మలయాళ చిత్ర పరిశ్రమలో దిగ్గజ నటుడు, సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇంట్లో పెను విషాదం నెలకొంది. మోహన్ లాల్ మాతృమూర్తి శాంతకుమారి (90) మంగళవారం (డిసెంబర్ 30) మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. కొచ్చిలోని ఎలమక్కరలో ఉన్న మోహన్ లాల్ నివాసంలోనే ఆమె కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు.
వృద్ధాప్య సమస్యలతో పోరాటం

శాంతకుమారి గత పదేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నారు. ఆ అనారోగ్యం కారణంగా ఆమె చాలా కాలంగా మంచానికే పరిమితమయ్యారు. తొలుత తిరువనంతపురంలో ఉన్న శాంతకుమారిని మెరుగైన చికిత్స కోసం మోహన్ లాల్ కొచ్చికి తీసుకువచ్చారు.
అక్కడే ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తూ, తన నివాసంలోనే ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 10న ఆమె తన 90వ పుట్టినరోజును కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు.
షూటింగ్ నుంచి హుటాహుటిన..
తల్లి మరణ వార్త తెలిసే సమయానికి మోహన్ లాల్ కొచ్చిలోనే ఒక సినిమా షూటింగ్లో ఉన్నారు. విషయం తెలియగానే ఆయన హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. మోహన్ లాల్కు తన తల్లితో ఉన్న అనుబంధం చాలా గొప్పది. తనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినప్పుడు కూడా, ఆయన అవార్డు తీసుకుని నేరుగా వచ్చి ముందుగా తన తల్లి ఆశీర్వాదమే తీసుకున్నారు. అనేక ఇంటర్వ్యూలలో తన విజయానికి మూలం తన తల్లేనని ఆయన గర్వంగా చెప్పుకునేవారు మోహన్ లాల్.
తరలివచ్చిన మెగాస్టార్
మోహన్ లాల్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం కొద్దీ మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ వార్త తెలియగానే ఎలమక్కరలోని వారి నివాసానికి చేరుకున్నారు. తన ప్రాణ మిత్రుడిని పరామర్శించి, శాంతకుమారి భౌతిక కాయానికి నివాళులర్పించారు. మమ్ముట్టితో పాటు మాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు మోహన్ లాల్కు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
కాగా, శాంతకుమారి భర్త, కేరళ ప్రభుత్వ మాజీ లా సెక్రటరీ విశ్వనాథన్ నాయర్ చాలా ఏళ్ల క్రితమే మరణించారు. వారి పెద్ద కుమారుడు ప్యారీలాల్ కూడా 2000వ సంవత్సరంలో మృతి చెందారు.
{{/usCountry}}కాగా, శాంతకుమారి భర్త, కేరళ ప్రభుత్వ మాజీ లా సెక్రటరీ విశ్వనాథన్ నాయర్ చాలా ఏళ్ల క్రితమే మరణించారు. వారి పెద్ద కుమారుడు ప్యారీలాల్ కూడా 2000వ సంవత్సరంలో మృతి చెందారు.
{{/usCountry}}విషాదం నెలకొనడం
ఇప్పుడు తల్లి కూడా దూరమవ్వడంతో మోహన్ లాల్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు ‘అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ పోస్టులు పెడుతున్నారు. న్యూ ఇయర్లోకి అడుగుపెడుతున్న వేళ మోహన్ లాల్ ఇంట్లో విషాదం నెలకొనడం అభిమానులతోపాటు సినీ ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.