...
...
Next Story

బాక్సాఫీస్ దగ్గర బాస్ బ్యాటింగ్-మన శంకర వర ప్రసాద్ గారు కలెక్షన్ల మోత-చిరంజీవి కెరీర్లోనే టాప్-2లోకి ఎంట్రీ

బాక్సాఫీస్ దగ్గర బాస్ చిరంజీవి బ్యాటింగ్ కొనసాగుతోంది. మన శంకర వర ప్రసాద్ గారు మూవీ కలెక్షన్ల మోత మోగిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది.

Published on: Jan 17, 2026 02:08 PM IST
Advertisement

మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటించిన 'మన శంకర వర ప్రసాద్ గారు' (MSVPG) చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఇది మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 2వ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా చిరు కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగానూ అవతరించే దిశగా దూసుకుపోతోంది.

మన శంకర వర ప్రసాద్ గారు కలెక్షన్లు

మన శంకర వర ప్రసాద్ గారులో చిరంజీవి
మన శంకర వర ప్రసాద్ గారులో చిరంజీవి

మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.226 కోట్లు వసూలు చేసిందని దర్శకుడు అనిల్ రావిపూడి శనివారం (జనవరి 17) ప్రకటించారు. ఈ వార్తను పంచుకుంటూ, ఆయన ట్విట్టర్ లో.. ‘‘ప్రేక్షకులు తమ తీర్పు చెప్పారు. బాక్సాఫీస్ వద్ద బాస్ బ్యాటింగ్ కొనసాగుతోంది. మనశంకరవరప్రసాద్ గారు. మెగా సంక్రాంతి బ్లాక్ బస్టర్’’ అని రాశారు. సక్నిల్క్ ప్రకారం ఈ చిత్రం ఐదు రోజుల్లో కేవలం ఇండియాలోనే రూ.120.33 కోట్లు కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఏమో రూ.226 కోట్ల గ్రాస్ అందుకుంది.

చిరు సెకండ్ మూవీ

Chiranjeevi's top 5 grossersCollection
Sye Raa Narasimha Reddy 246.6 crore
Mana Shankara Vara Prasad Garu 225 crore & counting
Waltair Veerayya 219 crore
Khaidi No 150 164 crore
Godfather 107 crore
View All

మన శంకర వర ప్రసాద్ గారు గురించి

మన శంకర వర ప్రసాద్ గారు సినిమా డైరెక్టర్ గా అనిల్ రావిపూడికి వరుసగా 9వ హిట్. 'ఎఫ్2: ఫన్ & ఫ్రస్ట్రేషన్', 'సరిలేరు నీకెవ్వరు' వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అతని చివరి చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలలో ఒకటి.

సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన మన శంకర వర ప్రసాద్ గారు చిత్రంలో చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించగా, వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించారు. విడాకులైన ఆరు సంవత్సరాల తర్వాత భార్యను తిరిగి గెలుచుకోవడానికి ప్రయత్నించే సెక్యూరిటీ అధికారి కథను ఇది చెబుతుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe