కూతురు సితార, సోదరి శిల్పాతో కలిసి నమ్రతా శిరోద్కర్ దీపావళి వేడుకలు.. మహేశ్ బాబు ఎక్కడంటూ ప్రశ్నలు

సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ తన కూతురు సితారా, సోదరి శిల్పా శిరోద్కర్‌తో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి చూసిన సూపర్ స్టార్ అభిమానులు, నెటిజన్స్ మహేశ్ బాబు ఎక్కడంటూ ప్రశ్నలు వేశారు.

Published on: Oct 20, 2025 7:24 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశంలో దీపావళి పండుగ వేడుకలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా అంతా దివాళీని సెలబ్రేట్ చేసుకుంటారు. సినీ సెలబ్రిటీలు కూడా తమ సన్నిహితులు, కుటుంబీకులు, బంధువులతో దీపావళి పండుగను సంతోషంగా ఆస్వాదిస్తున్నారు.

కూతురు సితార, సోదరి శిల్పాతో కలిసి నమ్రతా శిరోద్కర్ దీపావళి వేడుకలు.. మహేశ్ బాబు ఎక్కడంటూ ప్రశ్నలు
కూతురు సితార, సోదరి శిల్పాతో కలిసి నమ్రతా శిరోద్కర్ దీపావళి వేడుకలు.. మహేశ్ బాబు ఎక్కడంటూ ప్రశ్నలు

నమ్రతా శిరోద్కర్ దివాళి వేడుకలు

ఈ క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ దీపావళి వేడుకలను జరుపుకున్నారు. కూతురు సితార, సోదరి శిల్పా శిరోద్కర్‌తో కలిసి నమ్రతా శిరోద్కర్ దివాళి పండుగను సంతోషంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నమ్రతా శిరోద్కర్.

మరుపురాని దివాళి రాత్రులు

ఈ ఫొటోలకు "వెలుగులు, అద్భుతమైన మనుషులుతో ఈ సాయంత్ర నిండిపోయింది. నిజంగా మరుపురాని దివాళి రాత్రులు" అని క్యాప్షన్ రాసుకొచ్చారు నమత్రా శిరోద్కర్. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో సితార, నమ్రతా శిరోద్కర్ ఎంతో అందంగా కనిపించారు.

ఒక్కటి తక్కువైందని

నమ్రతా శిరోద్కర్ గులాబీ రంగు దుస్తుల్లో అద్భుతంగా కనిపిస్తే.. సితార బంగారు-పసుపు లెహంగాలో మెరిసిపోయింది. అయితే, ఈ ఫొటోల్లో ఒక్కటి తక్కువైందని నెటిజన్స్ గమనించారు. ఫొటోల్లో లేని సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి అభిమానులు, నెటిజన్స్ కామెంట్స్ రూపంలో అడగడం మొదలుపెట్టారు.

మహేశ్ బాబు ఎక్కడంటూ

'మా సూపర్ స్టార్ ఎక్కడ?' అని ఒకరు రాశారు. మరికొందరు 'బాబు ఎక్కడ ఉన్నారు', 'బాబు ఎక్కడ ఉన్నారు' అని ప్రశ్నించారు. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు నమ్రతను తన కుమార్తెతో మరిన్ని చిత్రాలను పంచుకోమని కోరారు.

అభిమానుల నిరాశ

ఇలా నమ్రతా దివాళి వేడుకల్లో మహేశ్ బాబు లేకపోవడం సూపర్ స్టార్ అభిమానులు నిరాశ చెందారు. ఇదిలా ఉంటే, మహేశ్ బాబు ఎస్ఎస్ఎంబీ 29 (SSMB29) మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది.

పెద్దమ్మగా ప్రియాంక చోప్రా

ఇటీవలే ప్రియాంక చోప్రా పెద్దమ్మగా మారింది. ప్రియాంక చోప్రా కజిన్ సోదరి పరిణీతి చోప్రా బేబీ బాయ్‌కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ బాహుబలి సినిమా రెండు పార్ట్స్ ఒక్కటిగా మారి బాహుబలి ది ఎపిక్ అనే టైటిల్‌తో రిలీజ్ కానుంది.