ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన నయా మైథలాజికల్ హిస్టరీ థ్రిల్లర్- ఏఐతో చేసిన పౌరాణిక సిరీస్- తెలుగు కలిపి 7 భాషల్లో స్ట్రీమింగ్!
ఓటీటీలోకి ఇవాళ సరికొత్త మైథలాజికల్ హిస్టరీ వార్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ మహాభారత్ ఏక్ ధర్మ్యుద్ధ్ స్ట్రీమింగ్కు వచ్చేసింది. తెలుగుతో కలిపి ఏడు భాషల్లో మహాభారత్ ఏక్ ధర్మ్యుద్ధ్ ఓటీటీ రిలీజ్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తెరకెక్కించిన మహాభారత్ ఏక్ ధర్మ్యుద్ధ్ ఓటీటీ స్ట్రీమింగ్ తెలుసుకుందాం.
భారతదేశ పురాణాల్లో మహాభారతానికి ప్రత్యేక విశిష్టత ఉంటుంది. మహాభారతంలోని కథలు, పాత్రలు ప్రతి యుగంలో తారసపడుతుంటాయి. మహాభారతం నుంచి నేర్చుకునే మంచి ఎంతో ఉంది. అలాంటి మహాభారతంపై ఎన్ని సినిమాలు, సిరీస్లు వచ్చిన ఏమాత్రం బోర్ కొట్టదు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం
మహాభారతాన్ని ఆధారంగా చేసుకుని పలు విధాలుగా సినిమాలు, సిరీస్లను తెరకెక్కిస్తుంటారు మేకర్స్. ఇక ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కోట్ల భారతీయులు పవిత్రంగా చూసే మహాభారతాన్ని ఏఐతో రూపొందించి సరికొత్తగా తెరకెక్కించారు బాలీవుడ్ నిర్మాతలు.
35 ఏళ్ల తర్వాత
మైథలాజికల్ హిస్టరీ వార్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఓటీటీ వెబ్ సిరీస్ మహాభారత్ ఏక్ ధర్మ్యుద్ధ్. ప్రఖ్యాత చెందిన బీఆర్ చోప్రా మహాభారతం తర్వాత దాదాపు 35 సంవత్సరాలకు ఈ పౌరాణిక వెబ్ సిరీస్ తిరిగి వచ్చింది. "మహాభారత్ ఏక్ ధర్మ్యుద్ధ్" పేరుతో పూర్తిగా ఏఐ రూపొందించిన పురాణ గాథ ఇది.
కురుక్షేత్రం సంఘటనలతో
ప్రపంచంలోని పురాతన ఇతిహాసాలలో ఒకటి హస్తినాపూర్ సింహాసనం కోసం పాండవులు, కౌరవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం. కురుక్షేత్ర యుద్ధానికి దారితీసిన కారణాలు, సంఘటనలతో కృత్తిమ మేథస్సుతో ఈ మహాభారత్ ఏక్ ధర్మ్యుద్ధ్ ఓటీటీ సిరీస్ను తెరకెక్కించారు.
మహాభారత్ ఏక్ ధర్మ్యుద్ధ్ ఓటీటీ
ఈ సిరీస్ను పూర్తిగా ఏఐతో రూపొందించిన పాత్రలన్నీ దాదాపుగా రియాలిటీగా కనిపించడం ఆకట్టుకుంటోంది. ఇలాంటి ఈ సిరీస్ మహాభారత్ ఏక్ ధర్మ్యుద్ధ్ ఓటీటీలోకి ఇవాళ (అక్టోబర్ 25) వచ్చేసింది. జియో హాట్స్టార్లో నేటి నుంచి మహాభారత్ ఏక్ ధర్మ్యుద్ధ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా ఏడు భాషల్లో ఓటీటీ ప్రీమియర్ అయింది.
7 భాషల్లో స్ట్రీమింగ్
తెలుగుతో కలిపి హిందీ, మలయాళం, తమిళం, కన్నడ, మరాఠి, బెంగాలి వంటి 7 భాషల్లో మహాభారత్ ఏక్ ధర్మ్యుద్ధ్ ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, ఇావాళ కేవలం ఒకే ఒక్క ఎపిసోడ్ మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. అది కూడా కేవలం 20 నిమిషాల రన్టైమ్తో ఉండటం విశేషం.
100 ఎపిసోడ్స్తో సిరీస్
కానీ, మహాభారత్ ఏక్ ధర్మ్యుద్ధ్ సిరీస్ మొత్తంగా 100 ఎపిసోడ్లుగా ఉంది. ప్రతి శనివారం వారం వారం ఒక్కో ఎపిసోడ్ను ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు మేకర్స్. జియో హాట్స్టార్ ఓటీటీలోనే కాకుండా టీవీ ఛానెల్ స్టార్ ప్లస్లో కూడా మహాభారత్ ఏక్ ధర్మ్యుద్ధ్ను టీవీ ప్రీమియర్ చేయనున్నారు.
ప్రతి శనివారం కొత్త ఎపిసోడ్
అయితే, స్టార్ ప్లస్లో అక్టోబర్ 26 అంటే ఆదివారం రాత్రి 7:30 గంటలకు మొదటి ఎపిసోడ్ను ప్రసారం చేయనున్నారు. ఆ తర్వాత ప్రతి శనివారం ఒక్కో కొత్త ఎపిసోడ్ను అందుబాటులో ఉంచనున్నారు.
డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో
మహాభారతాన్ని ఏఐ విజువల్స్తో సరికొత్త అనుభూతిని పొందాలనుకునేవారు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో మహాభారత్ ఏక్ ధర్మ్యుద్ధ్ ఓటీటీ సిరీస్ను ఎంచక్కా వీక్షించవచ్చు.

E-Paper












