తన సుదీర్ఘ కెరీర్ లో సంక్రాంతికి చాలానే హిట్లు అందుకున్నారు మెగాస్టారు చిరంజీవి. ఇప్పుడు 2026 సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు మూవీతో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నారు. ఇవాళ (జనవరి 12) థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఓటీటీ రిలీజ్ పై ఇంట్రెస్ట్ నెలకొంది.
మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ

చిరంజీవి, నయనతార జంటగా నటించిన మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఇందులో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో సాగిపోతుంది. ఈ మూవీ జీ5 ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను జీ5 సొంతం చేసుకుంది. శాటిలైట్ హక్కులను జీ తెలుగు దక్కించుకుంది.
ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?
మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ రిలీజ్ ఎప్పుడనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ మూవీ జీ5 ఓటీటీలోకి రానుంది. సాధారణంగా అయితే తెలుగు సినిమాలు థియేటర్లలో రిలీజైన నాలుగు నుంచి ఆరు వారాల మధ్యలో ఓటీటీలోకి వస్తున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా డిజిటల్ స్ట్రీమింగ్ కు రావొచ్చు. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
మన శంకర వరప్రసాద్ గారు స్టోరీ
మన శంకర వరప్రసాద్ గారు మూవీలో టైటిల్ లీడ్ ప్లే చేసిన చిరంజీవి ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నటించారు. కేంద్రమంత్రి సెక్యూరిటీ ఆయన చూసుకుంటారు. మరోవైపు శశిరేఖ (నయనతార)తో పెళ్లవుతుంది. కానీ భార్య, పిల్లలకు వరప్రసాద్ (చిరంజీవి) ఉండాల్సి వస్తుంది. మరి వీళ్లు విడిపోవడానికి కారణం ఎవరు? తిరిగి కలిశారా? లేదా? అన్నది మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో చూడాల్సిందే.
పాజిటివ్ టాక్
{{/usCountry}}మన శంకర వరప్రసాద్ గారు మూవీలో టైటిల్ లీడ్ ప్లే చేసిన చిరంజీవి ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నటించారు. కేంద్రమంత్రి సెక్యూరిటీ ఆయన చూసుకుంటారు. మరోవైపు శశిరేఖ (నయనతార)తో పెళ్లవుతుంది. కానీ భార్య, పిల్లలకు వరప్రసాద్ (చిరంజీవి) ఉండాల్సి వస్తుంది. మరి వీళ్లు విడిపోవడానికి కారణం ఎవరు? తిరిగి కలిశారా? లేదా? అన్నది మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో చూడాల్సిందే.
పాజిటివ్ టాక్
{{/usCountry}}మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి మరోసారి సంక్రాంతి హిట్ కొట్టారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా వింటేజీ లుక్ లో చిరంజీవి అదిరిపోయారని ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. అంతే కాకుండా ఫస్ట్ టైమ్ స్క్రీన్ మీద చిరంజీవి, వెంకటేశ్ ను కలిసి చూడటంతో చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు.