Sharmiela Sudhan Engagement: నిర్మాతతో హీరోయిన్ ఎంగేజ్‌మెంట్- ఫొటోలు వైరల్- ఇండస్ట్రీలో మరో స్టార్ కపుల్!

Sharmiela Mandre Sudhan Sundaram Engagement: స్టార్ హీరోయిన్, నిర్మాత షర్మిల మాండ్రే తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. 'మహారాజా' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన అగ్ర నిర్మాత సుధన్ సుందరంతో షర్మిల మాండ్రే నిశ్చితార్థం ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Published on: Jun 28, 2026, 22:20:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sharmiela Mandre Sudhan Sundaram Engagement: దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో మరో స్టార్ కపుల్ పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైంది. కన్నడ చిత్రసీమలో హీరోయిన్‌గా, నిర్మాతగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న షర్మిల మాండ్రే సరికొత్త జీవిత ప్రయాణానికి శ్రీకారం చుట్టారు.

నిర్మాతతో హీరోయిన్ ఎంగేజ్‌మెంట్- ఫొటోలు వైరల్- ఇండస్ట్రీలో మరో స్టార్ కపుల్
నిర్మాతతో హీరోయిన్ ఎంగేజ్‌మెంట్- ఫొటోలు వైరల్- ఇండస్ట్రీలో మరో స్టార్ కపుల్

నిర్మాత, హీరోయిన్ నిశ్చితార్థం

కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ 'ప్యాషన్ స్టూడియోస్' అధినేత, ప్రముఖ నిర్మాత సుధన్ సుందరంతో షర్మిల మాండ్రే నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తులు, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక కన్నుల పండువగా సాగింది.

సాంప్రదాయ పద్ధతిలో, ఎంతో హుందాగా సాగిన ఈ వేడుకలో షర్మిల, సుధన్ పరస్పరం ఉంగరాలు మార్చుకున్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోయిన ఈ జంటను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. వీరికి సంబంధించిన నిశ్చితార్థపు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు, సినీ తారలు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు.

నటిగా, నిర్మాతగా షర్మిల ప్రస్థానం

కన్నడ చిత్రసీమలో షర్మిల మాండ్రేకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. కేవలం నటిగానే కాకుండా సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గానూ ఆమె రాణిస్తున్నారు. 2007లో వచ్చిన ‘సజని’ అనే కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయమైన షర్మిల, ఆ తర్వాత ‘కృష్ణ’, ‘నవగ్రహ’, ‘ఆకే’, ‘గాలిపాట 2’, గతేడాది వచ్చిన ‘ది డెవిల్’ వరకు దాదాపు 35కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు.

నటనతోనే కాకుండా ‘షర్మిల మాండ్రే ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను నిర్మిస్తూ వ్యాపారవేత్తగానూ సత్తా చాటారు. కన్నడతో పాటు తమిళ చిత్రసీమలోనూ నిర్మాతలుగా అడుగులు వేసి దక్షిణాది ఇండస్ట్రీలో తన పరిధిని విస్తరించుకున్నారు.

'మహారాజా' చిత్రంతో టాలీవుడ్‌లోనూ క్రేజ్

షర్మిల పెళ్లి చేసుకోనున్న సుధన్ సుందరం కూడా కోలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. వైవిధ్యమైన కథలను, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించడంలో ఆయనకు మంచి పేరుంది. ‘కప్పల్’, ‘సీతకాతి’ వంటి చిత్రాలతో పాటు జాతీయ అవార్డు గెలుచుకున్న ‘పార్కింగ్’ సినిమాను ఆయనే నిర్మించారు.

విజయ్ సేతుపతి కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచిన 50వ చిత్రం ‘మహారాజా’ను సుధన్ సుందరమే నిర్మించడం విశేషం. ఈ సినిమా కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలన వసూళ్లు సాధించి, ఇక్కడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా విజయంతో సుధన్ పేరు టాలీవుడ్ వర్గాల్లోనూ ప్రముఖంగా వినిపించింది.

జీవితంలో అత్యంత మధురమైన ఘట్టం

నిశ్చితార్థం అనంతరం ఈ జంట తమ సంతోషాన్ని పంచుకున్నారు. "మా జీవితంలో ఇది అత్యంత అందమైన, ప్రత్యేకమైన అధ్యాయం" అని షర్మిల మాండ్రే భావోద్వేగానికి లోనయ్యారు.

తమ కొత్త ప్రయాణానికి అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు సుధన్ సుందరం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలోనే వీరి వివాహ తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. కన్నడ, తమిళ పరిశ్రమలకు చెందిన ఇద్దరు పెద్ద నిర్మాతలు ఒకటవుతుండటంతో ఇండస్ట్రీలో సరికొత్త ప్రాజెక్టులకు మార్గం సుగమం అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More