...
...
Next Story

Janhvi Kapoor Alcohol: ఆ వ్యసనం నాకు లేదు, నిజమైన బానిసలను అవమానించకండి.. హీరోయిన్ జాన్వీ కపూర్ క్లారిటీ!

Janhvi Kapoor About Alcohol Addiction Statement: పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్‌ మద్యానికి బానిస అయిందని వస్తున్న వార్తలపై ఆమె తాజాగా స్పందించారు. తాను ఎప్పుడూ మద్యానికి బానిస కాలేదని, ఒక ఇంటర్వ్యూలో తాను చెప్పిన మాటలను మీడియా వక్రీకరించిందని జాన్వీ కపూర్ స్పష్టం చేశారు.

Published on: May 4, 2026, 14:50:53 IST
Advertisement

Janhvi Kapoor About Alcohol Addiction Statement: తెలుగు, హిందీ సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది జాన్వీ కపూర్. అయితే, ఇటీవల రాజ్ శమాని పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న జాన్వీ కపూర్, తన జీవితంలో ఎదురైన ఒక విషాదకర సంఘటన తర్వాత మానసిక ప్రశాంతత కోసం అప్పుడప్పుడు మద్యం సేవించానని తెలిపారు.

నిజాన్ని వక్రీకరించారు

ఆ వ్యసనం నాకు లేదు, నిజమైన బానిసలను అవమానించకండి.. హీరోయిన్ జాన్వీ కపూర్ క్లారిటీ!
ఆ వ్యసనం నాకు లేదు, నిజమైన బానిసలను అవమానించకండి.. హీరోయిన్ జాన్వీ కపూర్ క్లారిటీ!

కానీ, కొన్ని మీడియా సంస్థలు దీనిని వక్రీకరిస్తూ జాన్వీకి మద్యం వ్యసనం (Alcohol Addiction) ఉందంటూ వార్తలు ప్రచురించాయి. ఈ తప్పుడు ప్రచారంపై జాన్వీ కపూర్ తీవ్రంగా స్పందించారు. మద్యం వ్యసనంపై అవగాహన కల్పించే 'ఆఫ్ ది రాక్స్', 'అమహా' సంస్థలు కూడా ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశాయి.

వ్యసనంతో పోరాడుతున్న వ్యక్తి కాదు

"జాన్వీ కపూర్ మద్యం వ్యసనంతో పోరాడుతున్న వ్యక్తి కాదు. ఆమె ఒక కేర్ గివర్ (సహాయకురాలు)గా ఈ అవగాహన కార్యక్రమంలో భాగస్వామి అయ్యారు. కేవలం క్లిక్ బైట్ కోసం ఇలాంటి తప్పుడు వార్తలు రాసి, నిజంగా ఆ వ్యసనంతో పోరాడుతున్న వారిని (నిజమైన బానిసలను) అవమానించకండి" అని ఆ సంస్థలు పేర్కొన్నాయి. జాన్వీ కపూర్ కూడా ఈ ప్రకటనను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ, బాధ్యతాయుతమైన జర్నలిజం ఉండాలని కోరారు.

అసలు జాన్వీ ఏమన్నారు?

పాడ్‌కాస్ట్‌లో జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. "నేను మద్యానికి బానిస కాలేదు. కానీ, నా జీవితంలో ఒక తీవ్రమైన బాధాకర సంఘటన జరిగినప్పుడు తరచుగా తాగేదాన్ని. ఆ సమయంలో నా మనసును మత్తులో ఉంచుకోవాలని అనిపించేది. కానీ, త్వరగానే నేను కోలుకున్నాను. మద్యం వల్ల నా శరీరానికి, మానసిక స్థితికి జరుగుతున్న నష్టాన్ని గుర్తించి దాని నుంచి బయటపడ్డాను" అని వివరించారు.

బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది'

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో రూపొందుతున్న పెద్ది చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు వంటి అగ్ర నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

పెద్ది రిలీజ్ డేట్

రామ్ చరణ్ కెరీర్‌లో 16వ చిత్రంగా వస్తున్న 'పెద్ది' జూన్ 6, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవలే ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం పెద్ది షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఆ వ్యసనం నాకు లేదు, నిజమైన బానిసలను అవమానించకండి.. హీరోయిన్ జాన్వీ కపూర్ క్లారిటీ!

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. జాన్వీ కపూర్ మద్యానికి బానిస అయ్యారా?

లేదు. జాన్వీ కపూర్ తనకు మద్యం వ్యసనం లేదని స్పష్టం చేశారు. తాను ఎదుర్కొన్న ఒక బాధాకర సంఘటన వల్ల కొన్నాళ్లు మాత్రమే తరచుగా మద్యం సేవించానని, కానీ దానికి ఎప్పుడూ బానిస కాలేదని ఆమె వివరించారు.

2. జాన్వీ కపూర్ రామ్ చరణ్‌తో చేస్తున్న సినిమా పేరేంటి?

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో 'పెద్ది' అనే సినిమా రూపొందుతోంది. ఇది ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా.

3. 'పెద్ది' సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది?

ఈ చిత్రం జూన్ 6, 2026న థియేటర్లలో విడుదల కానుంది. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

4. జాన్వీ ఏ సంస్థతో కలిసి అవగాహన కల్పిస్తున్నారు?

‘ఆఫ్ ది రాక్స్’, 'అమహా' అనే సంస్థలతో కలిసి జాన్వీ మద్యం వ్యసనంపై అవగాహన కల్పించే బాధ్యతను తీసుకున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe