...
...
Next Story

96 Lakh Mistake IPL: ఐపీఎల్ కేకేఆర్ vs ఆర్ఆర్ మ్యాచ్‌లో రూ. 96 లక్షల మిస్టేక్- బర్గర్ తప్పు, రింకూ సింగ్ విధ్వంసం!

₹95.90 Lakh Mistake In KKR Vs RR IPL 2026: ఐపీఎల్ 2026లో కేకేఆర్ ఎట్టకేలకు గెలిచేసింది. ఆర్ఆర్ చేతుల్లో ఉన్న మ్యాచ్‌ను రింకూ సింగ్ లాగేసుకున్నాడు. అయితే ఈ విజయం వెనుక రాజస్థాన్ చేసిన ఒకే ఒక్క తప్పు కేకేఆర్‌కు వరంగా మారింది. ఆ తప్పు విలువ సుమారు రూ. 96 లక్షలు కావడం హాట్ టాపిక్‌గా మారింది.

Published on: Apr 20, 2026, 13:29:03 IST
Advertisement

IPL 2026 KKR Vs RR Match 96 Lakh Mistake: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన 28వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్, ఒక దశలో 73 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అజింక్యా రహానే, కామెరాన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్ వంటి కీలక బ్యాటర్లు పెవిలియన్ చేరడంతో రాజస్థాన్ విజయం ఖాయమనిపించింది.

ఫలితం మార్చిన పొరపాటు

ఐపీఎల్ కేకేఆర్ vs ఆర్ఆర్ మ్యాచ్‌లో రూ. 96 లక్షల మిస్టేక్- బర్గర్ తప్పు, రింకూ సింగ్ విధ్వంసం! (PTI)
ఐపీఎల్ కేకేఆర్ vs ఆర్ఆర్ మ్యాచ్‌లో రూ. 96 లక్షల మిస్టేక్- బర్గర్ తప్పు, రింకూ సింగ్ విధ్వంసం! (PTI)

సరిగ్గా 11వ ఓవర్ చివరి బంతి వద్ద రింకూ సింగ్ ఇచ్చిన క్యాచ్‌ను రాజస్థాన్ ఫీల్డర్ నాంద్రే బర్గర్ వదిలేశాడు. అప్పుడు రింకూ సింగ్ వ్యక్తిగత స్కోరు కేవలం 8 పరుగులు మాత్రమే. ఆ ఒక్క పొరపాటే మ్యాచ్ మొత్తం ఫలితాన్ని తలకిందులు చేసింది.

రింకూ సింగ్ విధ్వంసం

క్యాచ్ చేజారి లైఫ్ లభించిన తర్వాత రింకూ సింగ్ ఇక వెనుతిరగలేదు. రాజస్థాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత కేకేఆర్ చేసిన 88 పరుగులలో 45 పరుగులు రింకూవే కావడం విశేషం.

ఇన్నింగ్స్‌లో సగానికి పైగా

అంటే జట్టు ఇన్నింగ్స్‌లో సగానికి పైగా బాధ్యతను రింకూ సింగ్ భుజాన వేసుకున్నాడు. 7 ఫోర్లు, 2 సిక్సర్లతో రాజస్థాన్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఒకవేళ నాంద్రే బర్గర్ ఆ క్యాచ్ పట్టి ఉంటే, కేకేఆర్ లోయర్ ఆర్డర్ రాజస్థాన్ బౌలింగ్‌ను తట్టుకోవడం అసాధ్యమయ్యేది.

ఆ ఒక్క క్యాచ్ విలువ రూ. 95.90 లక్షలు!

ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ సృష్టించిన ఇంపాక్ట్ (ప్రభావం) గణాంకాలను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంపాక్ట్ కాలిక్యులేషన్ పద్ధతి ప్రకారం, రింకూ సింగ్‌ ఇచ్చిన క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత ఆయన సాధించిన పరుగుల విలువ అక్షరాలా రూ. 95.90 లక్షలుగా తేలింది. అంటే నాంద్రే బర్గర్ మిస్ చేసిన క్యాచ్ విలువ రూ. 95.90 లక్షలు (సుమారు 96 లక్షలు) అన్నమాట. ఈ లెక్కన ఆర్ఆర్ ఫీల్డర్ దాదాపుగా రూ. 96 లక్షల తప్పు చేసినట్లుగా భావించవచ్చు.

ఆ ఒక్క తప్పు వల్లే కేకేఆర్‌కు

ఐపీఎల్ వంటి హై-స్టేక్స్ టోర్నీలో ఒక్క చిన్న తప్పు ఎంత భారీ మూల్యాన్ని మిగులుస్తుందో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. రాజస్థాన్ రాయల్స్ తమ వ్యూహాలను, ఫీల్డింగ్ తప్పిదాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ఐపీఎల్ 2026లో కేకేఆర్ మొదటి విజయం ఎవరిపై సాధించింది?

కోల్‌కతా నైట్ రైడర్స్ తన సీజన్ తొలి విజయాన్ని రాజస్థాన్ రాయల్స్‌పై 4 వికెట్ల తేడాతో అందుకుంది.

2. రింకూ సింగ్ క్యాచ్ డ్రాప్ అయినప్పుడు ఆయన స్కోరు ఎంత?

11వ ఓవర్లో క్యాచ్ డ్రాప్ అయిన సమయానికి రింకూ సింగ్ కేవలం 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆ తర్వాత ఆయన అజేయంగా 53 పరుగులు చేశారు.

3. రింకూ సింగ్ ఇన్నింగ్స్ ఇంపాక్ట్ విలువ ఎంత?

గణాంకాల విశ్లేషణ ప్రకారం, క్యాచ్ మిస్ అయిన తర్వాత రింకూ సృష్టించిన బ్యాటింగ్ ఇంపాక్ట్ విలువ సుమారు రూ. 95.90 లక్షలు.

4. రాజస్థాన్ రాయల్స్ ఓటమికి ప్రధాన కారణం ఏంటి?

తక్కువ స్కోరును డిఫెండ్ చేస్తున్నప్పుడు కీలక సమయంలో రింకూ సింగ్ క్యాచ్ వదిలేయడం, మిడిల్ ఓవర్లలో ఒత్తిడిని కొనసాగించలేకపోవడం రాజస్థాన్ ఓటమికి కారణమైంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe