Irumudi Movie Review In Telugu And Rating:

టైటిల్: ఇరుముడి
నటీనటులు: రవితేజ, బేబీ నక్షత్ర, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, స్వాసిక విజయన్, అజయ్ ఘోష్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శివ నిర్వాణ
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్
విడుదల తేది: ఆగస్ట్ 21, 2026
మాస్ మహారాజా రవితేజ నుంచి ఒక సినిమా వస్తోందంటే అభిమానులు పక్కా మాస్ ఎలిమెంట్స్, విపరీతమైన ఎనర్జీ, యాక్షన్ సీన్స్ ఆశిస్తారు. కానీ, ఈసారి రవితేజ రూట్ మార్చిన విషయం తెలిసిందే. కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి హృదయానికి హత్తుకునే ఒక బలమైన కథతో ప్రేక్షకులను పలకరించాడు రవితేజ.
'నిన్ను కోరి', 'మజిలీ' వంటి ఫీల్ గుడ్ ఎమోషనల్ చిత్రాలను అందించిన దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన'ఇరుముడి' సినిమాపై మొదటినుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తండ్రీ కూతుళ్ల ఎమోషన్కు అయ్యప్ప దీక్ష అనే డివోషనల్ ఎలిమెంట్ అద్ది ఈ సినిమాను రూపొందించారు. మరి ఇవాళ (ఆగస్ట్ 21) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో నేటి ఇరుముడి రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
సీలేరు ప్రాంతంలోని ఓ పల్లెటూరులో త్రినాథ్ (రవితేజ) అరటిపళ్ల వ్యాపారం చేస్తూ తన భార్య కావేరి (ప్రియా భవాని శంకర్), కూతురు మణికంఠ (బేబీ నక్షత్ర)ను పోషించుకుంటాడు. అతనికి మందు అలవాటు కూడా ఉంటుంది. ఊరిలో ఏం జరిగిన తండ్రికి చెప్పడం మణికంఠకు అలవాటు. ఈ క్రమంలోనే చదువుకునే పాఠశాల విద్యార్థినీలు అనుమానాస్పద రీతిలో మరణిస్తుంటారు. ఆ అమ్మాయిలు ఎందుకు చనిపోతున్నారో తెలుసుకునేందుకు త్రినాథ్ ప్రయత్నిస్తాడు.
ఆ తర్వాత ఏమైంది? ఎందుకు ఆ గ్రామంలో పిల్లలు మరణిస్తున్నారు? దానికి కారణం ఎవరు? దీనికి అయ్యప్ప స్వామి దీక్షకు సంబంధం ఏంటీ? త్రినాథ్ ఇంటిపైకి వచ్చిన ముప్పు ఏంటీ? తన కూతురుని, ఊరి ఆడపిల్లలను కాపాడుకోడానికి త్రినాథ్ ఏం చేశాడు? ఈ క్రమంలో త్రినాథ్కు ఏర్పడిన ఆటంకాలు ఏంటీ? అనేది తెలియాలంటే? ఇరుముడి చూడాల్సిందే.
విశ్లేషణ:
{{/usCountry}}ఆ తర్వాత ఏమైంది? ఎందుకు ఆ గ్రామంలో పిల్లలు మరణిస్తున్నారు? దానికి కారణం ఎవరు? దీనికి అయ్యప్ప స్వామి దీక్షకు సంబంధం ఏంటీ? త్రినాథ్ ఇంటిపైకి వచ్చిన ముప్పు ఏంటీ? తన కూతురుని, ఊరి ఆడపిల్లలను కాపాడుకోడానికి త్రినాథ్ ఏం చేశాడు? ఈ క్రమంలో త్రినాథ్కు ఏర్పడిన ఆటంకాలు ఏంటీ? అనేది తెలియాలంటే? ఇరుముడి చూడాల్సిందే.
విశ్లేషణ:
{{/usCountry}}చాలా కాలంగా రవితేజకు సరైన హిట్ పడలేదు. ఈ క్రమంలో డిఫరెంట్ జోనర్తో రవితేజ రావడంతో ఇరుముడి సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఆశలు నెరవేరినట్లే అని చెప్పుకోవచ్చు. ఎంతోకాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఇరుముడితో బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది.
ఇరుముడి స్టోరీ కాస్తా రెగ్యులర్గా అనిపించిన స్క్రీన్ ప్లే, టేకింగ్తో డైరెక్టర్ శివ నిర్వాణ మ్యాజిక్ చేశారు. సమాజంలో నిత్యం కనిపించే ఒక కఠినమైన నిజాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించి క్లైమాక్స్ పూర్తయ్యేలోపు ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఏడ్చేలా చేశారు.
ప్రధానమైన మెసేజ్
కథనం ఫస్టాఫ్ అంతా చాలా ఆహ్లాదకరంగా, సరదాగా సాగిపోతుంది. ప్రథమార్థంలో సీలేరు ప్రకృతి అందాలు, కుటుంబ సన్నివేశాలు, అయ్యప్ప మాలధారణ భక్తి గీతాలు, తండ్రీ కూతుళ్ల అనుబంధం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. "ఆడపిల్లలకు భయం ఉండకూడదు, వారిని ధైర్యంగా పెంచాలి" అనే ప్రధానమైన మెసేజ్ను దర్శకుడు చాలా బాగా తెరపైకి తీసుకువచ్చారు.
ఇక సెకండాఫ్ మొదలైన తర్వాత కథ సీరియస్గా మారుతుంది. వచ్చే ట్విస్టులు అమితంగా ఆకట్టుకుంటాయి. ప్రతి ఆడపిల్ల తండ్రిని ఆలోచింపజేసేలా, కాస్త భయపెట్టేలా కొన్ని సీన్లు రాసుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తాయి. అక్కడక్కడా కథ కాస్త మెల్లగా సాగినట్లు అనిపించినా, బలమైన ఎమోషన్స్ ఆ లోపాన్ని కప్పేశాయి.
హైలెట్ అయ్యే సంగీతం
అలాగే, మల్లెపూల పల్లకి పాట, ఓ చేజింగ్ సీన్లో వచ్చే డీజే మిక్స్ సీన్లకు ప్రాణం పోశాయి. కొన్ని చోట్ల ఇంకాస్తా డెప్త్గా కూడా సన్నివేశాలు ఉండొచ్చేమో అనిపించింది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు బాగా హెల్ప్ అయింది. అయ్యప్ప స్వామి భక్తి పాటలు, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉన్నాయి.
విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ సీలేరు అందాలను చాలా సహజంగా చూపెట్టింది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ సెకండాఫ్లో కాస్త నెమ్మదించినా, దర్శకుడు అందించిన సందేశం సినిమాను నిలబెట్టింది.
ఎవరెలా చేశారంటే?
చాలా కాలం తర్వాత రవితేజ నుంచి మంచి కంటెంట్ ఉన్న సినిమా వచ్చింది. అయ్యప్ప భక్తుడిగా, బాధ్యతగల తండ్రిగా ఆయన ఒదిగిపోయారు. నిజానికి సినిమా అంతా రవితేజనే కనిపించారు. రవితేజతోపాటు ఆయనకు కూతురుగా నటించిన చిన్నారి బేబీ నక్షత్ర యాక్టింగ్ సినిమాకు హైలెట్గా నిలిచింది.
తండ్రీకూతుళ్ల మధ్య కెమిస్ట్రీ, ఎమోషన్, బాండ్ బాగా ఎలివేట్ అయ్యాయి. అందుకు కారణం రవితేజ, నక్షత్రల నటనే అని చెప్పొచ్చు. వారి పర్ఫామెన్స్తో ఆడియెన్స్ వారి బంధంలో లీనమయ్యేలా చేశారు. ప్రియా భవాని శంకర్ తన పరిధి మేరకు పద్ధతిగా నటించగా, సాయి కుమార్, అజయ్ ఘోష్ తమ పాత్రల్లో రాణించారు.
ఫైనల్గా చెప్పాలంటే?
స్వాసిక పాత్ర కొంచెమైనా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఫైనల్గా చెప్పాలంటే ఈ సినిమా మంచి సందేశాన్ని ఇచ్చే పక్కా ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్. కుటుంబంతో థియేటర్లలో ఇరుముడి సినిమాను ఎంచక్కా చూసేయొచ్చు.