోరు చేసింది?

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (50) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు.

4. ఆర్‌సీబీ బౌలర్లలో ఎవరు ఎక్కువ వికెట్లు తీశారు?

బెంగళూరు బౌలర్ రసిఖ్ దార్ అద్భుతంగా బౌలింగ్ చేసి గుజరాత్ జట్టుకు చెందిన 3 ముఖ్యమైన వికెట్లను పడగొట్టాడు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe