టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన ఉదారతతో మరోసారి అందరి మనసు గెలుచుకున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మక 'ఎన్టీఆర్ అవార్డు'తో గౌరవించడంతో పాటు రూ. 10 లక్షల నగదు పురస్కారాన్ని అందజేసిన సంగతి తెలిసిందే.

అయితే, ఈ మొత్తాన్ని తన సొంతానికి వాడుకోకుండా.. తన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలకు విరాళంగా ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి.
ఐదు సంస్థలకు అండగా మెగాస్టార్
సామాజిక సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఐదు వేర్వేరు సంస్థలకు చిరంజీవి ఈ ఎన్టీఆర్ అవార్డ్ నగదు రూ. 10 లక్షలను పంపిణీ చేశారు. 'సర్వ్ ఫౌండేషన్'కు చెందిన 30 మంది వృద్ధులను స్వయంగా ఆహ్వానించి, వారికి కొత్త బట్టలు బహుకరించి విందు భోజనం ఏర్పాటు చేశారు.
దీంతో పాటు దృష్టి లోపం ఉన్న వారికి అండగా నిలుస్తున్న 'దేవ్నార్ ఫౌండేషన్', అనాథ పిల్లల కోసం పనిచేస్తున్న 'వాల్మీకి ఫౌండేషన్', 'నయశ్రీ ఫౌండేషన్'లకు ఆర్థిక సాయం అందజేశారు. అలాగే క్యాన్సర్తో పోరాడుతున్న ఒక చిన్నారి చికిత్స నిమిత్తం 'బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్'కు విరాళం ఇచ్చి ఆ కుటుంబానికి భరోసానిచ్చారు చిరంజీవి.
కొడుకుపై తండ్రి ప్రేమ.. ఎమోషనల్ పోస్ట్!
అలాగే, రామ్ చరణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి ఎక్స్ (X) వేదికగా ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు. చరణ్ చిన్నప్పటి ఫోటోలను షేర్ చేస్తూ.. "చరణ్ బాబు.. చిన్నప్పుడు నా వేలు పట్టుకుని నడిచిన స్థాయి నుంచి, ఈరోజు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచే స్థాయికి ఎదిగావు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. సినిమాను, వ్యక్తిగత జీవితాన్ని నువ్వు బ్యాలెన్స్ చేసే విధానం, కుటుంబం పట్ల నీ బాధ్యత, దైవ భక్తి, క్రమశిక్షణ చూసిన ప్రతిసారీ నీపై నా ప్రేమ, గౌరవం పెరుగుతూనే ఉంటాయి" అని చిరంజీవి రాసుకొచ్చారు.
"దేవుడి ఆశీస్సులు, అభిమానుల ప్రేమాభిమానాలు నిన్ను మరిన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలని కోరుకుంటున్నాను" అని మెగాస్టార్ చిరంజీవి కోరారు. దీనికి రామ్ చరణ్ స్పందిస్తూ.. "థాంక్యూ నాన్న.. మీ ఆశీస్సులే నాకు సర్వస్వం" అని బదులిచ్చారు.
సినిమా విశేషాలు
{{/usCountry}}"దేవుడి ఆశీస్సులు, అభిమానుల ప్రేమాభిమానాలు నిన్ను మరిన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలని కోరుకుంటున్నాను" అని మెగాస్టార్ చిరంజీవి కోరారు. దీనికి రామ్ చరణ్ స్పందిస్తూ.. "థాంక్యూ నాన్న.. మీ ఆశీస్సులే నాకు సర్వస్వం" అని బదులిచ్చారు.
సినిమా విశేషాలు
{{/usCountry}}చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' అనే సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో త్రిష కృష్ణన్ హీరోయిన్గా నటిస్తోంది.
పెద్ది సినిమా గురించి
మరోవైపు రామ్ చరణ్ పెద్ది సినిమా కోసం రెడీ అవుతున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న పెద్ది సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తోంది. పెద్ది సినిమా ఏప్రిల్ 30న విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.