Jr NTR: బిగ్ బాస్ తర్వాత మళ్లీ చెఫ్గా మారిన జూనియర్ ఎన్టీఆర్- బుజ్జి ఫ్యాన్స్ కోసం బిస్కెట్లు- థ్యాంక్యూ తారక్ మామ!
Jr NTR Baked Cookies For Fans: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ తర్వాత మరోసారి చెఫ్ అవతారం ఎత్తారు. ఇద్దరు చిన్నారి అభిమానుల కోసం ఆయన స్వయంగా ఇంట్లోనే కుకీస్ (బిస్కెట్లు) బేక్ చేసి పంపడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Jr NTR Sent Homemade Cookies To Fans: వెండితెరపై తన పవర్ఫుల్ నటన, అదిరిపోయే డాన్సులతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. సాధారణంగా అగ్ర హీరోలు తమ ప్రొఫెషనల్ లైఫ్, సినిమా అప్డేట్లను మాత్రమే అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

మనసుకు హత్తుకునే వీడియో
కానీ, తారక్ తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక అరుదైన, మనసుకు హత్తుకునే వీడియోను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. బిగ్ బాస్ తర్వాత మరోసారి చెఫ్లా మారిన జూనియర్ ఎన్టీఆర్ వంటగదిలో బిస్కెట్లు తయారు చేశారు.
అయితే ఈ స్పెషల్ కుకీస్ ఆయన తిండానికి కాదు, తన ఇద్దరు బుజ్జి అభిమానుల కోసం కావడం విశేషం. ఎన్టీఆర్ చేసిన ఈ మధురమైన పనికి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
కొనుక్కొచ్చినవి కావు.. నేనే చేశా: ఎన్టీఆర్
శనివారం (జూన్ 6) ఉదయం జూనియర్ ఎన్టీఆర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఒక ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఆయన స్వయంగా కుకీస్ బేక్ చేస్తూ కనిపించారు. ఆ వీడియోకు "కొన్నవి కావు.. స్వయంగా తయారు చేసినవి" (Baked, not bought) అనే క్యాప్షన్ కూడా జోడించారు.
తారక్ హఠాత్తుగా ఈ వంట వీడియో పెట్టడమేంటని మొదట ఫ్యాన్స్ అంతా కాస్త అయోమయానికి గురయ్యారు. కానీ, కొద్దిసేపటికే ఈ వీడియో వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో బయటకు వచ్చింది.
గతంలో జరిగిన సంభాషణ
సాయి తేజ అనే ఎన్టీఆర్ హార్డ్కోర్ అభిమాని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కొన్ని ఫోటోలు, వీడియోలను పంచుకోవడంతో అసలు విషయం వెలుగుచూసింది. గతంలో జరిగిన ఒక చిన్న సంభాషణలో భాగంగా ఎన్టీఆర్ బిస్కెట్లు చేసి పంపుతానని సరదాగా అన్నారట.
అన్న మాట ప్రకారం ఎన్టీఆర్ స్వయంగా వండిన ఆ కుకీలను ప్యాక్ చేసి, తన ఆటోగ్రాఫ్తో సహా ఆ అభిమాని ఇంటికి పంపించారు. ఆ బిస్కెట్లను తింటూ సాయి తేజ పిల్లలు స్మరణ్, స్థారక ఎంతో ఆనందంగా ఉన్న ఫోటోలు ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.
క్యాజువల్ కామెంట్.. ఊహించని సర్ప్రైజ్
"థాంక్యూ సో మచ్ తారక్ మామ. ఒక సాధారణ కామెంట్గా మొదలైన విషయం, ఈరోజు మా ఇంటికి స్వీట్ సర్ప్పైజ్గా మారింది. పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్టీఆర్ గారి ఆటోగ్రాఫ్ చూసి నా ఆనందానికి అవధులు లేవు. ఇదంతా చూస్తుంటే మా ముఖాల్లో నవ్వులు ఆగట్లేదు" అని తమ సంతోషాన్ని పంచుకున్నారు సాయి తేజ.
"సోషల్ మీడియా అనేది కేవలం గోల కోసం మాత్రమే కాదు.. అభిమానానికి, దయాగుణానికి, జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలకు మధ్య ఒక చిన్న వారధిగా కూడా మారుతుందని ఈరోజు రుజువైంది" అని తారక్ ఫ్యాన్ సాయి తేజ ఎమోషనల్ నోట్ రాశారు.
సోషల్ మీడియాలో ‘జై ఎన్టీఆర్’ రీసౌండ్
తారక్ చూపించిన ఈ అభిమానానికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కోట్లాది మంది అభిమానులు ఉండే ఒక గ్లోబల్ స్టార్, తన బిజీ షెడ్యూల్లోనూ ఒక సాధారణ ఫ్యాన్ అన్న మాట గుర్తుపెట్టుకుని సొంతంగా వంట చేసి పంపడం ఒక్క ఎన్టీఆర్కే సాధ్యమంటూ కామెంట్లు పెడుతున్నారు.
ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్లో తారక్ బిజీ
"ఆ పిల్లలు చాలా అదృష్టవంతులు", "అందుకే తారక్ను మేము హీరోలా కాకుండా మా సొంత అన్నయ్యలా భావిస్తాం" అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇదిలా ఉంటే, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన తదుపరి భారీ చిత్రం 'డ్రాగన్' (Dragon) షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు.
'కేజీఎఫ్', 'సలార్' చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై నందమూరి కల్యాణ్ రామ్, నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, కోసరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
రుక్మిణీ వసంత్ హీరోయిన్గా
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా.. అనిల్ కపూర్, బిజు మీనన్, ఖుష్బూ సుందర్, అశుతోష్ రాణా, సిద్ధాంత్ గుప్తా వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు.
డ్రాగన్ రిలీజ్ డేట్
పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న డ్రాగన్ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


