రాజమౌళి మహేశ్ బాబు ట్వీట్ వార్- ఒకరికొకరి పంచ్‌లు, సెటైర్లు- ప్రియాంక చోప్రాను లాగుతూ-SSMB29పై చివరిలో దెబ్బేసిన జక్కన్న

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు మధ్య ట్విటర్ వార్ జరిగింది. ఎక్స్‌లో ఒకరిపై మరొకరు సెటైర్లు, పంచ్‌లు వేసుకుంటూ యుద్ధం చేశారు. మధ్యలో ప్రియాంక చోప్రాను కూడా లాగారు. ఇదంతా వీరి ముగ్గురి కాంబినేషన్‌లో వస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 మూవీ గురించే. కానీ, చివరిలో జక్కన్న పెద్ద దెబ్బేశారు.

Published on: Nov 02, 2025 6:39 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెగ హాట్ టాపిక్‌గా మారిన సినిమా ఎస్ఎస్ఎంబీ 29. ఈ సినిమాకు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు యావత్ వరల్డ్ వైడ్‌గా హైప్ క్రియేట్ అవుతోంది. అందుకు కారణం ముగ్గురు స్టార్స్ ఈ సినిమాతో కొలబారేట్ అవడం. వారే దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.

రాజమౌళి మహేశ్ బాబు ట్వీట్ వార్- ఒకరికొకరి పంచ్‌లు, సెటైర్లు- ప్రియాంక చోప్రాను లాగుతూ-SSMB29పై చివరిలో దెబ్బేసిన జక్కన్న
రాజమౌళి మహేశ్ బాబు ట్వీట్ వార్- ఒకరికొకరి పంచ్‌లు, సెటైర్లు- ప్రియాంక చోప్రాను లాగుతూ-SSMB29పై చివరిలో దెబ్బేసిన జక్కన్న

ఎస్ఎస్ఎంబీ 29 కోసం

రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా తెరకెక్కుతున్న సినిమా ఎస్ఎస్ఎంబీ 29. ఈ సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. గ్లోబ్ ట్రాటర్ అంటూ మొదలైన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

ఇటీవల మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ సినిమా అప్డేట్ నవంబర్‌లో వస్తుందని రాజమౌళి ప్రకటించారు. నవంబర్ రానే వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో #noveMBerwillbehiSStoRic, #noveMBer ట్రెండ్ మొదలైంది. ఈ నేపథ్యంలోనే రాజమౌళి, మహేశ్ బాబు మధ్య ట్వీట్ వార్ మొదలైంది.

సోషల్ మీడియాలో ట్రెండ్

ఎస్ఎస్ఎంబీ29 అప్డేట్ గురించి జక్కన్న, మహేశ్ ఇద్దరు ఒకరిపై మరొకరు సెటైర్లు, పంచ్‌లు వేసుకుంటూ ట్వీట్లతో యుద్థం చేశారు. వీరిద్దరి కన్వర్జేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. "ఆల్రెడీ నవంబర్ వచ్చేసింది" అని ట్వీట్ వేసిన మహేశ్ బాబు ఎదురుచూస్తున్నట్లుగా కళ్ల ఎమోజీ పెట్టాడు.

దానికి రాజమౌళి "అవును, నవంబర్ వచ్చేసింది. ఈ నెలలో ఏ సినిమాలకి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నావ్" అని పంచ్ వేశారు. అందుకు "మీరు ఎప్పటినుంచే తయారు చేస్తున్న మహాభారతం సినిమాకు ఇస్తాను" అంటూ రివర్స్ పంచ్ ఇచ్చాడు మహేశ్ బాబు.

ఒక్కోటిగా వెల్లడిస్తాం

"ముందుగా నవంబర్‌లో మీరు మాకు ఏదో హామీ ఇచ్చారు. దయచేసి మాట నిలబెట్టుకోండి" అని సూపర్ స్టార్ ట్వీట్ వేశాడు. "మహేశ్ ఇప్పుడే కదా మొదలైంది. నెమ్మదిగా మేము ఒక్కొక్కటిగా వెల్లడిస్తాం" అని రాజమౌళి సమాధానం ఇచ్చారు.

"ఎంత నెమ్మదిగా ఇస్తారు సార్. 2030లో స్టార్ట్ చేద్దామా. మీ సమాచారం కోసం మన దేశీ పాప ప్రియాంక చోప్రా జనవరి నుంచి హైదరాబాద్‌లోని ప్రతి వీధిలో తన ఇన్‌స్టా స్టోరీలు పోస్ట్ చేస్తోంది" అని ప్రియాంక చోప్రాను మధ్యలోకి లాగి మరి సెటైర్లు వేశాడు మహేశ్ బాబు.

బ్లైండ్‌గా ఏసేస్తా

"హలో హీరో.. సెట్‌లో నువ్వు నాతో పంచుకునే కథలన్నీ లీక్ చేయాలనుకుంటున్నావా. మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా ఏసేస్తా" అంటూ ప్రియాంక చోప్రా మహేశ్ బాబుకే అతని స్టైల్‌లో రిప్లై ఇచ్చింది. "ప్రియాంక చోప్రా నటిస్తుందనే విషయాన్ని నువ్వెందుకు బయటపెట్టావ్ మహేశ్. నువ్వు సర్‌ప్రైజ్‌ని నాశనం చేశావ్" అని రాజమౌళి అన్నారు.

"మీ ఉద్దేశంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక సర్‌ప్రైజ్ అని చెప్పాలనుకుంటున్నారా" అని మరో లీక్ వేస్తూ పంచ్ ఇచ్చాడు మహేష్ బాబు. "రాజమౌళి సార్. నేను ఇలాగే హైదరాబాద్‌కు వెకేషన్‌కు తిరిగితే నా కుటుంబం నన్ను అనుమానించడం స్టార్ట్ చేస్తారు" అని పృథ్వీరాజ్ సుకుమారన్ రియాక్ట్ అయ్యాడు.

ఇప్పటికీ సర్‌ప్రైజ్ అనుకుంటే

"మహేశ్.. ఇప్పుడు నువ్వు అన్నీ నాశనం చేశావు" అని రాజమౌళి కోప్పడ్డారు. "సరే ఒక సంధి చేసుకుందాం. ఇప్పటికే అందరికీ తెలిసిన ఏదో ఒక విషయాన్ని రేపు ప్రకటించండి. మీరు ఇప్పటికే దాన్ని సర్‌ప్రైజ్ అని అనుకుంటే" అని లాస్ట్ పంచ్ మహేశ్ బాబు ఇచ్చాడు.

మహేశ్ బాబు రాజమౌళి ట్వీట్స్
మహేశ్ బాబు రాజమౌళి ట్వీట్స్

"డీల్ ఓకే. కానీ, అతిగా వ్యంగంగా మాట్లాడినందుకు జరిమానాగా మీ ఫస్ట్ లుక్ రిలీజ్‌ను ఆలస్యం చేయాలని నిర్ణయించుకున్నాను" అని షాక్ ఇచ్చాడు రాజమౌళి. ఇలా జరిగిన ట్వీట్ యుద్ధంలో చివరిలో మహేశ్ బాబు అభిమానులకు జక్కన్న దెబ్బేశాడు.